అన్వేషించండి

YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్

Andhra News: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మద్యం, ఇసుక పాలసీల పేరుతో దోచుకుంటోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఇదని ధ్వజమెత్తారు.

YS Jagan Sensational Comments: రాష్ట్రంలో ఏ సినిమా బాగుంటే.. ఆ సినిమా పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలన 'దోచుకో.. పంచుకో.. తినుకో' (DPT) అన్న చందంగా మారిందని.. సర్కారు కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోయిందని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 5 నెలల గడిచినా సూపర్ 6 లేదు సూపర్ 7 లేదని ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ కూడా చంద్రబాబు బ్రాండ్లు రిలీజ్ చేశారని.. వాటిని వైసీపీ హయాంలో వచ్చిన బ్రాండ్లంటూ అబద్ధాలు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. 'బూంబూం బీర్, ప్రెసిడెంట్ మెడల్ ఇవన్నీ చంద్రబాబు హయంలో తీసుకొచ్చినవే. రాష్ట్రంలో 20 డిస్టిలరీస్ ఉంటే అందులో 14 డిస్టిలరీస్ లైసెన్సులు బాబు హయాంలో వచ్చినవే. వైసీపీ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. మా హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గించాం. మద్యాన్ని నియంత్రిస్తూనే ప్రభుత్వ ఆదాయం పెంచాం. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో పేకాట క్లబ్స్ పెరిగిపోయాయి.' అని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ప్రజల ఆశలతో చెలగాటం'

సీఎం చంద్రబాబు (CM Chandrbabu) అబద్ధాలకు రెక్కలు కట్టారని.. ఎన్నికలప్పుడు ప్రజల ఆశలతో చెలగాటమాడుతూ తప్పుడు ప్రచారాలు చేశారని జగన్ మండిపడ్డారు. 'అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అమలుకు క్లిష్ట పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఓ వైపు ఉచిత ఇసుక అంటున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయింది. ఇసుక ధరలు చూస్తే దారుణంగా ఉన్నాయి. గతంలో ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది. ఈ 5 నెలల్లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం సున్నా. రూ.10 వేలు ఇస్తామని చెప్పి వాలంటీర్లను మోసం చేశారు. పిల్లలకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. గ్రామస్థాయిలో మద్యం మాఫియా నడుస్తోంది. ఎమ్మార్పీ రేట్ల కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారు.' అంటూ జగన్ ధ్వజమెత్తారు.

అధికార పార్టీ మనుషులకో ఇసుక తీసే కాంట్రాక్టులు కట్టబెట్టారని జగన్ మండిపడ్డారు. టెండర్‌కు 2 రోజులు మాత్రమే సమయం ఇచ్చారని.. అందరూ పండుగ బిజీలో ఉంటే దోచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. వైసీపీ హయంలో పారదర్శకంగా ఇసుక విధానం తెచ్చామని.. దోపిడీకి అవకాశం లేని విధంగా చేశామని చెప్పారు. 

'చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందా?'

సీమెన్స్ ప్రాజెక్టు కోసం చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారని.. షెల్ కంపెనీల ద్వారా రూ.371 కోట్ల నిధులు మళ్లించారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సామ్రాజ్యం ఉంటే గోబెల్స్ ప్రచారం చేసుకుంటారా.? అని ప్రశ్నించారు. 'తనకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. స్కిల్ స్కామ్‌లో ఈడీ ప్రెస్ నోటి రిలీజ్ చేసింది. చంద్రబాబుకు క్లీన్ చిట్ అని ఎక్కడైనా ఉందా.?. నిధులు మళ్లించినందుకే ఈడీ ఆస్తులను అటాచ్ చేసింది.' అని జగన్ పేర్కొన్నారు.

Also Read: Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
SIR Enumeration Uncollectable Votes: తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Embed widget