అన్వేషించండి

Budget 2025: బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ కోసం నిర్మలమ్మ ట్యాబ్‌ ఎందుకు తీసుకెళ్తారు, అది ఏ బ్రాండ్‌?

Nirmala Sitharaman: 2021లో, ఆర్థిక మంత్రి నిర్మలమ్మ 'మేడ్ ఇన్ ఇండియా' టాబ్లెట్‌ను ఉపయోగించి బడ్జెట్‌ను సమర్పించారు. భారతదేశం డిజిటలైజేషన్ వైపు వేస్తున్న అడుగులను ఇది సూచిస్తుంది.

Union Budget 2025 Presentation With A Tablet: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర బడ్జెట్ ప్రదర్శనలో విప్లవాత్మక మార్పులు & సరికొత్త సంప్రదాయాలు ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ కంటే ముందు పని చేసిన కేంద్ర ఆర్థిక మంత్రులు, కేంద్ర బడ్జెట్ ప్రకటన కోసం పార్లమెంటుకు బ్రీఫ్‌కేస్‌ను తీసుకెళ్లారు. ఇది జంతు చర్మంతో తయారు చేసిన బ్రీఫ్‌కేస్‌ (Leather Briefcase). 2019లో, నిర్మల సీతారామన్, బ్రీఫ్‌కేస్‌కు బదులు సాంప్రదాయ 'బహి ఖాతా' (సాంప్రదాయ ఖాతా పుస్తకం)ను ఎంచుకుని బ్రీఫ్‌కేస్‌ సాంప్రదాయానికి స్వస్థి పలికారు. ఈ మార్పు సంప్రదాయం & ఆధునికత మిశ్రమాన్ని ప్రతిబింబింబించింది. 2021లో, ఆమె టాబ్లెట్‌ వైపు మారారు.

నిర్మల సీతారామన్, 01 ఫిబ్రవరి 2025న, వరుసగా ఎనిమిదో బడ్జెట్‌ను సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. ఆమె పార్లమెంటుకు వెళ్లే సమయంలో, ఆమె చేతుల్లో ఉండే పౌచ్‌పై యావత్‌ దేశం దృష్టి కేంద్రీకృతం అవుతుంది. బ్రీఫ్‌కేస్ నుంచి ఎర్రటి వస్త్ర పౌచ్‌గా, ఆ తరువాత టాబ్లెట్‌గా మారిన పరిణామం.. భారతదేశ బడ్జెట్ ప్రజెంటేషన్‌లో వస్తున్న మారులను హైలైట్ చేస్తుంది.

సీతారామన్ ఎప్పుడు టాబ్లెట్‌కు మారారు, ఎందుకు?
2021లో, నిర్మల సీతారామన్ 'మేడ్ ఇన్ ఇండియా' టాబ్లెట్‌ (Made in India' tablet)ను ఉపయోగించి బడ్జెట్‌ సమర్పించారు. ఈ విషయం ఆనాటి ప్రధాన వార్తల్లో ఒకటిగా నిలిచింది. భారతదేశం డిజిటలైజేషన్ వైపు సాగుతోందని చెప్పడానికి గుర్తుగా, నిర్మల సీతారామన్‌ ట్యాబ్లెట్‌ను ఉపయోగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రతిపాదించిన 'డిజిటల్ ఇండియా' (Digital India) చొరవకు అనుగుణంగా ఈ మార్పు వచ్చింది. సాంకేతిక పురోగతిని స్వీకరించడానికి భారత ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉన్న విషయాన్ని ఇది హైలైట్‌ చేసింది.

CNBCTV18 రిపోర్ట్‌ ప్రకారం, 2024 బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ వరకు, నిర్మల సీతారామన్ ఉపయోగించిన టాబ్లెట్‌ను శామ్‌సంగ్ (Samsung) తయారు చేసింది. భారతదేశ జాతీయ చిహ్నం "నాలుగు సింహాల గుర్తు"తో అలంకరించిన ఎరుపు రంగు ఫోల్డర్‌లో ఈ ట్యాబ్లెట్‌ ఉంటుంది.

'బహి ఖాతా' లేదా టాబ్లెట్ గురించి దేశం చర్చించినప్పటికీ, ప్రాథమిక కంటెంట్ మొత్తం ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం & ఆర్థిక పత్రాల రూపంలోనే ఉంటుంది. బడ్జెట్ ప్రజెంటేషన్‌ సమయంలో ఆవిష్కరించే ఈ కీలకమైన పత్రాలు.. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలను, విధానాలను వివరిస్తాయి. రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ పనితీరుకు రోడ్‌మ్యాప్‌లా నిలుస్తాయి.       

బడ్జెట్‌ను ఏ సమయంలో ప్రజెంట్‌ చేస్తారు?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31, 2025న ప్రారంభం అయ్యాయి. నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ఫిబ్రవరి 01న ఉదయం 11:00 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం బడ్జెట్ సెషన్ రెండు భాగాలుగా కొనసాగుతుంది. మొదటి భాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఉంటుంది. రెండో భాగం మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్ 04న ముగుస్తుంది.

మరో ఆసక్తికర కథనం: ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారా? 

టాప్ హెడ్ లైన్స్

US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget