అన్వేషించండి

Operation Lotus on YSRCP : వైఎస్ఆర్‌సీపీపై ఆపరేషన్ లోటస్ ప్రారంభమైందా ? ఎంపీలు జంపింగ్ లిస్టులో ఉన్నారా ?

Andhra Politics : వైఎస్ఆర్‌సీపీపై బీజేపీ ఆపరేషన్ లోటస్ ప్రారంభించిందని జాతీయ రాజకీయాల్లో చర్చ ప్రారంభమయింది. చిదంబరం కమారుడు కార్తీ ఈ అంశంపై హింట్ ఇచ్చారు.

Operation Lotus On YSRCP :  ఆపరేషన్ లోటస్ ఈ మాట బీజేపీ రాజకీయాల్లో కీలకం. ఇతర పార్టీల నేతల్ని చేర్చుకునేందుకు ఈ ఆపరేషన్ నిర్వహిస్తారని ఎక్కువ మంది నమ్ముతూ ఉంటారు. అయితే బీజేపీ మాత్రం ఇలాంటి ఆపరేషన్లు ఏమీ చేయలేదని.. భవిష్యత్ లో ఎప్పుడూ చేయబోమని అంటున్నారు. కానీ విపక్ష నేతలు మాత్రం..  బీజేపీ ఆపరేషన్ లోటస్ లు ప్రారంభించిందని ప్రకటిస్తున్నారు. తాజాగా తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేత, చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం వైసీపీపై తర్వాత ఆపరేషన్ లోటస్ జరగబోతోందని సోషల్ మీడియాలో ప్రకటించారు. 

 

 

కార్తీ చిదంబరంకు   ఏదో సమాచారం లేకపోతే … ఏపీ రాజకీయాలు.. అదీ వైసీపీ గురించి ట్వీట్ పెట్టాల్సిన అవసరం లేదు. అయితే అదేమిటి  అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. వైఎస్ఆర్‌సీపీకి నలుగురు లోక్ సభ సభ్యులు ఉన్నారు. పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సమీప భవిష్యత్ లో ఆ పార్టీకి ఒక ఎమ్మెల్సీ లేదా ఓ రాజ్యసభ ఎంపీ సీటు వచ్చే అవకాశాలు లేవు. బీజేపీకి రాజ్యసభ సభ్యుల అవసరం ఉంది. టీడీపీ రాజ్యసభ సభ్యుల్ని గతంలో విలీనం చేసుకున్నట్లుగా ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుల్ని విలీనం చేసుకునే ప్రక్రియ ఏమైనా ప్రారంభించారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.                         

బీజేపీకి రాజ్యసభలో పూర్తి స్థాయిలో మెజార్టీ లేదు. ఇంత కాలం వైఎస్ఆర్‌సీపీతో పాటు బీజేడీ ఏకపక్షంగా మద్దతు ఇస్తూ వచ్చాయి. అయితే ఇప్పుుడు కూడా వైసీపీ మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది. వ్యతిరేకిస్తామని చెప్పే అవకాశం ఉందు.  వైసీపీలో వ్యాపార ప్రముఖులు ఎక్కవగా ఉన్నారు.  గుజరాత్ కు చెందిన పరిమళ్ నత్వానీ కూడా వైసీపీ ఎంపీనే. ఆయన బీజేపీలో చేరడానికి పెద్దగా ఆపరేషన్ చేపట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణకు చెందిన కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు కూడా వైసీపీ ఎంపీలే. అలాగే ఏపీ నుంచి  ఎంపీలుగా బీద మస్తాన్ రావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ,  విజయసాయిరెడ్డి  వంటి వారికి అనే అబ్లిగేషన్లు ఉన్నాయి. వీరిలో ఎవరినైనా బీజేపీ ఆహ్వానిస్తే .. తిరస్కరించే అవకాశం ఉండదన్న వాదన ఉంది.                                           

గెలిచిన  నలుగురు లోక్‌సభ ఎంపీలపైనా బీజేపీ కన్నేసే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ తరపున గెలిచిన వారిలో అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనూరాజా రాణి  విజయం సాధించారు. వీరిలో ఒకరిద్దరు బీజేపీతో చర్చలు జరుపుతున్నారన్న  ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికలు జరిగి రోజులు కూడా గడవనందున.. ఒకటి, రెండు నెలల తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చన్న వాదన వినిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Tragedy in Polavaram: గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
Breaking News:
"మొన్నటి ఎన్నికల్లో చెత్తను క్లీన్ చేశారు" కొడాలి నానిపై చంద్రబాబు సెటైర్లు 
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Anna Lezhneva Visits Thirumala: శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
Embed widget