అన్వేషించండి

IPS PV Sunil : ఐపీఎస్ పీవీ సునీల్‌పై విచారణకు కమిటీ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh: సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇద్దరు సీనియర్ అధికారులకు ఆ బాధ్యతలు ఇచ్చింది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించింది.

AP government appointed a committee to investigate IPS officer PV Sunil:  పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై విచారణకు అధారిటీని ప్రభుత్వం నియమించింది.   ఆయనపై గతంలో నమోదు అయిన అభియోగాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆయన ఇచ్చిన వివరణను తిరస్కరించిన ప్రభుత్వం  ఎంక్వయిరీకి AP సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. విచారణకు అథారిటీని వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తాలు ఉంటారు.  సాధ్యమైనంత త్వరగా సునీల్ కుమార్‌పై ఉన్న అభియోగాలపై నివేదిక ఇవ్వాలని అధారిటీని ప్రభుత్వం ఆదేశించింది. 


సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పీవీ సునీల్ కుమార్ వైఎస్ఆర్‌సీపీ హయాంలో సీఐడీ చీఫ్ గా ఉన్నారు. ఆ సమయంలో ఆయన చాలా అవకతవకలకు పాల్పడ్డారని .. వైసీపీ అధినేత కోసం టీడీపీ నేతల్ని తప్పుడు కేసులతో వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చారు. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసు విషయంలో సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ కారణంగా ఆయనపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆయనకు ఎక్కడా పోస్టింగ్ రాలేదు. రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన కీలక పాత్ర ధారి అని ఫిర్యాదు దారు, డిప్యూటీ స్పీకర్ రఘురామ ఆరోపిస్తున్నారు. 

ప్రస్తుతం రఘురామ పై కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్టు అయిన మాజీ ఓఎస్డీ విజయ్ పాల్, కామేపల్లి తులసీబాబు అనే వ్యక్తులు ఇద్దరూ సునీల్ కు సన్నిహితులని చెబుతున్నారు. కామేపల్లి తులసిబాబు సీఐడీకి లీగల్ అడ్వయిజర్ గా..సునీల్ నియమించారని ఆయనను అడ్డం పెట్టుకుని దందాలు చేశారని అంటున్నారు. తనను అరెస్టు చేసిన రోజున సీఐడీ ఆఫీసులో తనపై కూర్చుని.. తనకు ఊపిరి ఆడకుండా చేసి చంపే ప్లాన్ చశారని దానికి పీవీ సునీలే కారణమని రఘురామ ఆరోపిస్తున్నారు. అదే సమయంలో తులసీబాబును అడ్డం పెట్టుకుని అగ్రిగోల్డ్ కు బాధితులకు అందాల్సిన సొమ్మును పక్కదోవ పట్టించి దోచుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే నివేదిక రెడీ అయినట్లుగా చెబుతున్నారు. 

అలాగే సునీల్ కుమార్ సర్వీసులో ఉంటూనే ఓ మతపరమైన సంస్థను నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన హిందూత్వంపై గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అయింది. మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని కొన్ని సంస్థలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. పలుమార్లు కేంద్ర హోంశాఖ నుంచి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి లేఖలు వచ్చాయి. ఓ సారి గట్టిగా హెచ్చరికలు రావడంతో ఆయనను సీఐడీ చీఫ్ పదవి నుంచి బదిరి చేసినట్లుగా చెబుతున్నారు. తాజాగా విచారణకు కమిటీ వేయడంతో చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 

Also Read: YS Sharmila: సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబును ఏకిపారేసిన షర్మిల, హోదాపై సైతం ఆసక్తికర వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget