![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Edible Oil Usage: వంట నూనె ధరలు పెరిగాయని ఏం చేశారో తెలుసా?
Edible Oil Usage: ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగ వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. భారత్లోనూ ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.
![Edible Oil Usage: వంట నూనె ధరలు పెరిగాయని ఏం చేశారో తెలుసా? Edible Oil Usage in India About 29 Percent Indian households downgraded edible oil- Report Edible Oil Usage: వంట నూనె ధరలు పెరిగాయని ఏం చేశారో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/29/f9c448d5a2bd89c6b7269198b42c43ad_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Edible Oil Usage: ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగ వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. భారత్లోనూ ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ధరలు కొండెక్కడంతో భారతీయులు వంట నూనె వాడకాన్ని బాగా తగ్గించేశారు. దాదాపుగా 29 శాతం మంది నూనె వాడకాన్ని తగ్గించేశారు. ముడి సరకుల ధరలు పెరగడంతో మరో 17 శాతం ఖర్చు చేయడం తగ్గించుకున్నారని ఓ నివేదిక తెలిపింది.
ప్రతి రెండు కుటుంబాల్లో ఒకరిపై ధరల పెరుగుదల ప్రభావం పడింది. వారి సేవింగ్స్ తగ్గిపోతున్నాయి. వంట నూనెల బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వ, అనుచిత ధరల పెంపు, నూనెపై పరిమితులు విధించడాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని వినియోగదారులు కోరుకుంటున్నారని కమ్యూనిటీ సోషల్ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ నివేదిక వెల్లడించింది. పెరిగిన ధరల భారాన్ని ప్రజలపై వేయకుండా నూనె తయారీ సంస్థల వద్ద ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అంటున్నారు.
Also Read: వెంటాడుతున్న ద్రవ్యల్బణం భయాలు! మార్కెట్లకు మళ్లీ నష్టాలే!
కొవిడ్ ముందునాటితో పోలిస్తే పొద్దు తిరుగుడు, పల్లి, కెనోలా నూనెల ధర 50-70 శాతం వరకు పెరిగాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధమే ఇందుకు కారణం. అర్జెంటీనా నుంచి 85 శాతం సోయాబీన్ ఆయిల్ను భారత్ దిగుమతి చేసుకుంటుంది. రష్యా, ఉక్రెయిన్ నుంచి 90 శాతం వరకు పొద్దుతిరుగుడు నూనెను దిగుమతి చేసుకుంటుంది. ఇండోనేషియా, మలేసియా ఎక్కువగా భారత్కు పామ్ ఆయిల్ను ఎగుమతి చేస్తాయి.
వంట నూనెల ధరలు విపరీతంగా పెరగడం వల్ల సామాన్యుడి బడ్జెట్, వినియోగ ప్యాట్రెన్పై తీవ్ర ప్రభావం పడిందని నివేదిక వెల్లడించింది. గతంలోనే ధరలు పెరగడంతో డిసెంబర్లో ప్రభుత్వం పామ్ ఆయిల్పై 17.5 శాతంగా ఉన్న ఇంపోర్టు డ్యూటీని 12.5 శాతానికి తగ్గించింది. దాంతో వంటనూనెలపై ఉన్న సగటు ద్రవ్యోల్బణం 3 నుంచి 1.3 శాతానికి తగ్గిపోయింది. మళ్లీ ఇప్పుడు యుద్ధం వల్ల అది బాగా పెరిగిపోయింది.
Also Read: LPG ధరల్లో భారత్ నం.1, పెట్రోల్లో 3వ ర్యాంక్- బాదుడే బాదుడు, వీర బాదుడు!
గత 12 నెలలుగా వంట నూనెల ధరలు పెరుగుతున్నప్పటికీ వాడకం తగ్గించలేదని సగం మంది వినియోగదారులు అన్నారు. అయితే ప్రతి నెలా సేవింగ్స్ తగ్గిపోయి ఖర్చులు పెంచాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు ధరలు ఎక్కువవ్వడంతో సామాన్యులు తక్కువ ధరకు లభించే నాణ్యత లేని నూనెల తెచ్చుకుంటున్నారని తెలిసింది. వీటివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
Also Read: హ్యుండాయ్ క్రెటాలో కొత్త వేరియంట్ లాంచ్ - అదిరిపోయే ఫీచర్లు - ధర ఎంతంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)