అన్వేషించండి

YS Viveka Murder Case: కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు, హైదరాబాద్‌ ఆఫీసులో విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ షాకిచ్చింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ షాకిచ్చింది. వైఎస్సార్ సీపీ ఎంపీ అవిష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీస్ లో విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో సోమవారం అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి నివాస పరిసరాలను సీబీఐ అధికారులు పరిశీలించారు. భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి కార్యాలయాల్లో అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. మంగళవారం నాడు ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించడానికిగానూ నోటీసులు ఇచ్చారు. అవినాష్ రెడ్డి తండ్రి ఎప్పుడూ వివేకానంద రెడ్డికి వ్యతిరేకంగానే ఉండేవారని వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరో సోదరుడు వైఎస్ ప్రతాప్ రెడ్డి 2021 ఆగస్టులో సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి హస్తం ఉందని ఆయన కూతురు సునీత సైతం పలుమార్లు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని విచారించేందుకు హైదరాబాద్ ఆఫీసుకు రావాలని నోటీసులలో పేర్కొంది సీబీఐ.

మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్ధు అంశంపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు అంశం తెలంగాణ హైకోర్టుకు కొన్ని నెలల కిందట బదిలీ చేసింది. గంగిరెడ్డి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు. మరోసారి విచారణ జరపాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.  బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరపాలని సూచించింది. కేసు ట్రయల్‌ను తెలంగాణకు బదిలీ చేసినందున బెయిల్ రద్దు అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టులో తేల్చాలని ఆదేశాలు జారీ చేసింది.

విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచన  
నాన్ బెయిలబుల్ నేరానికి పాల్పడిన సందర్భంలో చార్జిషీటు దాఖలు కాలేదన్న కారణంతో కేసులోని మెరిట్స్‌ను పరిగణలోకి తీసుకోకుండా డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం తగదని వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించారు.  కేసులోని మెరిట్స్ ఆధారంగా బెయిల్ అంశంపై మరోసారి విచారణ చేపట్టాలని సూచించింది. డిఫాల్డ్ బెయిల్ రద్దు కాదంటూ ఏపీ హైకోర్టు తీర్పునివ్వడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. డిఫాల్ట్ బెయిల్ పొందిన వ్యక్తి విచారణకు సహకరించని పక్షంలో బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.  అయితే విచారణకు గంగిరెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని.. బెయిల్‌ రద్దు చేయాల్సిన అవసరం లేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

నాలుగేళ్లుగా  సాగుతూనే ఉన్న వివేకా హత్య కేసు 
వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ 4 ఏళ్లుగా కొనసాగుతుంది. మొదట ఏపీ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. తర్వాత సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.  ఈ కేసుకు సంబంధించి గంగిరెడ్డి, ఉమా శెంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, షేక్ దస్తగిరిలను నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారాడు. దీనితో కేసులో మరికొంత మంది ప్రమేయం ఉందొ లేదో తెలుసుకోడానికి దర్యాప్తు చేస్తున్నారు.  

హైదరాబాద్ సీబీఐ కోర్టులోనే విచారణ జరగనున్న వివేకా హత్య కేసు 
వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పటికే తెలంగాణకు బదిలీ అయింది. తండ్రి వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చెయ్యాలంటూ ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలో ఈ కేసు విచారణ సక్రమంగా జరిగే అవకాశం లేదని, గతంలో సాక్షులు, అప్రూవర్‌గా మారిన వారు కూడా అనుమానాస్పద రీతిలో మరణించారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.  హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఈ కేసును బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది.  హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమార్తె ఈ కేసు విచారణ పట్ల బాగా అసంతృప్తితో ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకొని ఈ కేసును కడప కోర్టు నుంచి హైదరాబాద్‌కు బదిలీ చేస్తున్నట్లుగా  సుప్రీంకోర్టు ప్రకటించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Tungabhadra Dam 33 Crest Gates Inauguration: గోదావరి-కృష్ణా-కావేరి అనుసంధానం - తుంగభద్ర కార్యక్రమంలో సీఎంల కీలక ప్రకటనలు
గోదావరి-కృష్ణా-కావేరి అనుసంధానం - తుంగభద్ర కార్యక్రమంలో సీఎంల కీలక ప్రకటనలు

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New IB Chief Mahesh Dixit:దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
T20 World Cup - IND W Win VS BAN W: టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Indian Passport Controversy:SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
Embed widget