అన్వేషించండి

Anchor Syamala: 'కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరవు' - టీడీపీ కార్యకర్తలు తనను వేధిస్తున్నారన్న యాంకర్ శ్యామల

Andhra News: టీడీపీ కార్యకర్తలు తనను ట్రోల్ చేస్తూ వేధిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రాజకీయాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారని.. త్వరలోనే సమాధానం తెలుస్తుందన్నారు.

Anchor Syamala Comments: కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని.. మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయని వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల (Anchor Syamala) ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తనను టీడీపీ కార్యకర్తలు వేధిస్తున్నారని.. ఆ పార్టీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు రెచ్చిపోయాయని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్.. తనను అధికార ప్రతినిధిగా నియమించినప్పటి నుంచీ అత్యంత దారుణంగా తనపై పోస్టులు పెడుతున్నారని.. టీడీపీ అఫీషియల్ గ్రూపులో తన గురించి అసభ్యకరంగా పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నా ఫోటోలను ఫేక్ చేసి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా.?. సినిమాల్లో పని చేసిన వారు రాజకీయాల్లోకి రాకూడదా.?. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ముందు సినీ నటుడు కాదా.?. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమ నుంచి రాలేదా.?. టీడీపీలో జయప్రదలాంటి మహిళలు పని చేయలేదా.?. మహిళ అనగానే ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తారా.?. నాకు రాజకీయాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. వారికి త్వరలోనే సమాధానం తెలుస్తుంది. మానసికంగా మమ్మల్ని దెబ్బతీయాలని చూసినా మేం ఎక్కడా వెనక్కు తగ్గం. మహిళా శక్తి అంటే ఏంటో చూపిస్తాం. వైసీపీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అమెరికాలో ఉండే టీడీపీ కార్యకర్తలు కూడా నన్ను దూషిస్తున్నారు. త్వరలోనే వీరందరి సంగతి చూస్తాను.' అని శ్యామల హెచ్చరించారు.

'నాలుగు నెలల్లోనే దారుణాలు'

కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని శ్యామల మండిపడ్డారు. 'కూటమి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఎన్నో దారుణాలు జరిగాయి. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. పిఠాపురంలో బాలికపై లైంగిక దాడి జరిగింది. పుంగనూరులో పాప కేసులో పోలీసులు సరిగా వ్యవహరించలేదు. సాక్షాత్తు సీఐ తల్లినే కిడ్నాప్ చేసి హత్య చేస్తే ఎవరికి చెప్పుకోవాలి.?. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది.?. ముచ్చుమర్రి ఘటనలో చిన్నారి డెడ్ బాడీని కూడా తీయలేదు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. వైఎస్ జగన్ పాలనలో ఆడపిల్లలు, మహిళలకు రక్షణ ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. 30 వేల మంది మహిళలు మిస్సింగ్ అంటూ హడావుడి చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు.?. రాష్ట్రంలో పెరుగుతున్న దారుణాలపై కూటమి ప్రభుత్వం వివరణ ఇవ్వాలి.' అని పేర్కొన్నారు.

Also Read: Crime News: పిఠాపురంలో దారుణం - బాలికకు మద్యం తాగించి ఆపై అత్యాచారం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
Jogi Ramesh Domestic Violence Case: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహహింస కేసు - 11 మందిపై FIR
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహహింస కేసు - 11 మందిపై FIR
Pawan Kalyan Vs Vijay: పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
Rampachodavaram Mega PTM: ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా విద్యావ్యవస్థలో మార్పులు - రంపచోడవరం మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా విద్యావ్యవస్థలో మార్పులు - రంపచోడవరం మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget