అన్వేషించండి

Political Unlucky Persons : ఎమ్మెల్సీగానే కాదు ఎమ్మెల్యేగానూ గెలుపు ముంగిట బోర్లా - పాపం కోలా గురువులు !

రాజకీయాల్లో గెలుపు దాకా వచ్చి ఓటమి పాలవుతున్న నేత కోలా గురువులు. ఆయనకు రెండో సారి ఇలాంటి పరిస్థితి ఎదురయింది.


Political Unlucky Persons :  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో గోలా గురవులు విజయం సాధించారు. జయ మంగళ వెంకటరమణ పరాజయం పాలయ్యారు..అని మీడియాలో బ్రేకింగ్ చూసి కోలా గురువులు అనుచరులు విశాఖ సౌత్ నియోజకవర్గంోని ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. టపాసుల శబ్దం ఇలా ముగియగానే అలా వారికి మైండ్ బ్లాంక్ అయ్యే విషయం తెలిసింది. అదేమిటంటే గెలిచింది గురువులు కాదు జయ మంగళ వెంకటరమణ అని. దీంతో ముందస్తు సంబరాలు చేసుకున్నందుకు అనుచరులు ఫీలయ్యారు. అసెంబ్లీ కౌంటింగ్ దగ్గర ఉన్న కోలా గురువులుకు గతం గుర్తొచ్చి ఉంటుంది.ఎందుకంటే ఇలా గెలుపు చేతుల్లోకి వచ్చి చేజారిపోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా ఇదే పరిస్థితి. 

ప్రజారాజ్యం తరపున పోటీ చేసి తృటిలో గెలుపును కోల్పోయిన గురువులు

కోలా గురువులు ప్రజా రాజ్యం నుంచి రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆయన విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు.  2009లో విశాఖ సౌత్  నుంచి ప్రజారాజ్యం తరుపున కోలా గురువులు, టీడీపీ తరుపున వాసుపల్లి గణేష్, కాంగ్రెస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ పోటీచేశారు. గురువులు, గణేష్ ఇద్దరు మత్స్య కార వర్గం వాడ బలిజ సామాజికవర్గం. పోరు హోరాహోరీగా సాగింది. ముగ్గురికి పోటాపోటీగా ఓట్లు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కోలా గురువులు స్వల్ప ఆధిక్యతలో ఉంటూ వచ్చారు. దీంతో రెండో స్థానంలో ఉన్న ద్రోణంరాజు శ్రీనివాస్ ఇక తన ఓటమి ఖాయమనుకుని  వెళ్లిపోయారు. 

మొదట గెలిచినట్లుగా భావించినా చివరికి స్వల్ప తేడాతో ఓటమి

కౌంటింగ్ హాల్ నుంచి ప్రత్యర్థి వెళ్లిపోయాడని తెలిసి కోలా గురువులు అనుచరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. గురువులు కూడా ఇక తాను గెలిచానని అనుకున్నారు. తీరా కౌంటింగ్ మెత్తం పూర్తయ్యే సరికి ఫలితం తిరగబడింది.  341 ఓట్ల తేడాతో  కాంగ్రెస్ అభ్యర్థి ద్రోణం రాజు శ్రీనివాస్ .. ప్రజారాజ్యం అభ్యర్థి కోలా గురువులు మీద గెలిచారు. దీంతో ఆయన పరాజయం పాలయ్యారు. ఎమ్మెల్యే అవ్వాలన్న కల నెరవేరలేదు. ఆ తర్వాత కూడా ఆయన రాజకీయంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొని ప్రజల్లోనే ఉంటున్నారు. తర్వాత కోలా గురువులు వైసీపీలో చేరారు.   2014లో గురువులు వైసీపీ , గణేష్ టీడీపీ, ద్రోణంరాజు కాంగ్రెస్ తరపున పోటీపడగా గణేష్ గురువుల మీద దాదాపు 18 వేల మెజారిటీతో గెలిచారు. 

ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే తరహా ఓటమి 

2019 ఎన్నికల ముందు ద్రోణంరాజు వైసీపీలో చేరి టికెట్ ఎగరేసుకొని పోయారు.  గురువులు ద్రోణం రాజుకు మద్దతు ఇచ్చారు కానీ గణేష్ దాదాపు నాలుగువేల మెజారిటీతో గెలిచారు. వైసీపీ 151 సునామిలో కూడా వైజాగ్ లోని నాలుగు సీట్లు టీడీపీ గెలిచింది. ద్రోణం రాజు కోవిడ్ తో 2020లో మరణించారు. టీడీపీ తరపున గెలిచిన గణేష్ వైసీపీలోకి ఫిరాయించారు. గురువులకు మొదట మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు..  2009 ఎమ్మెల్యే గా నిన్న ఎమ్మెల్సీ గా పక్కా గెలుపు అనుకున్నా కోలా గురువులను దురదృష్టం వెంటాడింది,  అధ్యక్షా అనే అవకాశం దక్కలేదు. అందుక కోలా గురువులు రాజకీయాల్లో అన్ లక్కీ పర్సన్ అని సహచరులు సానుభూతి తెలుపుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
YS Sharmila : YSR, విజయమ్మను  బూతులు తిట్టిన బొత్స తండ్రి సమానులా ?  జగన్‌పై షర్మిల సెటైర్లు
YSR, విజయమ్మను బూతులు తిట్టిన బొత్స తండ్రి సమానులా ? జగన్‌పై షర్మిల సెటైర్లు
TS Inter 2nd Year Results 2024: తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ ఫలితాలు విడుదల- ములుగు జిల్లా టాప్, కామారెడ్డి లాస్ట్
తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ ఫలితాలు విడుదల- ములుగు జిల్లా టాప్, కామారెడ్డి లాస్ట్
Fact Check: భారత్ పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగితే 25 కోట్ల ముస్లింలు పాక్ ఆర్మీలో చేరతారని అసదుద్దీన్ అన్నారా? నిజం ఏంటంటే
భారత్ పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగితే 25 కోట్ల ముస్లింలు పాక్ ఆర్మీలో చేరతారని అసదుద్దీన్ అన్నారా? నిజం ఏంటంటే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

TDP candidate Pemmasani Chandrasekhar Assets value | దేశంలోనే ధనిక అభ్యర్థి మన తెలుగోడే అని తెలుసా.!Madhavi Latha Nomination Ryally |భాగ్యలక్ష్మీ టెంపుల్ లో పూజలు...నామినేషన్ వేసిన మాధవి లత | ABPPawan kalyan Kakinada | కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ నామినేషన్ ర్యాలీలో అలసిపోయిన పవన్ కళ్యాణ్ | ABPNara Rohit Prathinidhi 2 Interview | డైరెక్టర్ గా మారిన మూర్తితో జర్నలిస్ట్ నారా రోహిత్ ఇంటర్వ్యూ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
YS Sharmila : YSR, విజయమ్మను  బూతులు తిట్టిన బొత్స తండ్రి సమానులా ?  జగన్‌పై షర్మిల సెటైర్లు
YSR, విజయమ్మను బూతులు తిట్టిన బొత్స తండ్రి సమానులా ? జగన్‌పై షర్మిల సెటైర్లు
TS Inter 2nd Year Results 2024: తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ ఫలితాలు విడుదల- ములుగు జిల్లా టాప్, కామారెడ్డి లాస్ట్
తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ ఫలితాలు విడుదల- ములుగు జిల్లా టాప్, కామారెడ్డి లాస్ట్
Fact Check: భారత్ పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగితే 25 కోట్ల ముస్లింలు పాక్ ఆర్మీలో చేరతారని అసదుద్దీన్ అన్నారా? నిజం ఏంటంటే
భారత్ పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగితే 25 కోట్ల ముస్లింలు పాక్ ఆర్మీలో చేరతారని అసదుద్దీన్ అన్నారా? నిజం ఏంటంటే
Bandi Sanjay :  అభ్యర్ధిని కూడా ప్రకటించుకోలేని అసమర్థులా నన్ను ఓడించేది -  కాంగ్రెస్‌పై బండి సంజయ్ సెటైర్లు
అభ్యర్ధిని కూడా ప్రకటించుకోలేని అసమర్థులా నన్ను ఓడించేది - కాంగ్రెస్‌పై బండి సంజయ్ సెటైర్లు
Nara Rohit: ఏపీ రాజకీయాలపై నారా రోహిత్‌ హాట్‌ కామెంట్స్‌ - 'ప్రతినిధి 2' వాయిదాపై ఏమన్నాడంటే!
ఏపీ రాజకీయాలపై నారా రోహిత్‌ హాట్‌ కామెంట్స్‌ - 'ప్రతినిధి 2' వాయిదాపై ఏమన్నాడంటే!
సుప్రీంకోర్టు దెబ్బకి దిగొచ్చిన పతంజలి, క్షమాపణలు కోరుతూ న్యూస్‌పేపర్‌లలో భారీ ప్రకటనలు
సుప్రీంకోర్టు దెబ్బకి దిగొచ్చిన పతంజలి, క్షమాపణలు కోరుతూ న్యూస్‌పేపర్‌లలో భారీ ప్రకటనలు
YS Jagan Stone Pelting Cace :  జగన్‌పై రాయి  దాడి కేసు నిందితునికి మూడు రోజుల కస్టడీ - థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దన్న  కోర్టు
జగన్‌పై రాయి దాడి కేసు నిందితునికి మూడు రోజుల కస్టడీ - థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దన్న కోర్టు
Embed widget