అన్వేషించండి

YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్

Andhra News: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మద్యం, ఇసుక పాలసీల పేరుతో దోచుకుంటోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఇదని ధ్వజమెత్తారు.

YS Jagan Sensational Comments: రాష్ట్రంలో ఏ సినిమా బాగుంటే.. ఆ సినిమా పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలన 'దోచుకో.. పంచుకో.. తినుకో' (DPT) అన్న చందంగా మారిందని.. సర్కారు కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోయిందని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 5 నెలల గడిచినా సూపర్ 6 లేదు సూపర్ 7 లేదని ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ కూడా చంద్రబాబు బ్రాండ్లు రిలీజ్ చేశారని.. వాటిని వైసీపీ హయాంలో వచ్చిన బ్రాండ్లంటూ అబద్ధాలు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. 'బూంబూం బీర్, ప్రెసిడెంట్ మెడల్ ఇవన్నీ చంద్రబాబు హయంలో తీసుకొచ్చినవే. రాష్ట్రంలో 20 డిస్టిలరీస్ ఉంటే అందులో 14 డిస్టిలరీస్ లైసెన్సులు బాబు హయాంలో వచ్చినవే. వైసీపీ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. మా హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గించాం. మద్యాన్ని నియంత్రిస్తూనే ప్రభుత్వ ఆదాయం పెంచాం. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో పేకాట క్లబ్స్ పెరిగిపోయాయి.' అని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ప్రజల ఆశలతో చెలగాటం'

సీఎం చంద్రబాబు (CM Chandrbabu) అబద్ధాలకు రెక్కలు కట్టారని.. ఎన్నికలప్పుడు ప్రజల ఆశలతో చెలగాటమాడుతూ తప్పుడు ప్రచారాలు చేశారని జగన్ మండిపడ్డారు. 'అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అమలుకు క్లిష్ట పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఓ వైపు ఉచిత ఇసుక అంటున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయింది. ఇసుక ధరలు చూస్తే దారుణంగా ఉన్నాయి. గతంలో ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది. ఈ 5 నెలల్లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం సున్నా. రూ.10 వేలు ఇస్తామని చెప్పి వాలంటీర్లను మోసం చేశారు. పిల్లలకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. గ్రామస్థాయిలో మద్యం మాఫియా నడుస్తోంది. ఎమ్మార్పీ రేట్ల కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారు.' అంటూ జగన్ ధ్వజమెత్తారు.

అధికార పార్టీ మనుషులకో ఇసుక తీసే కాంట్రాక్టులు కట్టబెట్టారని జగన్ మండిపడ్డారు. టెండర్‌కు 2 రోజులు మాత్రమే సమయం ఇచ్చారని.. అందరూ పండుగ బిజీలో ఉంటే దోచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. వైసీపీ హయంలో పారదర్శకంగా ఇసుక విధానం తెచ్చామని.. దోపిడీకి అవకాశం లేని విధంగా చేశామని చెప్పారు. 

'చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందా?'

సీమెన్స్ ప్రాజెక్టు కోసం చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారని.. షెల్ కంపెనీల ద్వారా రూ.371 కోట్ల నిధులు మళ్లించారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సామ్రాజ్యం ఉంటే గోబెల్స్ ప్రచారం చేసుకుంటారా.? అని ప్రశ్నించారు. 'తనకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. స్కిల్ స్కామ్‌లో ఈడీ ప్రెస్ నోటి రిలీజ్ చేసింది. చంద్రబాబుకు క్లీన్ చిట్ అని ఎక్కడైనా ఉందా.?. నిధులు మళ్లించినందుకే ఈడీ ఆస్తులను అటాచ్ చేసింది.' అని జగన్ పేర్కొన్నారు.

Also Read: Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
Embed widget