అన్వేషించండి

Anchor Syamala: 'కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరవు' - టీడీపీ కార్యకర్తలు తనను వేధిస్తున్నారన్న యాంకర్ శ్యామల

Andhra News: టీడీపీ కార్యకర్తలు తనను ట్రోల్ చేస్తూ వేధిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రాజకీయాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారని.. త్వరలోనే సమాధానం తెలుస్తుందన్నారు.

Anchor Syamala Comments: కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని.. మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయని వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల (Anchor Syamala) ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తనను టీడీపీ కార్యకర్తలు వేధిస్తున్నారని.. ఆ పార్టీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు రెచ్చిపోయాయని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్.. తనను అధికార ప్రతినిధిగా నియమించినప్పటి నుంచీ అత్యంత దారుణంగా తనపై పోస్టులు పెడుతున్నారని.. టీడీపీ అఫీషియల్ గ్రూపులో తన గురించి అసభ్యకరంగా పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నా ఫోటోలను ఫేక్ చేసి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా.?. సినిమాల్లో పని చేసిన వారు రాజకీయాల్లోకి రాకూడదా.?. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ముందు సినీ నటుడు కాదా.?. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమ నుంచి రాలేదా.?. టీడీపీలో జయప్రదలాంటి మహిళలు పని చేయలేదా.?. మహిళ అనగానే ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తారా.?. నాకు రాజకీయాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. వారికి త్వరలోనే సమాధానం తెలుస్తుంది. మానసికంగా మమ్మల్ని దెబ్బతీయాలని చూసినా మేం ఎక్కడా వెనక్కు తగ్గం. మహిళా శక్తి అంటే ఏంటో చూపిస్తాం. వైసీపీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అమెరికాలో ఉండే టీడీపీ కార్యకర్తలు కూడా నన్ను దూషిస్తున్నారు. త్వరలోనే వీరందరి సంగతి చూస్తాను.' అని శ్యామల హెచ్చరించారు.

'నాలుగు నెలల్లోనే దారుణాలు'

కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని శ్యామల మండిపడ్డారు. 'కూటమి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఎన్నో దారుణాలు జరిగాయి. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. పిఠాపురంలో బాలికపై లైంగిక దాడి జరిగింది. పుంగనూరులో పాప కేసులో పోలీసులు సరిగా వ్యవహరించలేదు. సాక్షాత్తు సీఐ తల్లినే కిడ్నాప్ చేసి హత్య చేస్తే ఎవరికి చెప్పుకోవాలి.?. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది.?. ముచ్చుమర్రి ఘటనలో చిన్నారి డెడ్ బాడీని కూడా తీయలేదు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. వైఎస్ జగన్ పాలనలో ఆడపిల్లలు, మహిళలకు రక్షణ ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. 30 వేల మంది మహిళలు మిస్సింగ్ అంటూ హడావుడి చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు.?. రాష్ట్రంలో పెరుగుతున్న దారుణాలపై కూటమి ప్రభుత్వం వివరణ ఇవ్వాలి.' అని పేర్కొన్నారు.

Also Read: Crime News: పిఠాపురంలో దారుణం - బాలికకు మద్యం తాగించి ఆపై అత్యాచారం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
AP Mega DSC 2025 Controversy: మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?
మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget