అన్వేషించండి

YSRCP: వైసీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు, ఎవరెవరంటే?

YSRCP: వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి, సుధాకర్, రవీంద్ర రెడ్డిలకు అవకాశం ఇచ్చింది

YSRCP: వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కాబోతున్న మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సే స్థానాలకకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయా ప్రాంతాల వైసీపీ ఎమ్మెల్యేలలతో ప్రత్యేకంగా చర్చించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి ఎన్నికలకు ఏడు, ఎనిమిది నెలల ముందు అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఇందుకోసం సోమవారం సచివాలయంలో ఓ సమావేశాన్ని కూడా నిర్వహించారు. 

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు..

 గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రులు, ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులకు ఇవ్వడమో, ఎన్నికల నుంచి దూరండా ఉండటమో చేశామని.. ఇకపై ఆ ఎన్నికల్లో పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఎమ్మెల్యేలతో సీఎం జగన్ చర్చించారు. ఈ సమావేశంలోనే అబ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. విశాఖ-శ్రీకాకుళం-విజయనగరానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్. అనంతపురం-కడప-కర్నూలుకు వెన్నపూస రవీంద్రరెడ్డి (ఈయన అదే స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెన్నపూస గోపాల్ రెడ్డి కుమారుడు), చిత్తూరు-ప్రకాశం-నెల్లూరు జిల్లాల నియోజకవర్గానికి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిల పేర్లను ఖరారు చేశారు. 

కార్యాచరణ సిద్ధం, ఎమ్మెల్యేలకు బాధ్యత!

ఈ ఎన్నికలకు సంబంధించి పార్టీ పరంగా ఎలా వ్యవహరించాలి అన్న దానిపై ఒక కార్యాచరణను సిద్ధం చేసే బాధ్యతను నలుగురు ఎమ్మెల్యేలకు అప్పగించినట్లు తెలుస్తోంది. అనంతపురం-కడప-కర్నూలు ఉపాధ్యాయ నియోజక వర్గానికి పోటీ చేసే అంశంపైనా చర్చించారు. అక్కడ ఓటర్లను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని, అభ్యర్థిని తర్వాత ప్రకటిద్దామని సమావేశంలో నిర్ణయించారు. 

గడప గడపకూ ప్రభత్వ కార్యక్రమంపై సీఎం వ్యాఖ్యలు..

అలాగే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్క్ షాప్ నిర్వహహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనడం సహా జరుగుతున్న తీరుపై పార్టీ చేయించిన సర్వే నివేదికలను సీఎం వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేల వారీగా పని తీరును తెలియజేశారు. ఇప్పటి వరకు మాజీ మంత్రి ఆళ్లనాని, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు కేవలం 10 రోజులు మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహించడం కొందరు తూతూ మంత్రంగా గ్రామాల్లో పర్యటించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని లేని పక్షంలో గ్రాఫ్ మెరుగుపరుచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. 

నిధుల లేమి వల్ల రోడ్లు, డ్రైనేజీలు సహా పలు సమస్యలు పరిష్కరించుకోలేక పోతున్నామని మంత్రులు సీఎంకు చెప్పారు. స్పందించిన సీఎం.. అభివృద్ధి కొరకు ప్రతీ ఎమ్మెల్యేకు 2 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రతీ సచివాలయానికి 20 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తామన్నారు. వీటితో సమస్యలన్నింటిని పరిష్కరించాలని సీఎం జగన్ ఆదేశించారు. వీటికి సంబంధించి ఉత్తర్వలను వెంటనే విడదల చేసినట్లు తెలిపారు. గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో నాణ్యత చాలా ముఖ్యమని సూచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
Embed widget