అన్వేషించండి

Digital Transactions: రోజుకు దాదాపు 38 కోట్ల డిజిటల్ పేమెంట్స్‌, వాటిలో UPI వాటా 78%

కేవలం UPI లావాదేవీల ద్వారానే ప్రతిరోజూ దాదాపు 29.5 కోట్ల డిజిటల్ పేమెంట్స్‌ పూర్తవుతున్నాయి.

Digital Transactions: ప్రస్తుతం, డిజిటల్ లావాదేవీల విషయంలో భారతదేశం ప్రపంచంలోనే ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది. డిజిటల్ చెల్లింపుల్లో అభివృద్ధి చెందిన దేశాలను సైతం భారత్ ఏ విధంగా వెనక్కు నెట్టిందన్నది ఇప్పుడు ఒక కేస్‌ స్టడీగా మారింది. భారత్‌ అనుభవాల ఆధారంగా చాలా దేశాలు డిజిటల్‌ పేమెంట్స్‌ సిస్టమ్స్‌లో మార్పులు తీసుకొస్తున్నాయి. ప్రపంచానికే "డిజిటల్‌ పేమెంట్స్‌ గురు"గా మారిన భారత్‌లో, రోజుకు ఎన్ని డిజిటల్‌ ట్రాన్జాక్షన్స్‌ జరుగుతున్నాయో మీకు తెలుసా?

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das), భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వృద్ధికి సంబంధించిన లెక్కలు ప్రకటించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌, రూ. 2000 నోటు రద్దు నిర్ణయం నుంచి ద్రవ్యోల్బణం, రెపో రేటు, డిజిటల్ లావాదేవీల వరకు చాలా అంశాలపై మాట్లాడారు. 

డిజిటల్ చెల్లింపుల్లో UPIదే సింహభాగం
2016లో, దేశవ్యాప్తంగా ప్రతి రోజూ సగటున 2.28 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరగగా, ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 38 కోట్లకు పెరిగిందని ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పారు. తాజా లెక్కల ప్రకారం, దేశంలో ప్రతిరోజూ సగటున 37.75 కోట్ల డిజిటల్ పేమెంట్స్‌ జరుగుతున్నాయి. వీటిలో సింహభాగం UPI ఆధారిత చెల్లింపులదే. కేవలం UPI లావాదేవీల ద్వారానే ప్రతిరోజూ దాదాపు 29.5 కోట్ల డిజిటల్ పేమెంట్స్‌ పూర్తవుతున్నాయి.

డిజిటల్ చెల్లింపుల వృద్ధిలో 4 మూల స్తంభాలు
భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు పెరగడానికి ప్రధానంగా 4 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం పెద్ద నోట్ల రద్దు (Demonetization). 2016 నవంబర్‌లో, దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దును ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు మార్కెట్‌లో నగదు కొరత ఏర్పడింది. దీంతో చిన్న దుకాణదార్లు సైతం డిజిటల్‌ పేమెంట్స్‌ స్వీకరించడం ప్రారంభించారు. రెండో కారణం UPI. డిజిటల్‌ పేమెంట్స్‌ ట్రెండ్‌కు యూపీఐ విపరీతమైన వేగాన్ని అందించింది. UPI వల్ల, ఒక బ్యాంక్‌ ఖాతా నుంచి మరొక బ్యాంక్‌ ఖాతాకు డబ్బు పంపడం చిటికె వేసినంత సులభంగా మారింది. మూడో కారణం ఇంటర్నెట్‌ వ్యాప్తి. 4G రూపంలో మారుమూల ప్రాంతాలకు కూడా అందిన చౌకైన, వేగవంతమైన ఇంటర్నెట్‌ డిజిటల్‌ ట్రాన్జాక్షన్స్‌కు ఆజ్యం పోసింది. నాలుగో కారణం కొవిడ్‌-19. కరోనా మహమ్మారి కూడా డిజిటల్‌ పేమెంట్స్‌ విప్లవానికి పిల్లర్‌గా మారింది. అంటువ్యాధి దేశవ్యాప్తంగా వ్యాపించిన సమయంలో, ప్రజలు ఫిజికల్‌ కరెన్సీని వదిలి పెట్టి డిజిటల్ లావాదేవీల వైపు దౌడు తీశారు.

గుర్తుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు జ్ఞాపకాలు 
2016 నాటి డీమోనిటైజేషన్ జ్ఞాపకాలు రూ.2 వేల నోట్ల ఉపసంహరణ రూపంలో ప్రజలకు మళ్లీ గుర్తుకొచ్చిన తరుణంలో, డిజిటల్ చెల్లింపుల డేటాను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రకటించారు. 2000 రూపాయల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గత వారం ప్రకటించింది. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, మార్కెట్‌లో హఠాత్తుగా ఏర్పడిన నగదు కొరతను తగ్గించడానికి ఈ పింక్‌ నోట్లు విడుదలయ్యాయి. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ప్రజలకు మళ్లీ నోట్ల రద్దు సమస్యలు గుర్తుకు వచ్చాయి. అయితే, ఈసారి పరిస్థితి గతం కంటే చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే, ఇప్పుడు మార్కెట్లో డిజిటల్ మీడియం అందుబాటులో ఉంది. కాబట్టి సాధారణ లావాదేవీలపై పెద్దగా ప్రభావం పడలేదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
Adobe CEO Shantanu Narayen : అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా - ఏఐ ఎఫెక్టే ?
అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా - ఏఐ ఎఫెక్టే ?
Sensex tumbles: మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
Iran war threat: యుద్ధం ప్రభావంతో చమురు మంటలు పైపైకి! టెన్షన్ పెడుతున్న బంగారం! సామాన్యుడిపై ప్రభావం ఎంత?
యుద్ధం ప్రభావంతో చమురు మంటలు పైపైకి! టెన్షన్ పెడుతున్న బంగారం! సామాన్యుడిపై ప్రభావం ఎంత?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget