By: ABP Desam | Updated at : 25 Jan 2023 05:56 AM (IST)
Edited By: Arunmali
బంగారం, వెండి ధర - 25 జనవరి 2023
Gold-Silver Price 25 January 2023: పసిడి ధర ఒక్కసారే పెరిగింది. ఇవాళ, 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ₹ 350, స్వచ్ఛమైన పసిడి ₹ 380 చొప్పున పెరిగాయి. బిస్కట్ బంగారం ధర యాభైఏడున్నర వేలకు చేరింది. కిలో వెండి ధర ₹ 200 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి:
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 52,700 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 57,490 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో ₹ 74,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 52,700 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 57,490 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 74,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్ రేటే అమలవుతోంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 53,550 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 58,420 కి చేరింది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 52,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,490 కి చేరింది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 52,850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,650 గా నమోదైంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 52,750 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,550 గా ఉంది.
మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 52,750 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,550 గా ఉంది.
పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 52,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,490 గా ఉంది.
ప్లాటినం ధర (Today's Platinum Rate)
సంపన్నులు ఆసక్తి చూపించే విలువైన లోహం 'ప్లాటినం' ధర 10 గ్రాములకు ₹ 350 పెరిగి ₹ 27,540 కి చేరింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావం వల్లే ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.
Adani Group: $100 బిలియన్లు పాయే - ఆసియాలోనూ నం.1 పోస్ట్ లేదు, అప్పులపై RBI ఆరా
TV Prices: టీవీలు మరింత చవగ్గా వస్తాయ్, తొందరపడి ఇప్పుడే కొనకండి
Stock Market News: బడ్జెట్ రెండో రోజు స్టాక్ మార్కెట్లు ఎలా ట్రేడవుతున్నాయంటే! ఐటీసీ షేర్ల జాక్పాట్!
Credit Suisse - Adani: అదానీ బాండ్లకు విలువ లేదట, టైమ్ చూసి దెబ్బకొట్టిన క్రెడిట్ సూయిస్
Adani Group Stocks: క్రెడిట్ సూయిస్కు జత కలిసిన సిటీ గ్రూప్ - అదానీ స్టాక్స్ పతనం కంటిన్యూస్
Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు
Rompicharla: టీడీపీ లీడర్పై తుపాకీ కాల్పుల కలకలం- ఆ వైసీపీ ఎమ్మెల్యే పనేనంటున్న తెలుగుదేశం
Director Sagar Death: టాలీవుడ్ లో మరో విషాదం, ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూత
Yogi Adityanath Best CM: యోగియే నంబర్ వన్, ది బెస్ట్ సీఎం అని తేల్చి చెప్పిన సర్వే - సెకండ్ ప్లేస్లో కేజ్రీవాల్