అన్వేషించండి

Gautam Adani: అదానీ గ్రూప్‌ మీద దాడికి సరిగ్గా సంవత్సరం, గౌతమ్‌ అదానీ రియాక్షన్‌ ఇది

మాపై దాడి చేసిన వ్యక్తులు బహిరంగంగా అందరికీ అందుబాటులో ఉన్న సమాచారాన్ని వ్యూహాత్మకంగా వినియోగించారు

Gautam Adani Blog: స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు చేసే వాళ్లకు, బిజినెస్‌ వార్తలను ఫాలో అయ్యే వాళ్లకు హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ (Hindenburg Research) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆరోపణలతో కూడిన ఒక బ్లాస్టింగ్‌ రిపోర్ట్‌తో, ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌తో పాటు ప్రపంచ పారిశ్రామిక వర్గాల్లో ఆ కంపెనీ ప్రకంపనలు సృష్టించింది. అమెరికన్‌ షార్‌ సెల్లర్‌ కంపెనీ అయిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌, అదానీ గ్రూప్‌ మీద చేసిన దాడికి సరిగ్గా సంవత్సరం అయింది. 2023 జనవరి 24న హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ రిలీజ్‌ అయింది. ఆ రిపోర్ట్‌ తర్వాత, అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ అథఃపాతాళానికి పడ్డాయి.

బ్లాగ్‌లో గుర్తు చేసుకున్న గౌతమ్‌ అదానీ
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వచ్చిన సరిగ్గా సంవత్సరం తర్వాత.. బిలియనీర్ ఇండస్ట్రియలిస్ట్‌, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ‍‌(Gautam Adani) మళ్లీ ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన గురించి చెబుతూ తన బ్లాగ్‌లో ఇలా రాశారు "గత సంవత్సరం మాకు ఒక గొప్ప పాఠంగా నిలిచింది. మా వ్యాపారాన్ని నాశనం చేయడానికి ఒక సంస్థ ఎంతవరకు నిరాధారమైన ఆరోపణలు చేయగలదో కూడా మేం చూశాం. అది పెద్ద వ్యూహాత్మక దాడి. అది జరిగింది, మేము దానికి సాక్షులుగా ఉన్నాం".

టైమ్స్ ఆఫ్ ఇండియా కోసం కూడా గౌతమ్ అదానీ స్పందించారు. "అదానీ గ్రూప్ అతి పెద్ద దాడిని ఎదుర్కొంది, కోలుకుంది. ఆ సంఘటన తర్వాత మేం బలంగా తయారయ్యాం" అని రాశారు.

మోసపూరిత దాడులను ఎదుర్కొన్నాం
"మాపై దాడి చేసిన వ్యక్తులు బహిరంగంగా అందరికీ అందుబాటులో ఉన్న సమాచారాన్ని వ్యూహాత్మకంగా వినియోగించారు. అసంపూర్ణమైన, నిరాధారమైన విషయాలను రహస్య ప్రయోజనాల కోసం ఉపయోగించారు. వాటితో నిరాధార ఆరోపణలు చేశారు, అదానీ గ్రూప్‌పై దుర్మార్గపు దాడికి పాల్పడ్డారు. గడ్డు పరిస్థితి ఎదురైనా అదానీ గ్రూప్ వెనుకడుగు వేయలేదు. ఆ ఆరోపణల తర్వాత కూడా మేము సంయమనం కోల్పోలేదు. మా పెట్టుబడిదార్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మా బలాలను & కీలక వ్యాపార అంశాలన్నింటినీ పునఃసమీక్షించాం. అదానీ గ్రూప్‌ ఆర్థిక స్థితి పటిష్టంగా ఉండేలా చూసుకున్నాం. మా కార్పొరేట్ విధానాలు దోషరహితం. అవి ఎప్పటికీ అలాగే కొనసాగుతాయి. భారతదేశ అవస్థాపనలో ముఖ్య పాత్రను కొనసాగించేలా మా వృద్ధి ప్రణాళికను పునఃపరిశీలించాం" అని కూడా తన బ్లాగ్‌లో గౌతమ్‌ అదానీ రాసుకొచ్చారు.

2023 సంవత్సరాన్ని అభ్యాస సంవత్సరంగా అభివర్ణించారు గౌతమ్ అదానీ. ఇంకా "గత సంవత్సరం అనుభవాలు, కష్టాలు మాకు మరింత విలువైన విషయాలను నేర్పించాయి. మేం పాఠాలు నేర్చుకున్నాం, బలపడ్డాం. భారతీయ వ్యవస్థపై మా విశ్వాసం మరింత బలపడింది" అని గౌతమ్‌ అదానీ స్పందించారు.

2023 జనవరి 24న, హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ నివేదిక వెలువడింది. బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్‌ కంపెనీలు మోసం, స్టాక్ మానిప్యులేషన్, ఇతర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాయని, మారిషస్‌లో సూట్‌కేస్‌ కంపెనీలను స్థాపించి, వాటి ద్వారా షేర్ల ధరలను కృత్రిమంగా పెంచాయని తన నివేదికలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ ఆరోపించింది. ఆ రిపోర్ట్‌ తర్వాత, గౌతమ్ అదానీ గ్రూప్‌ కంపెనీల స్టాక్స్‌లో ‌(Adani Group Stocks) నాన్‌ స్టాప్‌ సెల్లింగ్‌ జరిగింది. ఒక దశలో, అదానీ గ్రూప్‌లోని ‍10 లిస్టెడ్‌ స్టాక్స్‌ మొత్తం మార్కెట్ విలువ రూ. 7 లక్షల కోట్ల మార్కు దిగువకు పడిపోయింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే అదానీ గ్రూప్ స్టాక్స్ 22% నుంచి 80% వరకు నష్టపోయాయి. ఆ తర్వాత జరిగిన వివిధ పరిణామాల నేపథ్యంలో అదానీ షేర్లు కోలుకున్నాయి.

మరో ఆసక్తికర కథనం: మరో ఆసక్తికర కథనం: భారతీయుల భయాలు అవే, ప్రి-బడ్జెట్‌ సర్వేలో ఆసక్తికర విషయాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget