అన్వేషించండి

Akshata Murty: ఒక్కరోజులో ₹500 కోట్లు పోగొట్టుకున్న అక్షత మూర్తి, కారణం మీరు ఊహించిందే!

భారతదేశంలో రెండో అతి పెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి కుమార్తె అక్షత.

Akshata Murty: యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రధాన మంత్రి రిషి సునక్ (UK PM Rishi Sunak) భార్య అక్షత మూర్తి ఒక్క రోజులో భారీ నష్టాన్ని చవిచూశారు. కేవలం ఒక్కరోజులోనే ఆమె నికర విలువ (Akshata Murthy Networth) ఏకంగా రూ. 500 కోట్లకు పైగా క్షీణించింది. ఇండియన్‌ స్టాక్ మార్కెట్‌ నుంచి ఈ నష్టాన్ని ఆమె భరించాల్సి వచ్చింది.

ఇన్ఫోసిస్‌లో అక్షత వాటా           
భారతదేశంలో రెండో అతి పెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి కుమార్తె అక్షత. స్టాక్ ఎక్స్ఛేంజీలలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 2022 డిసెంబర్ నాటికి ఇన్ఫోసిస్‌లో అక్షతకు 3,89,57,096 షేర్లు ఉన్నాయి. తాజా క్షీణతకు ముందు, ఆమె నికర విలువ సుమారు రూ. 4,500 కోట్లుగా ఉంది. ఇందులో ఎక్కువ భాగం ఇన్ఫోసిస్ షేర్ల రూపంలో ఉంది.

ఇన్ఫోసిస్ ధర పతనం              
నిన్న (సోమవారం, 17 ఏప్రిల్‌ 2023) భారత స్టాక్ మార్కెట్‌ భారీగా పడిపోయింది, ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువ కనిపించింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్ భారీ నష్టాలను ‍‌(Infosys Shares Collapse) చవిచూడాల్సి వచ్చింది. సోమవారం ఇన్ఫోసిస్ షేరు ధర 9.4 శాతం క్షీణించింది. 2020 మార్చి తర్వాత ఇన్ఫోసిస్ షేర్ల ధరల్లో ఇదే అతి పెద్ద పతనం. అక్షత ఆస్తుల నికర విలువ తగ్గడానికి ఇదే కారణం. ఇన్ఫోసిస్ షేర్ల క్రాష్ కారణంగా అక్షత దాదాపు 49 మిలియన్ పౌండ్లు లేదా 61 మిలియన్‌ డాలర్లు లేదా రూ. 500 కోట్లకు పైగా నష్టపోయారు.

డివిడెండ్‌ రూపంలో భారీ సంపాదన          
ఇన్ఫోసిస్, మార్చి 2023 త్రైమాసిక ఫలితాలను గత గురువారం విడుదల చేసింది. దీంతో పాటు, 2022-23 ఆర్థిక సంవత్సరానికి తన వాటాదార్లకు ఒక్కో షేరుకు రూ. 17.50 తుది డివిడెండ్ ప్రకటించింది. ఇన్ఫోసిస్ మొత్తం పెయిడప్‌ క్యాపిటల్‌లో 1.07 శాతానికి సమానమైన 3.89 కోట్ల షేర్లు అక్షత పేరిట ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం, కంపెనీ డివిడెండ్ ద్వారా ఆమె ఏకంగా రూ. 68 కోట్లకు పైగా పొందబోతున్నారు. ఒక్కో షేరుకు రూ. 17.50 చొప్పున లెక్కిస్తే, ఇన్ఫోసిస్ తాజా డివిడెండ్ ద్వారా రూ. 68.17 కోట్లు ఆమె ఖాతాలో జమ అవుతాయి.

ఇవాళ (మంగళవారం, 18 ఏప్రిల్‌ 2023) ఉదయం 11 గంటల సమయానికి, BSEలో, ఇన్ఫోసిస్‌ షేర్ ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. ఆ సమయానికి ఒక్కో షేర్‌ 0.11% లేదా రూ. 1.10 లాభంతో రూ. 1,259.15 వద్ద కదులుతోంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
Adobe CEO Shantanu Narayen : అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా - ఏఐ ఎఫెక్టే ?
అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా - ఏఐ ఎఫెక్టే ?
Sensex tumbles: మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
Iran war threat: యుద్ధం ప్రభావంతో చమురు మంటలు పైపైకి! టెన్షన్ పెడుతున్న బంగారం! సామాన్యుడిపై ప్రభావం ఎంత?
యుద్ధం ప్రభావంతో చమురు మంటలు పైపైకి! టెన్షన్ పెడుతున్న బంగారం! సామాన్యుడిపై ప్రభావం ఎంత?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget