అన్వేషించండి

Maruti Suzuki New SUV: త్వరలో మూడు మారుతి సుజుకి ఎస్‌యూవీలు - లాంచ్ చేయనున్న కంపెనీ!

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ త్వరలో మనదేశంలో మూడు ఎస్‌యూవీ కార్లు లాంచ్ చేయనుంది.

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎస్) మనదేశంలో మూడు ఎస్‌యూవీలు లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. రానున్న నెలల్లో ఈ కార్లు భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. వీటన్నిటినీ జనవరిలో జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో మొదట పరిచయం చేశారు. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం.

1. మారుతి సుజుకి ఫ్రాంక్స్
మారుతి సుజుకి ఫ్రాంక్స్ మనదేశంలో వచ్చే నెలలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ప్రత్యేకంగా నెక్సా డీలర్ షిప్స్ ద్వారా ఈ కారును విక్రయించనున్నారు. బలెనో ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బేస్డ్‌గా దీన్ని రూపొందించారు. హార్టెక్ట్ ప్లాట్‌ఫాంను ఇది షేర్ చేసుకోనుంది. దీని ఫ్రంట్ ఫేసియా గ్రాండ్ విటారా తరహాలో ఉంది. దీని స్టాన్స్ కూడా చాలా వైడ్‌గా ఉండనుంది.

2. మారుతి సుజుకి జిమ్నీ
ఐదు డోర్ల మారుతి సుజుకి జిమ్నీ ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉంది. దీనికి సంబంధించిన ప్రొడక్షన్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. 2023 మే లేదా జూన్‌లో దీని ధరను అధికారికంగా ప్రకటించనున్నారు. ఐదు డోర్ల మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా తప్ప దీనికి పెద్ద పోటీ కూడా లేదు.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మూడు డోర్ల కంటే ఈ ఐదు డోర్ల మారుతి సుజుకి జిమ్నీ పెద్దగా ఉండనుంది. ఇది మరింత విశాలంగా కూడా ఉండనుంది. ఇందులో 1.5 లీటర్ల ఫోర్ సిలిండర్ కే15బీ పెట్రోల్ ఇంజిన్ అందించనున్నారు.

3. మారుతి సుజుకి బ్రెజా సీఎన్‌జీ
మారుతి సుజుకి బ్రెజా సీఎన్‌జీ వెర్షన్ కూడా త్వరలో లాంచ్ కానుంది. ఈ విభాగంలో బై ఫ్యూయల్‌తో రానుెన్న మొదటి మోడల్ ఇదే కానుంది. హై మైలేజ్ ఫోకస్‌గా దీన్ని తీసుకున్నారు. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఇందులో మల్టీపుల్ వేరియంట్లను తీసుకురానుంది. 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇందులో కూడా అందించనున్నారు. కానీ పవర్, టార్క్ తక్కువగా ఉండనున్నాయి.

మారుతి సుజుకి మనదేశంలో కొత్త మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. హరియాణాలో ఈ కొత్త ప్లాంట్‌ను కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఇది హరియాణాలో మూడో మారుతి సుజుకి ప్లాంట్ కానుంది. ఇది హరియాణాలో కంపెనీకి అతి పెద్ద ఇన్వెస్ట్‌మెంట్. దాదాపు రూ.20 వేలకు పైగా పెట్టుబడులను కంపెనీ పెట్టనుందని అంచనా. దీనికి సంబంధించిన ఒప్పందం కూడా పూర్తయింది. దీంతో ఖర్కొండాలో 900 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం మారుతి సుజుకికి అందించనుంది.

ఖర్కొండాలోని సోనిపట్‌లో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఇక్కడ ప్లాంట్లు పెట్టడానికి ఈ స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు. దాదాపు 13 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇందులో ల్యాండ్ కొనుగోలుకు రూ.2,400 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. మరో రూ.20 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు.

2025 నాటికి ప్రతి యేటా 2.5 లక్షల కార్లను రూపొందించాలనే లక్ష్యంతో మారుతి సుజుకి ఈ ప్లాంట్‌ను నిర్మిస్తుంది. ఎనిమిది సంవత్సరాలు గడిచేసరికి ప్రతి యేటా 10 లక్షల యూనిట్లను తయారు చేస్తామని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Toyota Fortunerకు అదిరిపోయే మేకోవర్ - కొత్త జనరేషన్ SUVలా మార్చేసిన ఓనర్
పాత Toyota Fortunerకు నెక్స్ట్ జనరేషన్ లుక్ - మోడిఫికేషన్ చూస్తే మతిపోవాల్సిందే!
1,000cc, 280hp పవర్‌తో సంచలనం - ప్రపంచంలోనే అరుదైన 8 సిలిండర్ టూస్ట్రోక్ బైక్ ఆవిష్కరణ
8 సిలిండర్‌ బైక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? - ఈ బండికి పెట్టే రేటుతో ఏకంగా 10 కార్లు కొనవచ్చు!
కొత్త లుక్‌లో TVS Ntorq 125 - హైదరాబాద్, విజయవాడలో ఆన్‌రోడ్ ధరలు ఇవే
కొత్త రంగులు, గ్రాఫిక్స్‌తో TVS Ntorq 125 - తెలుగు రాష్ట్రాల్లో ఎంతకు కొనవచ్చంటే?
హీరో ప్యాషన్ ప్లస్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌, బ్లూటూత్ డిస్‌ప్లే కూడా - కొత్త వేరియంట్‌లో అదిరే ఫీచర్లు
Hero Passion+ మరింత సేఫ్‌, డిస్క్ వేరియంట్‌ కూడా లాంచ్‌ - రేటు ఎక్కువేం కాదు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
CBI Investigation Credibility: సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
White Rice vs Brown Rice : వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
Embed widget