అన్వేషించండి

Millets: చిరుధాన్యం - పెద్ద లక్ష్యం! బడ్జెట్లో మిల్లెట్స్‌ ప్రాధాన్యం వెనక పెద్ద సీక్రెట్‌ ఇదే!

Millets: కేంద్ర ప్రభుత్వం చిరు ధాన్యాల దిగుబడి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. బడ్జెట్‌-2023లో 'అన్నామృతం'గా వీటిని ప్రకటించింది. అసలు మోదీ సర్కారు చిరుధాన్యాలపై ఎందుకింత ఫోకస్‌ చేసిందంటే?

Millets: 

కేంద్ర ప్రభుత్వం చిరు ధాన్యాల దిగుబడి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వీటిని పండించేలా రైతులను ప్రోత్సహిస్తోంది. బడ్జెట్‌-2023లో 'అన్నామృతం'గా వీటిని ప్రకటించింది. అసలు మోదీ సర్కారు చిరుధాన్యాలపై ఎందుకింత ఫోకస్‌ చేసిందంటే?

బ్రిటిషర్లు దేశంలోఅడుగుపెట్టనంత వరకు భారతీయులు నిత్యం చిరుధాన్యాలే ఆహారంగా తీసుకొనేవారు. ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అప్పటి వరకు వరికి ప్రాధాన్యమే లేదు. దేశవ్యాప్తంగా అపరాల వంటి పంటలనే పండించేవారు.

వ్యాపారం కోసం వచ్చిన ఆంగ్లేయులు డబ్బుల కోసం పొగాకు, పత్తి వంటి వాణిజ్య పంటలను ప్రోత్సహించారు. రైతులు క్రమంగా వీటికి అలవాటు పడటంతో చిరుధాన్యాల దిగుబడి తగ్గిపోయింది. స్వాత్రంత్యం వచ్చాక ఆహార భద్రత కోసం వరి, గోధుమలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

పౌర సరఫరా వ్యవస్థలోనూ వరి, గోధుమలకే పెద్దపీట వేశారు. ఫలితంగా తృణధాన్యాలు పండించడం మరింత తగ్గింది. అయితే విపరీతంగా వరన్నం తినడంతో భారతీయుల్లో ఊబకాయం రోజురోజుకీ పెరుగుతోంది. చాలామంది చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. యువత సైతం ప్రీ డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతోంది.

ఇదే సమయంలో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యాన్ని అందించే పంటలపై ఆసక్తి పెరిగింది. రాగులు, సజ్జలు, అరికెలు, ఊదల వంటి తృణధాన్యాలు తిన్న తర్వాత మెల్లగా గ్లూకోస్‌ను విడుదల చేసే సంగతి తెలిసిందే. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు తగ్గుతున్నాయి. డయాబెటిస్‌ ముప్పు తగ్గుతోంది.

భారతీయుల ఆరోగ్యంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత్‌కు అవకాశం దొరికింది. అందుకే ఐక్య రాజ్య సమితితో ఈ ఏడాదిని 'తృణధాన్యాల సంవత్సరం'గా ప్రకటించేలా పావులు కదిపారు.

టాటా కన్జూమర్స్‌, ఐటీసీ వంటి బ్రాండ్లు తృణధాన్యాల ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. తృణధాన్యాలతో ఇడ్డీరవ్వ, ఉప్మా రవ్వా, దోసె పిండి, బిస్కెట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. పైగా ఐటీసీ తమ హోటళ్లలో తృణధాన్యాల భోజనాలను ప్రవేశపెట్టబోతోందని తెలిసింది.

చిరు ధాన్యాలు తినడం వల్ల రక్తంలో గ్లూకోజు స్థాయిలు 12-15 శాతం తగ్గుతాయి! అలాగే ఒక కిలో ధాన్యాలను పండించేందుకు 650-1200 లీటర్ల నీరు సరిపోతుంది. అదే ఒక కిలో బియ్యానికి 5000 లీటర్ల నీరు అవసరం. పైగా విటమిన్లు, ఖనిజాలు దేహానికి లభిస్తాయి. వివిధ సూక్ష్మపోషకాలు దొరుకుతాయి.

భవిష్యత్తులో నీటి అవసరం పెరుగుతుంది. అలాంటప్పుడు తక్కువ నీరు ఉపయోగించుకొనే పంటలను ప్రోత్సహించాలి. పైగా ప్రజలను ఆరోగ్యంగా ఉంచాలంటే చిరుధాన్యాలు తినక తప్పదు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఒడిశా వంటి రాష్ట్రాలు ఇప్పటికే పీడీఎస్‌లో భాగంగా రాగుల వంటి చిరుధాన్యాలు అందిస్తున్నాయి. కర్ణాటకలో చిరుధాన్యాలను మార్కెట్‌ ధరకన్నా 40 శాతం ఎక్కువ ప్రీమియం ఇచ్చి కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటిని పండించాలని రైతులను కోరుతోంది.

దేశంలో 1961లో 18.5 మిలియన్‌ హెక్టార్లలో చిరుధాన్యాలను పండిచేవారు. 2019లో వీటి విస్తీర్ణం 8.5 మిలియన్లకు తగ్గిపోయింది. ఒకప్పుడు తలసరి వినియోగం 33 కిలోలు ఉండగా ఇప్పుడు 4 కిలోలకు తగ్గిపోయింది.

భారత్‌లో చాలామంది మహిళలు రక్తహీనత, బలహీనతతో బాధపడుతున్నారు. 80 శాతం మంది భారతీయుల్లో సూక్ష్మ పోషకాల లోపం కనిపిస్తోంది. సరైన పోషకాలు లేకపోవడంతో చిన్నారులు వయసుకు తగినట్టుగా ఎదగడం లేదు. వీరికి వైద్యం అందించకపోవడం వల్ల రోజుకు రూ.6 కోట్ల వరకు నష్టం వస్తోంది.

రైతులు చిరు ధాన్యాల వైపు మళ్లడం అంత సులభం కాదు. ఒక ఎకరంలో రూ.2000 ఖర్చు చేస్తే 35-45 క్వింటాళ్ల వరి దిగుబడి వస్తుంది. అదే 6-7 క్వింటాళ్ల చిరుధాన్యాల దిగుబడికి రూ.3000 వరకు ఖర్చవుతుంది. అన్నదాతలకు సరైన లాభదాయతను చూపిస్తేనే ప్రభుత్వ లక్ష్యం విజయవంతం అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

UPI Transactions: బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
Old Currency: 50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Does Gen Z Use Credit Cards:క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్న జెన్‌జీ! షాపింగ్, ఈఎంఐల కోసం వాడకం! షాకింగ్ రిపోర్టు ఇదే! 
క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్న జెన్‌జీ! షాపింగ్, ఈఎంఐల కోసం వాడకం! షాకింగ్ రిపోర్టు ఇదే! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ సంచలన ఆరోపణలు
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ ఆరోపణలు
187km రేంజ్‌తో కొత్త Vida VX2 Plus లాంచ్‌ - ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఆన్‌రోడ్ ధర వివరాలు ఇవే!
సింగిల్‌ ఛార్జ్‌తో దాదాపు 190km జర్నీ- భారీ బ్యాటరీతో Vida VX2 Plus లాంచ్‌, తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంత?
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Embed widget