Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర.. హైదరాబాద్లో భారీగా పెరిగిన వెండి, తాజా ధరలివే..
భారత మార్కెట్లో బంగారం ధరలు పెరగ్గా.. వెండి ధర రూ.0.20 పైసల మేర తగ్గింది. కానీ, హైదరాబాద్ మార్కెట్లో మాత్రం వెండి గ్రాముకు రూ.4.70 పెరగడం గమనార్హం.
![Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర.. హైదరాబాద్లో భారీగా పెరిగిన వెండి, తాజా ధరలివే.. Gold Silver Price Today 28 August 2021 know rates in your city Andhra Pradesh Amaravati Telangana Hyderabad Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర.. హైదరాబాద్లో భారీగా పెరిగిన వెండి, తాజా ధరలివే..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/18/c008b9e919c65ef117b8f16db115a98d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత్లో బంగారం ధర ఈ రోజు (ఆగస్టు 28) కాస్త ఎక్కువగానే పెరిగింది. గ్రాముకు రూ.40 పెరుగుదల కనిపించింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ రూ.46,620 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.47,620 గా ఉంది. మొత్తానికి గత 10 రోజుల ధరలతో పోలిస్తే పసిడి ధర పెరిగింది.
భారత మార్కెట్లో బంగారం ధరలు పెరగ్గా.. వెండి ధర రూ.0.20 పైసల మేర తగ్గింది. కానీ, హైదరాబాద్ మార్కెట్లో మాత్రం వెండి గ్రాముకు రూ.4.70 పెరగడం గమనార్హం. తాజాగా భారత మార్కెట్లో కిలో వెండి ధర రూ.63,000గా కొనసాగుతోంది. హైదరాబాద్లో మాత్రం వెండి కిలోకు రూ.4,700 వరకూ వెండి ధర ఎగబాకింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర కాస్త ఎక్కువగా రూ.67,900 ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఆగస్టు 28న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర గ్రాముకు రూ.20 చొప్పున పెరిగింది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.48,440 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6) ధర రూ.44,400 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.67,900 పలికింది.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ఆగస్టు 28న గ్రాముకు రూ.20 పెరిగి.. రూ.44,400 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,440గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,900గా ఉంది. విశాఖపట్నం పసిడి మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,400 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,440గా ఉంది. ఇక్కడ కూడా వెండి ధర కిలో హైదరాబాద్ తరహాలోనే రూ.67,900 పలుకుతోంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఆగస్టు 28న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,620ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,620గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,840 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,920గా ఉంది.
ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర హైదరాబాద్లో గ్రాము రూ.2,360గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఈ ధర గ్రాముకు రూ.8 తగ్గింది. హైదరాబాద్లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,600 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అదే కొనసాగుతోంది.
అనేక అంశాలపై పసిడి ధర
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)