అన్వేషించండి

Yanamala On Jagan: ఏపీలో అశాంతి కోసం బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా కుట్రలు - జగన్ పై యనమల ఆరోపణలు

Bangalore Palace: బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా జగన్ కుట్రలు చేస్తున్నారని యనమల ఆరోపించారు. ఒక ‘బ్యాక్ ఆఫీస్’ను ఏర్పాటు చేసుకుని కుట్రల అమలు చేస్తున్నారని ఆరోపించారు.

Yanamala accuses Jagan conspiring from Bangalore Palace:   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్‌లో మకాం వేయడంపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో కుట్రలను అమలు చేసేందుకు జగన్ బెంగళూరులో ఒక బ్యాక్ ఆఫీస్ ను ఏర్పాటు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. బెంగళూరు అనేది జగన్ జన్మస్థలం కాదు, కనీసం ఆయన నియోజకవర్గం కూడా కాదని.. పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న హైదరాబాద్‌ను వదిలి యలహంక ప్యాలెస్‌లోనే ఎందుకు ఉంటున్నారని యనమల ప్రశ్నించారు. త న అవినీతి సంపదను దాచుకోవడానికి, చీకటి ఒప్పందాలకు ఆ ప్యాలెస్‌ను కేంద్రంగా మార్చుకున్నారని ఆయన విమర్శించారు.         

బెంగళూరు కేంద్రంగా ఏపీలో అశాంతి రేేపేందుకు జగన్ కుట్రలు                              

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా జగన్ బెంగళూరు కేంద్రంగానే అనేక కుట్రలకు తెరలేపారని యనమల ఆరోపించారు. నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన అవినీతి కార్యకలాపాల వల్లే జగన్ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయని పేర్కొన్నారు. జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్ వంటి సంస్థలు జగన్ అవినీతి పుత్రికలేనని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, బడుగు బలహీన వర్గాలను అణగదొక్కుతూ జగన్ తన ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని మండిపడ్డారు.                          

వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్ లో చేరుతున్న వైసీపీ నేతలు                     

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తాజాగా విడుదల చేసిన నివేదికను యనమల ఈ సందర్భంగా ప్రస్తావించారు. గత ఐదేళ్ల కాలంలో జగన్ సహా పలువురు వైసీపీ కీలక నేతల ఆస్తులు ఏకంగా 600 శాతం మేర పెరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆయన అన్నారు. కేవలం అవినీతి మార్గంలో సంపాదించడం వల్లే ఇంతటి భారీ వృద్ధి సాధ్యమైందని, వైసీపీ నేతలు సామాన్య  నియో రిచ్ క్లబ్ నుంచి ఇప్పుడు ఏకంగా  వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్ 'లో చేరుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును దోచుకుని తమ వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగిందని విమర్శించారు.                

జగన్ బెంగళూరు మకాం వెనుక అసలు రహస్యాలు బయటపడాలి !                    

ప్రస్తుతం ఏపీలో అశాంతి సృష్టించేందుకు, కుట్రలు పన్నేందుకే జగన్ బెంగళూరును వేదికగా చేసుకున్నారని యనమల స్పష్టం చేశారు. ఐదేళ్ల కాలంలో పోగేసిన అవినీతి సంపదను రక్షించుకోవడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి ఆయన పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు. జగన్ వ్యవహారశైలిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఆయన బెంగళూరు మకాం వెనుక ఉన్న అసలు రహస్యాలను ప్రజలు గమనిస్తున్నారని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. 

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Seediri Appalaraju Arrest: మెడకు చుట్టుకున్న కుమారుడి హిట్ అండ్ రన్ కేసు - మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
మెడకు చుట్టుకున్న కుమారుడి హిట్ అండ్ రన్ కేసు - మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Embed widget