అన్వేషించండి

Budget 2022: తొలి 2 రోజులు: బడ్జెట్‌ సమావేశాల్లో జీరో అవర్‌, క్వశ్చన్‌ అవర్‌ ఉండవు

ఈ నెల 31న పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్‌ 2022-23 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

బడ్జెట్‌ సమావేశాల్లో తొలి రెండు రోజులు శూన్య గంట, ప్రశ్నోత్తరాల సమయం ఉండదు. ఉభయ సభలకూ ఇది వర్తిస్తుంది. మూడో రోజు నుంచి లోక్‌సభ, రాజ్యసభలో  యథావిధిగా శూన్యగంట, ప్రశ్నోత్తరాల సమయం అమలవుతుంది.

జనవరి 31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు మొదలవుతాయి. 31న పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్‌ 2022-23 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అందుకే ఆ రెండు రోజులు మినహాయించి ఫిబ్రవరి 2 నుంచి జీరో అవర్‌, క్వశ్చన్‌ అవర్‌ ఉంటాయని పార్లమెంట్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు.

'2022, జనవరి 31, ఫిబ్రవరి 1న శూన్య గంట, ప్రశ్నోత్తరాల గంట ఉండవు. 17వ లోక్‌సభ ఎనిమిదో సెషన్‌ తొలి రెండు రోజులు రాష్ట్రపతి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారని సభ్యులకు తెలియజేస్తున్నాం' అని పార్లమెంట్‌ బులెటిన్‌ పేర్కొంది. 'ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అత్యవసర ప్రశ్నలను ఫిబ్రవరి 2 నుంచి శూన్య గంటలో లేవనెత్తొచ్చు' అని వెల్లడించింది. ఇందుకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ లేదా పార్లమెంట్‌ నోటీస్‌ ఆఫీస్‌కు సమాచారం అందించాలని తెలిపింది.

సాధారణంగా ఉభయ సభల్లో సమావేశం ఆరంభానికి ముందు జీరో అవర్‌, క్వశ్చన్‌ అవర్‌ నిర్వహించడం నిబంధనల్లో భాగం. ఉదయం 11 గంటలకు ప్రశ్నోత్తరాల సమయం, ఆ తర్వాత శూన్య గంట ఉంటాయి. అందుకు భిన్నంగా రాజ్యసభలో మొదట ఉదయం 11 గంటలకు శూన్య గంట, తర్వాత ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది.

Also Read: Union Budget 2022 Telangana : ప్రతీ సారి నిరాశే.. ఈ సారైనా కనికరిస్తారా ? కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ఎన్నో ఆశలు !

Also Read: Budget 2022 Traditions: ఈ సారి బడ్జెట్‌ హల్వా లేదండోయ్‌! మారుతున్న సంప్రదాయాలు!!

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సారి బడ్జెట్‌ సమావేశాలను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించబోతున్నారు. రోజుకు ఐదు గంటల చొప్పున రాజ్యసభ, లోక్‌సభను నడిపిస్తారు. ఉదయం పెద్దల సభ, మధ్యాహ్నం లోక్‌సభ సమావేశాలు ఉంటాయి. బడ్జెట్‌కు ముందు రోజున రెండు సభల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపడతారు. ఇక ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు లోక్‌ సభ సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు నిర్వహిస్తారు. ఉదయం రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి.

కొవిడ్‌ నేపథ్యంలో ఉభయ సభల్లో భౌతిక దూరాన్ని కట్టుదిట్టంగా అమలు చేయబోతున్నారు. రెండు సభల్లోని ఛాంబర్లు, గ్యాలరీల్లోనూ సభ్యులను కూర్చొబెట్టనున్నారు. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా సభ్యుల మధ్య దూరం ఉంటుంది. ఇక రాజ్యసభకు షెడ్యూలు ఇంకా ప్రకటించలేదు. అయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సభ జరుగుతుందని తెలిసింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget