అన్వేషించండి

Reliance Campa Cola: మళ్లీ మార్కెట్‌లోకి కాంపా కోలా - కోకకోలా, పెప్సీకి పోటీ

మొదట తెలుగు రాష్ట్రాల్లో ఈ పానీయాన్ని రిలయన్స్‌ లాంచ్‌ చేసింది.

Reliance Campa Cola: మండే వేసవిలో జనాన్ని చల్లబరిచేందుకు, పోటీ కంపెనీల్లో వేడి పెంచేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒక కొత్త శీతల పానీయాన్ని (Beverage) మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 

రిటైల్‌ వ్యాపారంలో ఉన్న 'రిలయన్స్‌ రిటైల్ వెంచర్స్‌'కు చెందిన FMCG కంపెనీ 'రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్' (Reliance Consumer Products Limited), శీతల పానీయ బ్రాండ్ కాంపాను (Campa) మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. 

ప్రస్తుతం, మూడు ఫ్లేవర్‌లతో క్యాంపా పోర్ట్‌ఫోలియోను ప్రారంభించింది. అవి... కాంపా కోలా (Campa Cola), క్యాంపా లెమన్ (Campa Lemon), క్యాంపా ఆరెంజ్  (Campa Orange). 

పెద్ద కంపెనీలకు పోటీ
పెప్సీ (Pepsi), కోక-కోలాకు (Coca Cola) పోటీగా కాంపా బ్రాండ్‌ను పునఃప్రారంభించింది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.

వాస్తవానికి కాంపా బ్రాండ్‌ కొత్తది కాదు, కొన్ని దశాబ్దాలుగా భారతీయ మార్కెట్‌లో ఒక వెలుగు వెలిగింది. 1970, 1980 దశాబ్దాల్లో భారతదేశ పానీయాల మార్కెట్‌లోని అతి పెద్ద కంపెనీల్లో ఇది ఒకటి. 1990 దశకంలో కోకా-కోలా & పెప్సీ ఆగమనంతో ఆగమాగం అయింది. వాటి సవాలు ముందు నిలబడలేక మూలనబడింది. 

తన FMCG వ్యాపారాన్ని మరింతగా పెంచే వ్యూహంలో భాగంగా, గతేడాది ఆగస్టులో, సాఫ్ట్‌ డ్రింక్స్‌ & ఫ్రూట్‌ జ్యూస్‌ తయారీ సంస్థ సోస్యో హజూరి బేవరేజెస్‌లో ‍‌(Sosyo Hajoori Beverages Pvt Ltd) 50 శాతం వాటాను రిలయన్స్‌ రిటైల్‌కు చెందిన రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ కొనుగోలు చేసింది. ప్యూర్‌ డ్రింక్స్‌ గ్రూప్‌ నుంచి కాంపా బ్రాండ్‌ను సోస్కో అంతకుముందే దక్కించుకుంది. సోస్కోలో వాటా కొనుగోలుతో కాంపా బ్రాండ్‌ రిలయన్స్‌ వశమైంది. ఆరు నెలల తర్వాత, కాంపా బ్రాండ్‌కు కొత్త మెరుగులద్ది మార్కెట్లోకి విడుదల చేసింది రిలయన్స్‌.

తెలుగువాళ్లకే ఫస్ట్ ఆఫర్‌                           
మొదట తెలుగు రాష్ట్రాల్లో ఈ పానీయాన్ని రిలయన్స్‌ లాంచ్‌ చేసింది. క్రమంగా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తుంది. 200ml, 500ml, 600ml, 1000ml, 2000ml బాటిల్స్‌లో ఈ డ్రింక్స్ లభ్యమవుతాయి. వీటి ధరల వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

"గొప్ప వారసత్వాన్ని కలిగిన స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న కంపెనీ వ్యూహానికి అనుగుణంగా కంపా కోలా బ్రాండ్‌ను పునఃప్రారంభిస్తున్నామని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వెల్లడించింది. దీని ప్రత్యేక రుచి, వాసన కారణంగా ఇది భారతీయ వినియోగదార్లతో లోతైన అనుబంధాన్ని కలిగి ఉందని తెలిపింది".           

"ద గ్రేట్‌ ఇండియన్‌ టేస్ట్‌" స్లోగన్‌తో తొలినాళ్లలో కాంపా బ్రాండ్‌ చెలరేగింది. ఇప్పుడు అదే స్లోగన్‌తోనే కాంపా బ్రాండ్‌ను మార్కెట్‌ చేస్తున్నట్లు రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ వెల్లడించింది.

గత సంవత్సరం ఆగష్టు 29న, రిలయన్స్ ఇండస్ట్రీస్ AGMలో ప్రసంగిస్తూ, FMCG వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ ప్రకటించారు. ఆమె ప్రకటించిన కేవలం రెండు రోజుల్లోనే Campa బ్రాండ్ కొనుగోలు తెరపైకి వచ్చింది. భారతదేశంలో FMCG రంగం విలువ సుమారు $110 బిలియన్లని ఒక అంచనా.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget