అన్వేషించండి

YSRCP And BJP Tug Of War : బీజేపీ-వైఎస్ఆర్‌సీపీ పొత్తుల పంచాయతీ ! ఎవరు ప్రయత్నించారు..? ఎవరు వద్దన్నారు..?

కేంద్ర కేబినెట్‌ పునర్వవస్థీకరించిన చాలా రోజుల తర్వాత ఎన్డీఏలోకి రమ్మని బీజేపీ ఆఫర్ ఇస్తే వద్దనుకున్నామని వైసీపీ నేతలు జాతీయ మీడియాకు చెబుతున్నారు. అలాంటిదేమీ లేదని బీజేపీ నేతలు ఖండిస్తున్నారు.


భారతీయ జనతాపార్టీ,  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  మధ్య ఇప్పుడు ఓ కొత్త రకం వార్ నడుస్తోంది. విషయం ఏపీకి చెందిందే అయినా ఎక్కువుగా నేషనల్ మీడియాలోనే హైలెట్ అవుతోంది. అదేంటంటే...మాతో పొత్తు కోసం మీరు ప్రయత్నించారంటే.. కాదు మీరు ప్రయత్నించారని ఇద్దరూ ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం. మీతో పొత్తుల కోసం వెంపర్లాడే దీన స్థితిలో మేం లేం అని ఇద్దరూ ఒకే రకమైన స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ఈ పొత్తుల పంచాయతీ ఏమిటి అన్నది ఇతర పార్టీల నేతల్లో చర్చనీయాంశంగా మారింది .

కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ పూర్తయిన తరవాత "ఆఫర్ల"పై చర్చలు..!

కేంద్రమంత్రివర్గ విస్తరణ జరిగి చాలారోజులయింది. ఆ విస్తరణ కసరత్తు జరుగుతున్న సమయంలో ఏపీ నుంచి ఎవరికి మంత్రి పదవి వస్తుందా అన్న చర్చలు మీడియాలో జరిగాయి. కొన్నాళ్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరు వినిపించింది. చివరికి వచ్చే సరికి సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు పేర్లుకూడా వినిపించాయి. కానీ ఎవరికీ పదవులు రాలేదు. కానీ వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా..  బీజేపీ ఎన్డీఏ కూటమిలోకి వైఎస్ఆర్‌సీపీని ఆహ్వానించిందని.. అయితే జగన్ మాత్రం ఆలోచిస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు ప్రకటించేవి. అదే తరహాలో మంత్రివర్గ పునర్వవస్థీకరణ పూర్తయిన చాలా రోజుల తర్వాత బీజేపీ మమ్మల్ని మంత్రివర్గంలో చేరమని బతిమాలింది కానీ మేమే తిరస్కరించామని వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఓ ఇంగ్లిష్ పత్రికతో మాట్లాడారు. అంతే అక్కడే నిప్పురాజుకున్నట్లయింది.

బీజేపీ పిలిచిందన్న విజయసాయి... అలాంటి  గతి పట్టలేదన్న బీజేపీ..!

అసలు మంత్రివర్గ పునర్వవస్థీకరణ అయిపోయి చాలా కాలం అయింది. ఇప్పుడెందుకు విజయసాయిరెడ్డి పొత్తు మాటలు మాట్లాడుతున్నారన్నది ఎక్కువ మందికి అర్థంకాదు కానీ... దానికో రీజన్ ఉందని ఇతరపార్టీల నేతలు అంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం  వైసీపీ  తప్పుల్ని క్షమించే పరిస్థితిలో లేదు. ముఖ్యంగా ఆర్థికపరమైన తప్పుల్ని భరించడం లేదు. మరో వైపు అప్పులకు సహకరించడానికి సిద్ధంగా లేదు . దీంతో బీజేపీపై ఒత్తిడి పెంచడానికి.. కేంద్రం చేస్తున్న అప్పులపై విమర్శలు చేస్తున్నారు. పనిలో పనిగా... తమను బీజేపీ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తోందని.. దానికి కారణం తాము కేబినెట్‌లో చేరకపోవడమేనన్న అభిప్రాయం కూడా కల్పించడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఎన్డీఏలో వైఎస్ఆర్‌సీపీపై చర్చలు నిజంగానే జరిగాయా..?

భారతీయ జనతాపార్టీకి వైసీపీ వ్యూహం అర్థం అయిందేమో కానీ  వ్యూహాత్మకంగా స్పందించింది. అసలు వైసీపీతో పొత్తు .. లేదా కేబినెట్‌లోకి వైసీపీ అనే ప్రస్తావన.. చర్చ అసలు ఎప్పుడూ బీజేపీలో లేదని ఆ పార్టీ ఏపీ వ్యవహారాల సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్ చెబుతున్నారు. విజయసాయిరెడ్డి చెబుతున్న మాటలు శుద్ధ అబద్దమని అంటున్నారు. వైసీపీనే కేంద్రమంత్రి పదవుల కోసం ఆరాటపడిందని కానీ బీజేపీనే దగ్గరకు రానివ్వలేదనితేల్చేస్తున్నారు. ఆయన కూడా ఇంగ్లిష్‌మీడియాతోనే ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు సమయం సందర్భం లేకుండా రెండు పార్టీల నేతలు లేని పొత్తుల గురించి పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరమేంటో ఇతర పార్టీల నేతలకు అర్థం కావడం లేదు. అదే రాజకీయం అంటే... ఎవరికీ అందకుండా వ్యుహారాలతో రాజకీయం చేయడమే నేర్పరితనం. విజయసాయిరెడ్డి, బీజేపీ అదే చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
Raj Tarun Case: రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
TGTET: 'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
Must Have Gadgets: వర్షంలో కచ్చితంగా జేబులో ఉండాల్సిన గ్యాడ్జెట్స్ ఇవే - చిన్నవే కానీ కాపాడతాయి!
వర్షంలో కచ్చితంగా జేబులో ఉండాల్సిన గ్యాడ్జెట్స్ ఇవే - చిన్నవే కానీ కాపాడతాయి!
Embed widget