Agriculture Budget 2026: కేంద్ర బడ్జెట్ నుంచి వ్యవసాయ రంగం, రైతులు ఏం ఆశిస్తున్నారు.. ఎదురవుతున్న సవాళ్లు ఇవే
అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, రైతులను ప్రపంచ మార్కెట్లకు అనుసంధానించడానికి ఎగుమతి, డిమాండ్ పంటల సాగును ప్రోత్సహించే విధానాల కోసం వ్యవసాయ రంగం కృషి చేస్తోంది.

రైతులు, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు రాబోయే కేంద్ర బడ్జెట్ 2026పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విత్తనాలు, ఎరువుల నుండి నిల్వ, రవాణా వరకు పెరుగుతున్న వ్యవసాయ ఖర్చుల వల్ల కలిగే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తిని పెంచేలా చేయాలని, రైతులు మెరుగ్గా సంపాదించడానికి మొత్తం వ్యవసాయ మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఈ రంగం భావిస్తోంది. చౌకైన సేకరణ, నిల్వ ఖర్చులు, కోల్డ్ చైన్లు, లాజిస్టిక్లలో పెట్టుబడి, వ్యవసాయ సాంకేతిక మద్దతు మన దేశ రైతులను ప్రపంచ మార్కెట్లకు అనుసంధానించే విధానాలపై ప్రకటన వస్తుందని చూస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయ మద్దతును విస్తరించడానికి, ఎగుమతి కేంద్రీకృత పంటలను ప్రోత్సహించడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తి పెంచుతోంది
తక్కువ ఖర్చులు, మెరుగైన మార్కెట్ యాక్సెస్
వ్యవసాయ రంగం సేకరణతో పాటు ధాన్యం నిల్వ ఖర్చును తగ్గించడానికి చర్యలను కోరుకుంటుంది. ఇది తరచుగా రైతుల ఆదాయాలను తినేస్తుంది. రైతులు నేరుగా అమ్ముకోడానికి, మెరుగైన ధరలను పొందడానికి ఆహార వ్యవస్థను మెరుగైన మార్కెట్తో బాగా అనుసంధానించాలని నిపుణులు సూచిస్తున్నారు.
పంటలు పొలాల నుండి వినియోగదారులకు సమర్థవంతంగా తరలించే వ్యవసాయ మోడల్ కోసం డిమాండ్లను నివేదిక హైలైట్ చేస్తుంది. వ్యవసాయ ప్రాంతాలకు సమీపంలో మరిన్ని శీతల గిడ్డంగులు (గోడౌన్లు)ను నిర్మించడం, రిఫ్రిజిరేటెడ్ రవాణాను విస్తరించడం, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆధునిక గిడ్డంగులను ప్రోత్సహించడం లాంటివి ఉన్నాయి. పంటలు కుళ్ళిపోయినప్పుడు లేదా పంట కోసిన తర్వాత దెబ్బతిన్నప్పుడు పంటకోత తర్వాత నష్టాలను తగ్గించడం, రైతులకు త్వరగా న్యాయం జరగాలన్నది దీని లక్ష్యం.
టెక్ పుష్, ఎగుమతులు & సేంద్రీయ దృష్టి
వ్యవసాయ సాంకేతికత మరియు వ్యవసాయ డేటాకు ఎక్కువ మద్దతు ఇవ్వడం మరో ప్రధాన డిమాండ్. కానీ రైతులకు నిజంగా సహాయపడే మార్గాల్లో వ్యవసాయ సాంకేతికత యాప్లకే పరిమితం కాకూడదని, వాతావరణ హెచ్చరికలు, పంట పరిస్థితులు, రైతులకు రాబోయే పంట ధరలు రియల్ టైం సమాచారాన్ని అందించాలని నిపుణులు అంటున్నారు.
అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, రైతులను ప్రపంచ మార్కెట్లకు అనుసంధానించడానికి మద్దతుతో ఎగుమతి డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించే విధానాల కోసం కూడా రైతాంగం ప్రయత్నిస్తోంది. భారతదేశం, విదేశాలలో పెరుగుతున్న డిమాండ్ నుండి రైతులు ప్రయోజనం పొందేందుకు సేంద్రీయ ఎరువులు, బయో పెస్టిసైడ్స్ సబ్సిడీలతో సేంద్రీయ వ్యవసాయం వైపు ఫోకస్ చేస్తున్నారు.
నివేదికల ప్రకారం పప్పుధాన్యాల పరిశ్రమ నాయకులు నిల్వ మౌలిక సదుపాయాలు, సులభమైన రుణాలు, పన్ను ఉపశమనం కోసం ప్రోత్సాహకాలను కోరుతున్నారు. ప్రాసెసింగ్ను ఆధునీకరించడానికి మద్దతుతో పాటు వరి ఎగుమతిదారులు తరచుగా నిషేధాలు, టారిఫ్ అనిశ్చితిని ప్రమాదంగా గుర్తించారు. ఎగుమతి ప్రమాద రక్షణ యంత్రాంగం, ప్రపంచ వాణిజ్య ఉత్సవాలు, కొత్త మార్కెట్లకు విస్తృత ప్రచార మద్దతు కోసం ఆశగా ఎదురుచేస్తున్నారు.
భారత కేంద్ర బడ్జెట్ 2026 రైతు నష్టాలను తగ్గించడం, ఖర్చులను తగ్గించడం, మార్కెట్ అవకాశాలను మెరుగుపరచడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడంపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. తమ కోసం చేసే ప్రకటనల కోసం చూస్తున్నారు.
























