అన్వేషించండి

YSRCP: వైసీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు, ఎవరెవరంటే?

YSRCP: వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి, సుధాకర్, రవీంద్ర రెడ్డిలకు అవకాశం ఇచ్చింది

YSRCP: వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కాబోతున్న మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సే స్థానాలకకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయా ప్రాంతాల వైసీపీ ఎమ్మెల్యేలలతో ప్రత్యేకంగా చర్చించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి ఎన్నికలకు ఏడు, ఎనిమిది నెలల ముందు అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఇందుకోసం సోమవారం సచివాలయంలో ఓ సమావేశాన్ని కూడా నిర్వహించారు. 

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు..

 గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రులు, ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులకు ఇవ్వడమో, ఎన్నికల నుంచి దూరండా ఉండటమో చేశామని.. ఇకపై ఆ ఎన్నికల్లో పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఎమ్మెల్యేలతో సీఎం జగన్ చర్చించారు. ఈ సమావేశంలోనే అబ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. విశాఖ-శ్రీకాకుళం-విజయనగరానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్. అనంతపురం-కడప-కర్నూలుకు వెన్నపూస రవీంద్రరెడ్డి (ఈయన అదే స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెన్నపూస గోపాల్ రెడ్డి కుమారుడు), చిత్తూరు-ప్రకాశం-నెల్లూరు జిల్లాల నియోజకవర్గానికి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిల పేర్లను ఖరారు చేశారు. 

కార్యాచరణ సిద్ధం, ఎమ్మెల్యేలకు బాధ్యత!

ఈ ఎన్నికలకు సంబంధించి పార్టీ పరంగా ఎలా వ్యవహరించాలి అన్న దానిపై ఒక కార్యాచరణను సిద్ధం చేసే బాధ్యతను నలుగురు ఎమ్మెల్యేలకు అప్పగించినట్లు తెలుస్తోంది. అనంతపురం-కడప-కర్నూలు ఉపాధ్యాయ నియోజక వర్గానికి పోటీ చేసే అంశంపైనా చర్చించారు. అక్కడ ఓటర్లను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని, అభ్యర్థిని తర్వాత ప్రకటిద్దామని సమావేశంలో నిర్ణయించారు. 

గడప గడపకూ ప్రభత్వ కార్యక్రమంపై సీఎం వ్యాఖ్యలు..

అలాగే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్క్ షాప్ నిర్వహహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనడం సహా జరుగుతున్న తీరుపై పార్టీ చేయించిన సర్వే నివేదికలను సీఎం వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేల వారీగా పని తీరును తెలియజేశారు. ఇప్పటి వరకు మాజీ మంత్రి ఆళ్లనాని, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు కేవలం 10 రోజులు మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహించడం కొందరు తూతూ మంత్రంగా గ్రామాల్లో పర్యటించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని లేని పక్షంలో గ్రాఫ్ మెరుగుపరుచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. 

నిధుల లేమి వల్ల రోడ్లు, డ్రైనేజీలు సహా పలు సమస్యలు పరిష్కరించుకోలేక పోతున్నామని మంత్రులు సీఎంకు చెప్పారు. స్పందించిన సీఎం.. అభివృద్ధి కొరకు ప్రతీ ఎమ్మెల్యేకు 2 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రతీ సచివాలయానికి 20 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తామన్నారు. వీటితో సమస్యలన్నింటిని పరిష్కరించాలని సీఎం జగన్ ఆదేశించారు. వీటికి సంబంధించి ఉత్తర్వలను వెంటనే విడదల చేసినట్లు తెలిపారు. గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో నాణ్యత చాలా ముఖ్యమని సూచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Embed widget