అన్వేషించండి

YS Jagan Congress: కాంగ్రెస్ అధ్యక్షుడితో వైసీపీ ఎంపీ భేటీ - జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నారా ?

Meda Raghunath Reddy: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో వైసీపీ ఎంపీ భేటీపై రాజకీయవర్గాల్లో భిన్న ప్రచారం జరుగుతోంది. ముందస్తు రాజకీయంలో భాగంగా జగన్ పరిచయాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.?

YSRCP MP meeting with Congress President Kharge: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన రాధాకృష్ణన్‌కు మద్దతు ఇస్తున్నామని ఆయనకే ఓటు వేస్తామని విశాఖలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. వైసీపీ విధానాన్ని ప్రకటించారు. దానికి ఆయన ఏ కారణం చెప్పినా.. సాయంత్రానికి వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో సమావేశం అయ్యారు. ఇదేమీ సాధారణ సమావేశం కాదు. చక్కగా బోకేతో పాటు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీలాగా ఆయనతో సమావేశం అయ్యారు. ఇది రాజకీయవర్గాలను ఆశ్చర్య పరిచింది. 

ఎంపీ కాంగ్రెస్‌లో చేరరు - కానీ సీక్రెట్ ఎజెండా ?                  

మేఢా రఘునాథ్ రెడ్డి వైసీపీ రాజ్యసభ ఎంపీ. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదు.  ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బలం లేదు. అందుకే వెంటనే వివరణ ఇచ్చారు. తనకు ఖర్గే..కర్ణాటకలో హోంమంత్రిగా ఉన్నప్పటి నుండి పరిచయం ఉందని.. అందుకే మర్యాదపూర్వకంగా కలిశానన్నారు. పార్టీ మార్పు ప్రచారాలు ఉత్తవేనన్నారు. కానీ ఆయన కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరగలేదు. గతంలో బీజేపీలో చేరుతారని మాత్రం ప్రచారం జరిగింది.కానీ ఆయన సైలెంట్ గా ఉన్నారు. మరి ఎందుకు సమావేశం అయ్యారు. 

కాంగ్రెస్‌కు  వైసీపీ నుంచి సందేశం పంపించారా ?                  

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏడాది కిందట ఢిల్లీలో ధర్నాలు చేపట్టినప్పుడు ఇండీ కూటమి పార్టీలు మద్దతు పలికాయి. ఎన్డీఏ కూటమి పార్టీలు, ఏపీలో ఎన్డీఏ పాలనను విమర్శించాయి. కానీ జగన్మోహన్ రెడ్డి క్లిష్టసమయాల్లో.. బీజేపీ ప్రభుత్వానికే అండగా నిలిచారు. ఎన్డీఏ ప్రవేశ పెట్టిన బిల్లులకే మద్దతు తెలిపారు.తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ అదే చేశారు. దీంతో ఇక ముందు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ.. వైసీపీని సమర్థించ అవకాశం ఉండదు. బీజేపీతో ఎలాగూ జగన్ కలవలేరు. అందుకే..తనకు ఢిల్లీ స్థాయిలో మద్దతు ఉండాలంటే.. కాంగ్రెస్ కూటమి సపోర్టు అవసరమని జగన్ భావిస్తున్నారని.. ఆ సందేశాన్ని..  మేడా రఘునాథ్ రెడ్డి ద్వారా పంపించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

సేఫ్ గేమ్ ఆడటం ప్రారంభించారా ?            

ఎన్డీఏ కూటమి చాలా బలంగా ఉంది. టీడీపీ, జనసేనలను బీజేపీ  వదులుకునే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో.. రాను రాను వైసీపీ బలం తగ్గిపోతుంది. మరో రెండు, మూడేళ్లలో రాజ్యసభ స భ్యుల పదవి కాలం అయిపోతుంది. ఖాళీ అయ్యే సీట్లన్నీ ఎన్డీఏ ఖాతాలో పడిపోతాయి. అప్పుడు వైసీపీ అవసరం బీజేపీకి అసలు ఉండదు. ఇప్పుడు కూడా ఉండదు కానీ.. అవసరం లేకపోయినా.. వైసీపీ మద్దతు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతోంది. దీని వల్ల రాజకీయంగా సమస్యలు వస్తాయని తెలిసినా తప్పడం లేదు. ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ కూటమితోనూ సంబంధాలు కొనసాగించే ప్రయత్నాలను తమ ఎంపీల ద్వారా ప్రారంభించారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యూత్ కాంగ్రెస్ నేతల్ని అడ్డుకున్న పోలీసులు.. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత.. 
యూత్ కాంగ్రెస్ నేతల్ని అడ్డుకున్న పోలీసులు.. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత.. 
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Rains In AP and Telangana: రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
BRS YSRCP Silent on BJP Centre: జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?
జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
హైరైడర్ హైబ్రిడ్‌ & డస్టర్ టర్బో DCT కంపారిజన్‌ - లాంగ్‌టర్మ్‌లో ఎక్కువ లాభం ఇచ్చేది ఏ కారు?
సిటీలోఎక్కువ డ్రైవ్‌ చేసేవాళ్లకు ఏ SUV బెస్ట్‌? టయోటా హైరైడర్ హైబ్రిడ్‌ Vs రెనాల్ట్ డస్టర్‌ - ఏది కొనాలి?
Shreyas Iyer World Record: కెప్టెన్ గా శ్రేయస్ వరల్డ్ రికార్డ్ .. జింబాబ్వేపై విక్టరీతో 7 మ్యాచుల నిరీక్షణకు ఎండ్ కార్డ్, ధోని రికార్డు బ్రేక్ 
కెప్టెన్ గా శ్రేయస్ వరల్డ్ రికార్డ్ .. జింబాబ్వేపై విక్టరీతో 7 మ్యాచుల నిరీక్షణకు ఎండ్ కార్డ్, ధోని రికార్డు బ్రేక్ 
Embed widget