అన్వేషించండి

Yanamala On Jagan: ఏపీలో అశాంతి కోసం బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా కుట్రలు - జగన్ పై యనమల ఆరోపణలు

Bangalore Palace: బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా జగన్ కుట్రలు చేస్తున్నారని యనమల ఆరోపించారు. ఒక ‘బ్యాక్ ఆఫీస్’ను ఏర్పాటు చేసుకుని కుట్రల అమలు చేస్తున్నారని ఆరోపించారు.

Yanamala accuses Jagan conspiring from Bangalore Palace:   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్‌లో మకాం వేయడంపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో కుట్రలను అమలు చేసేందుకు జగన్ బెంగళూరులో ఒక బ్యాక్ ఆఫీస్ ను ఏర్పాటు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. బెంగళూరు అనేది జగన్ జన్మస్థలం కాదు, కనీసం ఆయన నియోజకవర్గం కూడా కాదని.. పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న హైదరాబాద్‌ను వదిలి యలహంక ప్యాలెస్‌లోనే ఎందుకు ఉంటున్నారని యనమల ప్రశ్నించారు. త న అవినీతి సంపదను దాచుకోవడానికి, చీకటి ఒప్పందాలకు ఆ ప్యాలెస్‌ను కేంద్రంగా మార్చుకున్నారని ఆయన విమర్శించారు.         

బెంగళూరు కేంద్రంగా ఏపీలో అశాంతి రేేపేందుకు జగన్ కుట్రలు                              

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా జగన్ బెంగళూరు కేంద్రంగానే అనేక కుట్రలకు తెరలేపారని యనమల ఆరోపించారు. నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన అవినీతి కార్యకలాపాల వల్లే జగన్ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయని పేర్కొన్నారు. జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్ వంటి సంస్థలు జగన్ అవినీతి పుత్రికలేనని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, బడుగు బలహీన వర్గాలను అణగదొక్కుతూ జగన్ తన ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని మండిపడ్డారు.                          

వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్ లో చేరుతున్న వైసీపీ నేతలు                     

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తాజాగా విడుదల చేసిన నివేదికను యనమల ఈ సందర్భంగా ప్రస్తావించారు. గత ఐదేళ్ల కాలంలో జగన్ సహా పలువురు వైసీపీ కీలక నేతల ఆస్తులు ఏకంగా 600 శాతం మేర పెరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆయన అన్నారు. కేవలం అవినీతి మార్గంలో సంపాదించడం వల్లే ఇంతటి భారీ వృద్ధి సాధ్యమైందని, వైసీపీ నేతలు సామాన్య  నియో రిచ్ క్లబ్ నుంచి ఇప్పుడు ఏకంగా  వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్ 'లో చేరుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును దోచుకుని తమ వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగిందని విమర్శించారు.                

జగన్ బెంగళూరు మకాం వెనుక అసలు రహస్యాలు బయటపడాలి !                    

ప్రస్తుతం ఏపీలో అశాంతి సృష్టించేందుకు, కుట్రలు పన్నేందుకే జగన్ బెంగళూరును వేదికగా చేసుకున్నారని యనమల స్పష్టం చేశారు. ఐదేళ్ల కాలంలో పోగేసిన అవినీతి సంపదను రక్షించుకోవడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి ఆయన పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు. జగన్ వ్యవహారశైలిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఆయన బెంగళూరు మకాం వెనుక ఉన్న అసలు రహస్యాలను ప్రజలు గమనిస్తున్నారని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kavitha Politics: ఈసారి పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రకు పార్సిల్ చేస్తాం: కవిత వార్నింగ్
ఈసారి పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రకు పార్సిల్ చేస్తాం: కవిత వార్నింగ్
Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
Breaking News: ఇరాన్‌ అధ్యక్షుడు పెజష్కియాన్‌ రాజీనామా చేశారా ?
ఇరాన్‌ అధ్యక్షుడు పెజష్కియాన్‌ రాజీనామా చేశారా ?
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget