అన్వేషించండి

Thota Trimurtulu Case : అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?

Andhra News : ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి సారి తోట త్రిమూర్తులు పై కేసు నమోదయింది. బీఎస్పీ పోలింగ్ ఏజెంట్లను ఎన్నికలు అయిపోయిన తర్వాత శిరోముండనం చేయించారని నిరూపణ అయింది.

Thota Trimurtulu Case :  వైసీపీ మండపేట అభ్యర్థి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధించడం సంచలనంగా మారింది. అసలు కేసు ఏంటి ? ఆ తర్వాత ఏం జరిగింది ? ఆ వివరాలు ఇవీ.. 

అసలేం జరిగిందంటే ? 

1982 ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరిన తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. కానీ అది నెరవేరకపోవటంతో 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. గంట గుర్తుపై పోటీ చేసిన తోట త్రిమూర్తులకు టీడీపీ, బీఎస్పీ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే ఇదే టైమ్ లో తోట త్రిమూర్తులు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారు అంటూ ఓ ఐదుగురు బీఎస్పీ బూత్ ఏజెంట్ కుర్రాళ్లు గొడవకు దిగారు. ఆ గొడవ బాగా పెద్దగా జరిగింది. తర్వాత అంతా సైలెంట్ అయిపోయారు. తోట త్రిమూర్తులు  మూడువేల ఓట్ల మెజార్టీతో అనూహ్యంగా ఆ ఎన్నిక గెలిచి ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయ్యారు. కానీ అప్పటి నుంచి తనను అవమానించిన ఆ కుర్రాళ్లపై కక్షసాధింపులు మొదలుపెట్టారని స్థానికులు చెబుతూ ఉంటారు.

1996 డిసెంబర్ 29న దళిత యువకులకు శిరోముండనం

1996 డిసెంబర్ 29న రామచంద్రాపురం మండలంలోని వెంకటాయపాలెంలో ఐదుగురు దళితయువకులను ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మనుషులు పట్టుకున్నారు. పొలం చుట్టూ ఫెన్సింగ్ ధ్వంసం, ఈవ్ టీజింగ్ కారణాలు చెప్పి ఆ ఐదుగురు కుర్రాళ్లను ఊళ్లో అవమానిస్తూ ఊరేగించారు. అంతటితో ఆగకుండా అందులో ఇద్దరు కుర్రాళ్లకు గుండు కొట్టించి కనుబొమ్మలు గీయించారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చేయించిన ఈ పని అప్పట్లో సంచలనంగా మారిపోయింది. ఆ బాధితులైన కుర్రాళ్లు పోలీసులను ఆశ్రయించారు. 1997 జనవరి 1న ద్రాక్షారామం పోలీస్ స్టేషన్ లో మొదటికేసుగా దళితుల శిరోముండనం కేసు నమోదైంది. 

మూడు నెలల పాటు జైల్లో ఉన్న తోట త్రిమూర్తులు

అప్పట్లో త్రిమూర్తులు మూడునెలల పాటు జైల్లో ఉన్నారు. కానీ తర్వాత కేసును పక్కన పెట్టేశారు.  బాధితులు మాత్రం పోరాటం చేస్తూనే ఉన్నారు. శిరోముండనం జరిగిన ఇద్దరు బాధితుల్లో ఓ వ్యక్తి మృతి చెందారు. మిగిలిన నలుగురు పోరాటం కొనసాగించారు. కేసుకు సంబంధించిన 24మంది సాక్ష్యుల్లో 11మంది వేర్వేరు కారణాలతో చనిపోయారు. అయినా ఈ పోరాటం ఆగలేదు. హైకోర్టుకు వెళ్లారు బాధితులు. హైకోర్టును జిల్లా కలెక్టర్ ను, విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించి ఆరునెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. 

వారు దళితులు కాదని వాదిస్తూ వచ్చిన తోట త్రిమూర్తులు

ఈ లోగా తోట త్రిమూర్తులు అసలు ఆ యువకులు ఇద్దరూ దళితులు కాదని..వాళ్లలో ఒకరి అమ్మ మృతి చెందినప్పుడు ఆ సమాధిపై శిలువ గుర్తు వేయించారని..క్రైస్తవంలోకి మారిన కారణంగా బీసీ కిందకు వస్తారని ఈ కేసు ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ తగదని తోట త్రిమూర్తులు వాదిస్తూ వచ్చారు. ఊళ్లో పంచాయతీ పెద్దలు చేయించిన పనిని తన మీద రుద్దటానికి చూస్తున్నారని చెబుతూ వచ్చేవారు. కానీ ఆ యువకులు క్రైస్తవులు అని సాక్ష్యాలు చెప్పేలా అధికారులను తోట త్రిమూర్తులు ప్రభావితం చేశారన్న బాధితుల వాదనతో ఏకీభవించిన విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తోట త్రిమూర్తులకు 18నెలల జైలుశిక్ష..2లక్షల రూపాయల జరిమానా విధిస్తూ ఎనిమిదోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో దిగుతున్న తోట త్రిమూర్తులకు షాక్ ఇచ్చింది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget