అన్వేషించండి

Budget 2022: దయ చూపాలమ్మా 'నిర్మలమ్మ'! బడ్జెట్‌కు ముందు వేతన జీవుల వేడుకోలు!!

కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతుండటంతో కొన్ని రిబేట్లు ఇస్తారేమోనని వేతన జీవులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇంటి నుంచి పని చేయడం వల్ల ఉద్యోగులకు ఖర్చులు పెరిగాయి.

Budget 2022 Telugu, Union budget 2022: ఫిబ్రవరి 1, కోసం దేశవ్యాప్తంగా ఉద్యోగులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటమే ఇందుకు కారణం. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలమ్మ' తమకు మరిన్ని మినహాయింపులు ఇవ్వాలని వేతన జీవులు కోరుకుంటున్నారు. దీనికి తోడు రిబేట్లు, అదనపు అలవెన్సులు వచ్చేలా చూడాలని అర్థిస్తున్నారు.

ఇప్పటికే ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతుండటంతో కొన్ని రిబేట్లు ఇస్తారేమోనని వేతన జీవులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇంటి నుంచి పని చేయడం వల్ల ఉద్యోగులకు ఖర్చులు పెరిగాయి. ఇంటర్నెట్‌, టెలిఫోన్‌, ఇంట్లో కార్యాలయం కోసం ఫర్నీచర్‌, అదనంగా విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయి. పైగా ద్రవ్యోల్బణం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. వైద్య, ఆరోగ్య ఖర్చులూ కొండెక్కాయి.

Also Read: ITR Filing Date Extended: టాక్స్‌ పేయర్లకు గుడ్‌న్యూస్‌! మార్చి 15 వరకు గడువు పెంపు

Also Read: Paytm Shares Down: ఇదేంది సామి!! 50% పతనమవ్వనున్న పేటీఎం షేరు! రూ.900కి వస్తుందంటున్న బ్రోకరేజ్‌ సంస్థలు

Also Read: Vodafone Idea Shareholders: వొడాఫోన్‌ ఐడియాలో కేంద్రానికి '36%' వాటా.. 19% నష్టపోయిన షేరు!!

అందుకే ప్రభుత్వం పన్ను మినహాయింపు పరిమితి పెంచాలని ఉద్యోగ వర్గాలు కోరుకుంటున్నాయి. 2018లో ఉద్యోగుల వేతనం నుంచి రూ.50,000 వరకు పన్ను మినహాయింపుగా ఇస్తున్నారు. దీనిని మరింత పెంచాలని వారు వినతి చేస్తున్నారు. 'కరోనా వల్ల ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. దీనివల్ల వారి ఖర్చులు పెరిగాయి. కాబట్టి యజమానులు వారికి ఆ ఖర్చులను అలవెన్స్‌ రూపంలో ఇవ్వాలి' అని డెలాయిట్‌ ఇండియా ప్రిబడ్జెట్‌ అంచనాల్లో వివరించింది. ఇప్పుడిస్తున్న రూ.50,000కు అదనంగా మరో రూ.50000 వరకు మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది.

మరికొన్ని సంస్థలైతే ఉద్యోగుల ఆదాయపన్ను విధానంలో మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నాయి. రాబోయే ఆర్థిక ఏడాది నుంచి కొత్త వేతన విధానం అమల్లోకి వస్తుందని భావిస్తున్నాయి. ఇక ఛార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICAI) ఇంటి నుంచి పని చేయడం వల్ల అయ్యే ఖర్చులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది. రూ.లక్ష వరకు స్టాండర్డ్‌ డిడక్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. మరి 'నిర్మలమ్మ' ఏం చేస్తుందో చూడాలి!!

Also Read: CCD New CEO Malavika Hegde: భర్త విధికి తలవంచితే.. ఆమె ఎదిరించి నిలబడింది.. ఓ మంచి కాఫీ లాంటి కథ!

Also Read: Multibagger stock: పెన్నీ స్టాక్‌.. 2 ఏళ్లు.. లక్ష పెట్టుబడి.. రూ.50 లక్షలు ప్రాఫిట్‌!

Also Read: PNB Service Charges: కస్టమర్లకు పీఎన్‌బీ షాక్‌! సర్వీస్‌ ఛార్జెస్‌ పెంచేసిన పంజాబ్‌ బ్యాంక్‌

టాప్ హెడ్ లైన్స్

KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget