అన్వేషించండి

77th Republic Day: విద్య, ఆరోగ్య సంరక్షణ , ఆర్థిక వ్యవస్థలో స్వదేశీ ముద్ర - రిపబ్లిక్ డే సందర్భంగా బాబా రామ్ దేవ్ పిలుపు

Patanjali: 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వదేశీ విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వ్యవస్థ కోసం స్వామి రామ్‌దేవ్ పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర, అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించాలన్నారు.

Baba Ramdev Calls For Indigenous Education:    దేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పతంజలి యోగపీఠం ఛైర్మన్ స్వామి రామ్‌దేవ్, ప్రధాన కార్యదర్శి ఆచార్య బాలకృష్ణ పతంజలి వెల్నెస్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, భారతదేశాన్ని ఆత్మనిర్భర్  దేశంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ  పంచ ప్రాణాల ను స్వీకరించాలని స్వామి రామ్‌దేవ్ పిలుపునిచ్చారు.

టారిఫ్ తీవ్రవాదంపై విమర్శలు - సనాతన ధర్మానికి రక్షణ

ప్రపంచం ప్రస్తుతం ప్రమాదకరమైన దశలో ఉందని, అమెరికా వంటి దేశాలు కెనడా, భారతదేశంపై విపరీతమైన టారిఫ్ తీవ్రవాదం  ప్రయోగిస్తున్నాయని రామ్‌దేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. సంపద మత్తు, అధికార గర్వం, మత మౌఢ్యం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నాయని విమర్శించారు. భారతదేశంలో కూడా సనాతన ధర్మ అనుచరుల మధ్య అంతర్గత ఆరోపణలు, గోమాత, గంగ పేరుతో మతోన్మాదం వ్యాపించడం శోచనీయమన్నారు. స్వదేశీ విద్య, స్వదేశీ ఆరోగ్యం, స్వదేశీ ఆర్థిక వ్యవస్థ మరియు సనాతన జీవనశైలి ద్వారానే 'ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్' సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

 డాలర్‌ను శాసించే స్థాయికి భారత రూపాయి

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక, సైనిక, ఆధ్యాత్మిక శక్తిగా ఎదగాలనేది తన ఆకాంక్ష అని స్వామి రామ్‌దేవ్ పేర్కొన్నారు.  ఒక భారత రూపాయి 100 అమెరికన్ డాలర్లకు సమానమయ్యే రోజును చూడాలని, అది 140 కోట్ల భారతీయుల కృషివల్లే సాధ్యమని ఆయన అన్నారు. మెకాలే తరహా విద్యావిధానాన్ని, బహుళజాతి సంస్థల గుత్తాధిపత్యాన్ని వీడి స్వదేశీని అవలంబించాలని పిలుపునిచ్చారు.  మన పాస్‌పోర్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా వీసా రహిత గుర్తింపు రావాలంటే దేశం అన్ని రంగాల్లో బలోపేతం కావాలని, లేనిపక్షంలో మిత్రదేశాలు కూడా దూరం అవుతాయని హెచ్చరించారు.

అంతర్గత కలహాలు వీడాలి - హిందువుల భద్రత

సన్యాసులు, శంకరాచార్యుల మధ్య వివాదాలు ఉండకూడదని, కుల, మత, ప్రాంతీయ, భాషా పరమైన వైషమ్యాలకు స్వస్తి పలకాలని రామ్‌దేవ్ విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్ బలంగా ఉండటం వల్లే ప్రపంచంలో యూదుల జోలికి ఎవరూ వెళ్లలేకపోతున్నారని ఉదాహరిస్తూ.. భారతదేశం శక్తివంతంగా మారినప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు రక్షణ ఉంటుందని  గుర్తుచేశారు. ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమలును సమర్థిస్తూ.. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం దిశగా చట్టపరమైన, భావజాల పరమైన విస్తరణ జరగాలని ఆకాంక్షించారు.

 గోసేవలో నూతన విధానం

గోమాతను కేవలం జాతీయ తల్లిగానే కాకుండా, ప్రపంచ మాతగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.  ప్రతి పౌరుడు రోజుకు కనీసం రూ . 10 విలువైన గో ఆధారిత ఉత్పత్తులను వాడితే, గోమాత సంరక్షణ కోసం రోజుకు ₹10,000 కోట్ల నిధి సమకూరుతుందని గణాంకాలను వివరించారు.  సాధువులు, మత నాయకులు తమ మఠాల నుండి బయటకు వచ్చి కనీసం 1,000 నుండి లక్ష ఆవులను పెంచేలా బాధ్యత తీసుకోవాలని, కేవలం ప్రసంగాలతో సరిపెట్టకుండా ఆచరణలో చూపాలని కోరారు.

  ఆచార్య బాలకృష్ణ సందేశం

పతంజలి ప్రధాన కార్యదర్శి ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవం అమరవీరుల త్యాగాలను స్మరించుకునే రోజని అన్నారు. మానవ జీవితం కేవలం స్వల్ప లక్ష్యాల కోసం కాదని, దేశాన్ని 'విశ్వగురువు'గా నిలబెట్టే గొప్ప లక్ష్యం కోసం ప్రతి భారతీయుడు శ్రమించాలని సందేశం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పతంజలి ప్రతినిధులు, యోగ సాధకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
US Iran Conflict: అమెరికా-ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం.. ఇప్పటికే 12% పెరిగిన ధరలు..భారత్ పై ప్రభావం ఎలా ఉండబోతోంది..?
అమెరికా-ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం.. ఇప్పటికే 12% పెరిగిన ధరలు..భారత్ పై ప్రభావం ఎలా ఉండబోతోంది..?
AI for Income : AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
Multibagger Stock: 1 లక్ష రూపాయల్ని 3.50 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్.. ప్రస్తుత పరిస్థితి ఏంటీ?
1 లక్ష రూపాయల్ని 3.50 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్.. ప్రస్తుత పరిస్థితి ఏంటీ?
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Kerala BJP: కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
ABP Desam Smart Ed Conclave 2026: స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
Chiranjeevi - Venkatesh: చిరంజీవి కోసం వెంకటేష్ టైటిల్ త్యాగం... మూడు నేషనల్ అవార్డులు వచ్చిన ఆ సినిమా ఏదో తెలుసా?
చిరంజీవి కోసం వెంకటేష్ టైటిల్ త్యాగం... మూడు నేషనల్ అవార్డులు వచ్చిన ఆ సినిమా ఏదో తెలుసా?
Embed widget