అన్వేషించండి

YS Jagan Congress: కాంగ్రెస్ అధ్యక్షుడితో వైసీపీ ఎంపీ భేటీ - జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నారా ?

Meda Raghunath Reddy: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో వైసీపీ ఎంపీ భేటీపై రాజకీయవర్గాల్లో భిన్న ప్రచారం జరుగుతోంది. ముందస్తు రాజకీయంలో భాగంగా జగన్ పరిచయాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.?

YSRCP MP meeting with Congress President Kharge: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన రాధాకృష్ణన్‌కు మద్దతు ఇస్తున్నామని ఆయనకే ఓటు వేస్తామని విశాఖలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. వైసీపీ విధానాన్ని ప్రకటించారు. దానికి ఆయన ఏ కారణం చెప్పినా.. సాయంత్రానికి వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో సమావేశం అయ్యారు. ఇదేమీ సాధారణ సమావేశం కాదు. చక్కగా బోకేతో పాటు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీలాగా ఆయనతో సమావేశం అయ్యారు. ఇది రాజకీయవర్గాలను ఆశ్చర్య పరిచింది. 

ఎంపీ కాంగ్రెస్‌లో చేరరు - కానీ సీక్రెట్ ఎజెండా ?                  

మేఢా రఘునాథ్ రెడ్డి వైసీపీ రాజ్యసభ ఎంపీ. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదు.  ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బలం లేదు. అందుకే వెంటనే వివరణ ఇచ్చారు. తనకు ఖర్గే..కర్ణాటకలో హోంమంత్రిగా ఉన్నప్పటి నుండి పరిచయం ఉందని.. అందుకే మర్యాదపూర్వకంగా కలిశానన్నారు. పార్టీ మార్పు ప్రచారాలు ఉత్తవేనన్నారు. కానీ ఆయన కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరగలేదు. గతంలో బీజేపీలో చేరుతారని మాత్రం ప్రచారం జరిగింది.కానీ ఆయన సైలెంట్ గా ఉన్నారు. మరి ఎందుకు సమావేశం అయ్యారు. 

కాంగ్రెస్‌కు  వైసీపీ నుంచి సందేశం పంపించారా ?                  

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏడాది కిందట ఢిల్లీలో ధర్నాలు చేపట్టినప్పుడు ఇండీ కూటమి పార్టీలు మద్దతు పలికాయి. ఎన్డీఏ కూటమి పార్టీలు, ఏపీలో ఎన్డీఏ పాలనను విమర్శించాయి. కానీ జగన్మోహన్ రెడ్డి క్లిష్టసమయాల్లో.. బీజేపీ ప్రభుత్వానికే అండగా నిలిచారు. ఎన్డీఏ ప్రవేశ పెట్టిన బిల్లులకే మద్దతు తెలిపారు.తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ అదే చేశారు. దీంతో ఇక ముందు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ.. వైసీపీని సమర్థించ అవకాశం ఉండదు. బీజేపీతో ఎలాగూ జగన్ కలవలేరు. అందుకే..తనకు ఢిల్లీ స్థాయిలో మద్దతు ఉండాలంటే.. కాంగ్రెస్ కూటమి సపోర్టు అవసరమని జగన్ భావిస్తున్నారని.. ఆ సందేశాన్ని..  మేడా రఘునాథ్ రెడ్డి ద్వారా పంపించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

సేఫ్ గేమ్ ఆడటం ప్రారంభించారా ?            

ఎన్డీఏ కూటమి చాలా బలంగా ఉంది. టీడీపీ, జనసేనలను బీజేపీ  వదులుకునే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో.. రాను రాను వైసీపీ బలం తగ్గిపోతుంది. మరో రెండు, మూడేళ్లలో రాజ్యసభ స భ్యుల పదవి కాలం అయిపోతుంది. ఖాళీ అయ్యే సీట్లన్నీ ఎన్డీఏ ఖాతాలో పడిపోతాయి. అప్పుడు వైసీపీ అవసరం బీజేపీకి అసలు ఉండదు. ఇప్పుడు కూడా ఉండదు కానీ.. అవసరం లేకపోయినా.. వైసీపీ మద్దతు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతోంది. దీని వల్ల రాజకీయంగా సమస్యలు వస్తాయని తెలిసినా తప్పడం లేదు. ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ కూటమితోనూ సంబంధాలు కొనసాగించే ప్రయత్నాలను తమ ఎంపీల ద్వారా ప్రారంభించారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
AP Mega DSC 2025 Controversy: మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?
మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Revanth Reddy: హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Tech Layoffs: 2026లో భారీగా లేఆఫ్స్.. ఇప్పటివరకే 1 లక్షకు పైగా ఉద్యోగాలు తొలగింపు
2026లో భారీగా లేఆఫ్స్.. ఇప్పటివరకే 1 లక్షకు పైగా ఉద్యోగాలు తొలగింపు
Sahara Desert Tragedy: సహారా ఎడారిలో శవాల గుట్టలు - ఎందుకిలా జరుగుతోంది?
సహారా ఎడారిలో శవాల గుట్టలు - ఎందుకిలా జరుగుతోంది?
Embed widget