అన్వేషించండి

Vodafone Idea Shareholders: వొడాఫోన్‌ ఐడియాలో కేంద్రానికి '36%' వాటా.. 19% నష్టపోయిన షేరు!!

ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుణాలను వొడాఫోన్ ఐడియా బోర్డు ఈక్విటీగా మార్చేందుకు నిర్ణయించింది. దాంతో దేశంలోనే మూడో అతిపెద్ద టెలికాం సంస్థలో ప్రభుత్వానికి 36 శాతం వాటా దక్కింది.

నిధుల కోసం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు ఉపసంహరిస్తున్న కాలమిది! అలాంటిది టెలికాం ఆపరేటర్‌ వొడాఫోన్‌ ఐడియాలో కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా అవతరించింది. నష్టాలతో విలవిల్లాడుతున్న ఈ కంపెనీలో 36 శాతం వాటాను సొంతం చేసుకుంది.

ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుణాలను వొడాఫోన్ ఐడియా బోర్డు ఈక్విటీగా మార్చేందుకు నిర్ణయించింది. దాంతో దేశంలోనే మూడో అతిపెద్ద టెలికాం సంస్థలో ప్రభుత్వానికి 36 శాతం వాటా దక్కింది. దాంతో 'వి'లో ఇప్పటికే ఉన్న వాటాదారులు, కంపెనీ, స్థాపకుల వాటాల విలువ తగ్గిపోయింది. వొడాఫోన్‌ గ్రూపునకు 28.5 శాతం, ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు 17.8 శాతం వాటా దక్కింది.

Also Read: Multibagger stock: పెన్నీ స్టాక్‌.. 2 ఏళ్లు.. లక్ష పెట్టుబడి.. రూ.50 లక్షలు ప్రాఫిట్‌!

Also Read: CCD New CEO Malavika Hegde: భర్త విధికి తలవంచితే.. ఆమె ఎదిరించి నిలబడింది.. ఓ మంచి కాఫీ లాంటి కథ!

'2022, జనవరి 10న బోర్డ్‌ ఆఫ్ డైరెక్లర్లు సమావేశం నిర్వహించారు. స్పెక్ట్రమ్‌ వేలానికి సంబంధించిన వడ్డీ, ఏజీఆర్‌ చెల్లింపులను ఈక్విటీగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు' అని వొడాఫోన్‌ ఐడియా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి తెలిపింది. స్పెక్ట్రమ్‌ వేలం నెట్‌ ప్రజెంట్‌ వాల్యూ, ఏజీఆర్‌ వడ్డీలు రూ.16,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. 2021, మార్చి నాటికి 'వి'కి రూ.1.80 లక్షల కోట్ల రుణాలు ఉన్నాయి.

రిలయన్స్‌ జియో టెలికాం రంగంలో ప్రవేశించిన తర్వాత ఐడియా తట్టుకోలేకపోయింది. తక్కువ ధరల యుద్ధంలో ఐడియా వినియోగదారులు ఎక్కువగా జియోకు తరలిపోయారు. ఫలితంగా కంపెనీ నష్టాల్లో చిక్కుకుంది. వీటి నుంచి బయటపడి మార్కెట్లో నిలదొక్కుకొనేందుకు వొడాఫోన్‌తో కలిసి వొడాఫోన్‌ ఐడియాగా జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసింది. అయినప్పటికీ లాభాలేమీ రాలేదు. రుణాలు పెరిగిపోయాయి. తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వ రుణాలను ఈక్విటీగా మార్చాల్సి వచ్చింది.

Vodafone Idea Shareholders: వొడాఫోన్‌ ఐడియాలో కేంద్రానికి '36%' వాటా.. 19% నష్టపోయిన షేరు!!

'వి'లో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా మారిందని తెలియడంతో మంగళవారం వొడాఫోన్‌ ఐడియా కంపెనీ షేర్లు 19 శాతం నష్టపోయాయి. ట్రేడింగ్‌ సెషన్‌ ఆరంభంలో షేరు ధర రూ.12.05కు చేరుకుంది. 11.30 గంటల సమయంలో కాస్త పుంజుకొని రూ.13 వద్ద కొనసాగుతోంది.

Also Read: PNB Service Charges: కస్టమర్లకు పీఎన్‌బీ షాక్‌! సర్వీస్‌ ఛార్జెస్‌ పెంచేసిన పంజాబ్‌ బ్యాంక్‌

Also Read: Reliance Mandarin Hotel Deal: అమెరికాలో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ కొనుగోలు చేసిన రిలయన్స్‌.. ఎంతకో తెలుసా?

Also Read: Anand Mahindra: మహీంద్రా కాకుండా వేరే కార్లున్నాయా? ఆనంద్‌ మహీంద్రా ఆశ్చర్యం!!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget