అన్వేషించండి

Work From Home: WFH చేస్తున్నారా! కేంద్రం కొత్త రూల్స్‌ తీసుకొస్తోంది తెలుసా?

ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించనుంది. విద్యుత్‌, ఇంటర్నెట్‌ వంటి ఖర్చులను యజమాని చేత ఇప్పించేందుకు సిద్ధమవుతోందని తెలిసింది.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న ఉద్యోగులకు శుభవార్త! ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించనుంది. విద్యుత్‌, ఇంటర్నెట్‌ వంటి ఖర్చులను యజమాని చేత ఇప్పించేందుకు సిద్ధమవుతోందని తెలిసింది. ఈ సరికొత్త పని విధానానికి సంబంధించి లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది.

కొవిడ్‌-19 వ్యాప్తితో దేశవ్యాప్తంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే సౌకర్యం కల్పించాయి. కొన్ని సంస్థలు మానవ వనరులను బాగానే చూసుకుంటున్నా మరికొన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. ఇంటి వద్దే ఉంటున్నారు కదా అని ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్నాయి! అలాగే ఇంటర్నెట్‌, విద్యుత్‌ ఖర్చులు, ఇతర అలవెన్సులు ఇవ్వడం లేదు. ఇలాంటి వాటి నుంచి ఉద్యోగులకు రక్షణగా చట్టబద్ధ నిబంధనలు రూపొందించనున్నారు.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగుల కోసం ఓ చట్టబద్ధ విధానం రూపొందించేందుకు కేంద్రం దృష్టి సారించిందని ఓ సీనియర్‌ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈ మేరకు ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని వివరించారు. మున్ముందు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగ విధానం మరింత విస్తరించే అవకాశం ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో మున్ముందు పని విధానాలు ఎలా మారతాయో తెలియజేసేందుకు, ఉద్యోగులు, యజమానులకు ఎక్కువ ప్రయోజనాలు కల్పించేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు ఓ కన్సల్టెన్సీని ప్రభుత్వం నియమించింది. సేవల రంగానికి సంబంధించి ఈ ఏడాది జనవరిలోనే ప్రభుత్వం ఓ స్టాండింగ్‌ ఆర్డర్‌ ఇచ్చింది. పని గంటలు, సేవల విధివిధానాలు చర్చించుకొని రూపొందించుకోవాలని సూచించింది.

ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలు ఇప్పటికే ఈ విధానాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నాయి. ఇప్పుడు మిగిలిన రంగాల్లో విస్తరించేందుకు ప్రభుత్వం సమగ్ర పని విధానం రూపొందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విదేశాల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నిబంధనలపై నిబంధనలు రూపొందించిన సంగతి తెలిసిందే. కార్యాలయానికి దూరంగా పనిచేస్తున్న ఉద్యోగులకు రక్షణ కల్పిస్తున్నాయి.

Also Read: Multi bagger stock: రూ.లక్ష పెట్టుబడికి రూ.21 లక్షల లాభం ఇచ్చిన షేరు!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Gold-Silver Price: మరోసారి పెరిగిన బంగారం ధర.. వెండి నిలకడగా.. నేటి తాజా ధరలివీ..

Also Read: Petrol-Diesel Price, 6 December: నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరాల్లో హెచ్చుతగ్గులు.. తాజా ధరలు ఇలా..

Also Read: LIC Policy: రోజుకు 73 పెట్టుబడితో మెచ్యూరిటీకి రూ.10 లక్షలు పొందొచ్చు!

Also Read: WhatsApp : 2 కోట్ల మంది అకౌంట్ పీకేసిన వాట్సాప్ ! ఎందుకు..? ఏమిటి? ఎలా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Yashasvi Jaiswal:  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.