అన్వేషించండి

Anchor Syamala: 'కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరవు' - టీడీపీ కార్యకర్తలు తనను వేధిస్తున్నారన్న యాంకర్ శ్యామల

Andhra News: టీడీపీ కార్యకర్తలు తనను ట్రోల్ చేస్తూ వేధిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రాజకీయాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారని.. త్వరలోనే సమాధానం తెలుస్తుందన్నారు.

Anchor Syamala Comments: కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని.. మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయని వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల (Anchor Syamala) ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తనను టీడీపీ కార్యకర్తలు వేధిస్తున్నారని.. ఆ పార్టీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు రెచ్చిపోయాయని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్.. తనను అధికార ప్రతినిధిగా నియమించినప్పటి నుంచీ అత్యంత దారుణంగా తనపై పోస్టులు పెడుతున్నారని.. టీడీపీ అఫీషియల్ గ్రూపులో తన గురించి అసభ్యకరంగా పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నా ఫోటోలను ఫేక్ చేసి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా.?. సినిమాల్లో పని చేసిన వారు రాజకీయాల్లోకి రాకూడదా.?. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ముందు సినీ నటుడు కాదా.?. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమ నుంచి రాలేదా.?. టీడీపీలో జయప్రదలాంటి మహిళలు పని చేయలేదా.?. మహిళ అనగానే ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తారా.?. నాకు రాజకీయాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. వారికి త్వరలోనే సమాధానం తెలుస్తుంది. మానసికంగా మమ్మల్ని దెబ్బతీయాలని చూసినా మేం ఎక్కడా వెనక్కు తగ్గం. మహిళా శక్తి అంటే ఏంటో చూపిస్తాం. వైసీపీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అమెరికాలో ఉండే టీడీపీ కార్యకర్తలు కూడా నన్ను దూషిస్తున్నారు. త్వరలోనే వీరందరి సంగతి చూస్తాను.' అని శ్యామల హెచ్చరించారు.

'నాలుగు నెలల్లోనే దారుణాలు'

కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని శ్యామల మండిపడ్డారు. 'కూటమి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఎన్నో దారుణాలు జరిగాయి. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. పిఠాపురంలో బాలికపై లైంగిక దాడి జరిగింది. పుంగనూరులో పాప కేసులో పోలీసులు సరిగా వ్యవహరించలేదు. సాక్షాత్తు సీఐ తల్లినే కిడ్నాప్ చేసి హత్య చేస్తే ఎవరికి చెప్పుకోవాలి.?. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది.?. ముచ్చుమర్రి ఘటనలో చిన్నారి డెడ్ బాడీని కూడా తీయలేదు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. వైఎస్ జగన్ పాలనలో ఆడపిల్లలు, మహిళలకు రక్షణ ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. 30 వేల మంది మహిళలు మిస్సింగ్ అంటూ హడావుడి చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు.?. రాష్ట్రంలో పెరుగుతున్న దారుణాలపై కూటమి ప్రభుత్వం వివరణ ఇవ్వాలి.' అని పేర్కొన్నారు.

Also Read: Crime News: పిఠాపురంలో దారుణం - బాలికకు మద్యం తాగించి ఆపై అత్యాచారం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget