అన్వేషించండి

New Maruti Car: PM నరేంద్ర మోదీ చేతుల మీదుగా మారుతి తొలి ఎలక్ట్రిక్‌ కారు e-Vitara లాంచ్‌ - 100 దేశాలకు ఎగుమతి ప్లాన్

e-Vitara Launch: గుజరాత్‌లో మారుతి సుజుకి ఎలక్ట్రిక్‌ ప్లాంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. తొలి e-Vitara ఎలక్ట్రిక్‌ SUVని లాంచ్ చేసి, 100 దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించారు.

Maruti Suzuki e-Vitara Launch: భారతదేశం గ్రీన్‌ మొబిలిటీ దిశగా మరో కీలక అడుగు వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం గుజరాత్‌లోని హన్సల్పూర్‌లో మారుతి సుజుకి ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించి, దేశీయంగా తయారైన తొలి ఎలక్ట్రిక్‌ SUV e-Vitaraని లాంచ్ చేశారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “ఇది భారత్‌ స్వావలంబన యాత్రలో, గ్రీన్‌ మొబిలిటీ హబ్‌గా మారే ప్రయత్నంలో ప్రత్యేకమైన రోజు. భారత్‌లో తయారైన e-Vitara కేవలం దేశీయ మార్కెట్‌కే కాకుండా, ప్రపంచంలోని 100కి పైగా దేశాలకు ఎగుమతి అవుతుంది” అని వెల్లడించారు.

Maruti Suzuki e-Vitara ప్రత్యేకతలు

మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్‌ SUV.

e-Vitara రెండు బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.

49 kWh బ్యాటరీ - 7 kW AC ఛార్జర్‌తో 6.5 గంటలు, 11 kW ఛార్జర్‌తో 4.5 గంటల్లో ఫుల్‌ ఛార్జ్ అవుతుంది.

61 kWh బ్యాటరీ - 7 kW ఛార్జర్‌తో 9 గంటలు, 11 kW ఛార్జర్‌తో 5.5 గంటల్లో ఛార్జింగ్‌ పూర్తి అవుతుంది.

రెండు వేరియంట్లు కూడా DC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్ కలిగి ఉండటం వల్ల కేవలం 45 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

వాహనానికి 18 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌, గూడ్‌యర్‌ టైర్లు ఫిట్‌ చేశారు.

ఇ-విటారా ధర
మారుతి సుజుకీ, ఇ-విటారా ధరను అధికారికంగా ఇంకా నిర్ణయించలేదు. ధర ఎంత అనే విషయం అతి త్వరలోనే తెలుస్తుంది. అయితే, ఈ కొత్త ఎలక్ట్రిక్‌ కారు రేటు సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పోటీ కార్లు
ఇ-విటారాను ఈ రోజే లాంచ్‌ చేసినప్పటికీ, ఈ రోజు నుంచే మార్కెట్‌లో అందుబాటులో ఉండదు. ఈ రోజు నుంచి ఈ కారు ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. మరో 10 రోజుల లోపు, అంటే సెప్టెంబర్‌ 3, 2025 నుంచి భారతీయ కస్టమర్లకు ఇ-విటారా డెలివరీలు ప్రారంభం అవుతాయి. ఇప్పటికే యూకేలో లాంచ్ అయిన e-Vitara, భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌, MG ZS EV, మహీంద్రా BE.6 వంటి మోడళ్లకు బలమైన పోటీ ఇవ్వనుంది.

గుజరాత్‌లో బ్యాటరీ ఉత్పత్తి
e-Vitara లాంచ్‌తో పాటు, గుజరాత్‌లో హైబ్రిడ్‌ బ్యాటరీ ఎలక్ట్రోడ్‌ ఉత్పత్తి కూడా ప్రారంభం అవుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు. దీని ద్వారా దేశీయ బ్యాటరీ తయారీ ఎకోసిస్టమ్‌ మరింత బలోపేతం అవుతుందని, దిగుమతులపై ఆధారపడకుండా భారత్‌ స్వయం సమృద్ధి దేశంగా మారుతుందని తెలిపారు.

ఈ ప్రాజెక్ట్‌ ద్వారా భారత్‌ కేవలం ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలోనే కాకుండా, కీలకమైన బ్యాటరీ టెక్నాలజీలో కూడా అంతర్జాతీయ స్థాయిలో పోటీ ఇవ్వగల స్థాయికి చేరుకుంటుందని ఆటోమొబైల్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్‌ SUVగా e-Vitara లాంచ్ అవడం భారత ఆటోమొబైల్‌ రంగానికి మైలురాయి. ఇది పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా, భారత్‌ను గ్లోబల్‌ EV మార్కెట్లో ఒక ప్రధాన ప్లేయర్‌గా నిలబెట్టబోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

రోడ్డుపై కారు సాఫీగా వెళ్లడానికి కారణం ఇదే! కార్లలో ఉండే సస్పెన్షన్ రకాల గురించి తెలుసుకోండి
మీ కారు సస్పెన్షన్‌ను అర్ధం చేసుకోండి - సింపుల్ నుంచి హైటెక్ వరకు
Electric Scooter: సింగిల్ ఛార్జ్‌తో 212 కి.మీ రేంజ్.. Honda, Bajajలను వెనక్కి నెడుతున్న ఈవీ
Electric Scooter: సింగిల్ ఛార్జ్‌తో 212 కి.మీ రేంజ్.. Honda, Bajajలను వెనక్కి నెడుతున్న ఈవీ
EV vs Petrol Car.. వర్షాకాలంలో ఏది బెటర్? రెండింటి సేఫ్టీ ఫీచర్లు ఎలా ఉంటాయి?
EV vs Petrol Car.. వర్షాకాలంలో ఏది బెటర్? రెండింటి సేఫ్టీ ఫీచర్లు ఎలా ఉంటాయి?
భద్రతలో వెనుకబడిన 17 కార్లు - రూ.3.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు మోడళ్లు
భారత్‌లో ఇప్పటికీ 6 ఎయిర్‌బ్యాగ్‌లు లేని కార్లు ఇవే - మీ కారు ఈ లిస్ట్‌లో ఉందా?

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Suriya 47 : సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
RTC Bus Fire Accident: మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
Ananya Nagalla : అనన్య 'యోగ'మ్... పీస్ ఫుల్ 'ఆరోగ్య'మ్ - ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్
అనన్య 'యోగ'మ్... పీస్ ఫుల్ 'ఆరోగ్య'మ్ - ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్
Embed widget