అన్వేషించండి

77th Republic Day: విద్య, ఆరోగ్య సంరక్షణ , ఆర్థిక వ్యవస్థలో స్వదేశీ ముద్ర - రిపబ్లిక్ డే సందర్భంగా బాబా రామ్ దేవ్ పిలుపు

Patanjali: 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వదేశీ విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వ్యవస్థ కోసం స్వామి రామ్‌దేవ్ పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర, అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించాలన్నారు.

Baba Ramdev Calls For Indigenous Education:    దేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పతంజలి యోగపీఠం ఛైర్మన్ స్వామి రామ్‌దేవ్, ప్రధాన కార్యదర్శి ఆచార్య బాలకృష్ణ పతంజలి వెల్నెస్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, భారతదేశాన్ని ఆత్మనిర్భర్  దేశంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ  పంచ ప్రాణాల ను స్వీకరించాలని స్వామి రామ్‌దేవ్ పిలుపునిచ్చారు.

టారిఫ్ తీవ్రవాదంపై విమర్శలు - సనాతన ధర్మానికి రక్షణ

ప్రపంచం ప్రస్తుతం ప్రమాదకరమైన దశలో ఉందని, అమెరికా వంటి దేశాలు కెనడా, భారతదేశంపై విపరీతమైన టారిఫ్ తీవ్రవాదం  ప్రయోగిస్తున్నాయని రామ్‌దేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. సంపద మత్తు, అధికార గర్వం, మత మౌఢ్యం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నాయని విమర్శించారు. భారతదేశంలో కూడా సనాతన ధర్మ అనుచరుల మధ్య అంతర్గత ఆరోపణలు, గోమాత, గంగ పేరుతో మతోన్మాదం వ్యాపించడం శోచనీయమన్నారు. స్వదేశీ విద్య, స్వదేశీ ఆరోగ్యం, స్వదేశీ ఆర్థిక వ్యవస్థ మరియు సనాతన జీవనశైలి ద్వారానే 'ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్' సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

 డాలర్‌ను శాసించే స్థాయికి భారత రూపాయి

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక, సైనిక, ఆధ్యాత్మిక శక్తిగా ఎదగాలనేది తన ఆకాంక్ష అని స్వామి రామ్‌దేవ్ పేర్కొన్నారు.  ఒక భారత రూపాయి 100 అమెరికన్ డాలర్లకు సమానమయ్యే రోజును చూడాలని, అది 140 కోట్ల భారతీయుల కృషివల్లే సాధ్యమని ఆయన అన్నారు. మెకాలే తరహా విద్యావిధానాన్ని, బహుళజాతి సంస్థల గుత్తాధిపత్యాన్ని వీడి స్వదేశీని అవలంబించాలని పిలుపునిచ్చారు.  మన పాస్‌పోర్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా వీసా రహిత గుర్తింపు రావాలంటే దేశం అన్ని రంగాల్లో బలోపేతం కావాలని, లేనిపక్షంలో మిత్రదేశాలు కూడా దూరం అవుతాయని హెచ్చరించారు.

అంతర్గత కలహాలు వీడాలి - హిందువుల భద్రత

సన్యాసులు, శంకరాచార్యుల మధ్య వివాదాలు ఉండకూడదని, కుల, మత, ప్రాంతీయ, భాషా పరమైన వైషమ్యాలకు స్వస్తి పలకాలని రామ్‌దేవ్ విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్ బలంగా ఉండటం వల్లే ప్రపంచంలో యూదుల జోలికి ఎవరూ వెళ్లలేకపోతున్నారని ఉదాహరిస్తూ.. భారతదేశం శక్తివంతంగా మారినప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు రక్షణ ఉంటుందని  గుర్తుచేశారు. ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమలును సమర్థిస్తూ.. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం దిశగా చట్టపరమైన, భావజాల పరమైన విస్తరణ జరగాలని ఆకాంక్షించారు.

 గోసేవలో నూతన విధానం

గోమాతను కేవలం జాతీయ తల్లిగానే కాకుండా, ప్రపంచ మాతగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.  ప్రతి పౌరుడు రోజుకు కనీసం రూ . 10 విలువైన గో ఆధారిత ఉత్పత్తులను వాడితే, గోమాత సంరక్షణ కోసం రోజుకు ₹10,000 కోట్ల నిధి సమకూరుతుందని గణాంకాలను వివరించారు.  సాధువులు, మత నాయకులు తమ మఠాల నుండి బయటకు వచ్చి కనీసం 1,000 నుండి లక్ష ఆవులను పెంచేలా బాధ్యత తీసుకోవాలని, కేవలం ప్రసంగాలతో సరిపెట్టకుండా ఆచరణలో చూపాలని కోరారు.

  ఆచార్య బాలకృష్ణ సందేశం

పతంజలి ప్రధాన కార్యదర్శి ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవం అమరవీరుల త్యాగాలను స్మరించుకునే రోజని అన్నారు. మానవ జీవితం కేవలం స్వల్ప లక్ష్యాల కోసం కాదని, దేశాన్ని 'విశ్వగురువు'గా నిలబెట్టే గొప్ప లక్ష్యం కోసం ప్రతి భారతీయుడు శ్రమించాలని సందేశం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పతంజలి ప్రతినిధులు, యోగ సాధకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 


 

టాప్ హెడ్ లైన్స్

Maggi Size: మ్యాగీ ప్రియులకు బిగ్‌షాక్‌! కంపెనీ కీలక నిర్ణయం, ధర మారలేదు కానీ...!
మ్యాగీ ప్రియులకు బిగ్‌షాక్‌! కంపెనీ కీలక నిర్ణయం, ధర మారలేదు కానీ...!
July 1st Changes: జులై 1 నుంచి ఐదు విషయాలు మారబోతున్నాయి! లక్షలాది మంది జేబులపై ఎఫెక్ట్! 
జులై 1 నుంచి ఐదు విషయాలు మారబోతున్నాయి! లక్షలాది మంది జేబులపై ఎఫెక్ట్! 
Gold Price Crash Expectations: బంగారం అమ్మేస్తున్న భారతీయ కుటుంబాలు.. మూడు నెలల్లో 50 టన్నుల విక్రయం.. ధరల క్షీణత భయమే కారణమా?
బంగారం అమ్మేస్తున్న భారతీయ కుటుంబాలు.. మూడు నెలల్లో 50 టన్నుల విక్రయం.. ధరల క్షీణత భయమే కారణమా?
July 1 Rules Changes:జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Basara Temple Theft Case: బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Sky High Marriage Proposal New York: ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
Kalvakuntla Kavitha Uppal Bhagayat Protest: ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Ketan Agarwal Lohagad Fort death case: కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
Embed widget