అన్వేషించండి

YS Jagan News: సింహాచలం దుర్ఘటన బాధితులకు రూ.కోటి ఇవ్వాలి- లేకుంటే మేం ఆదుకుంటాం: జగన్

Simhachalam Incident:సింహాచలంలో జరిగిన దుర్ఘటన పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు వైఎస్ జగన్. బాధితులకు ఇచ్చే పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. లేకుంటే తాము వచ్చి ఆదుకుంటామన్నారు.

Simhachalam Incident: సింహాచలంలో గోడ కూలిన ఘటన బాధితులను వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏడాదిలోనే ఇన్ని దారుణాలు చూస్తామని అనుకోలేదన్నారు. నాడు తిరుమలల వైకుంఠ ఏకాదశి నాడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆరుగురి చావుకు కారణమయ్యారని ఇప్పుడు సింహాచలంలో కూడా అదే రిపీట్ అయ్యిందని మండిపడ్డారు.

ప్రజలు, భక్తులు అంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చందనోత్సవం జరుగుతుంది... భక్తులు భారీగా తరలివస్తారని ప్రభుత్వానికి ముందుగా తెలియదా అని ప్రశ్నించారు. లక్షల్లో భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏడుగురు భక్తుల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. ఆలయంలో కనీస సౌకర్యాలు కల్పనలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.  

రెండు రోజుల ముందు గోడ నిర్మించడం ఏంటీ?

చందనోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారో ముందుగానే తెలిసినా చివరి నిమిషంలో గోడ కట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు జగన్. రెండుల కిందట పది అడుగుల ఎత్తు, డబ్బై అడుగుల పొడవు ఉన్నగోడని ఎలా నిర్మించారని నిలదీశారు. ఈ గోడ కట్టేందుకు కనీసం టెండర్లు కూడా పిలవలేదని మండిపడ్డారు. అదైనా ముందే కట్టి ఉంటే ఇంతటి విపత్తు జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. చేసిన పనులు కూడా నాణ్యత చేయలేదని వర్షానికే గోడ కూలిపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  

చంద్రబాబు తప్పిదమే ఇదంతా : జగన్ 

ఇంతటి ఘోరం జరిగిన వెంటనే తప్పును తమపై నెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయని జగన్ అన్నారు. కాని వాళ్ల హయాంలోనే పనులు కేటాయించినట్టు తెలిసి సైలెంట్ అయిపోయారని అన్నారు. చంద్రబాబు తన రాజకీయాల కోసం దేనికైనా సిద్ధపడతారని మండిపడ్డారు. నాడు పుష్కరాల నుంచి నేటి చందనోత్సవం వరకు జరిగిన దుర్ఘటనల్లో ప్రధాన ముద్దాయి చంద్రబాబే అన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా ఇవ్వాలని కానీ ఈ ప్రభుత్వం ప్రాణాలు తీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బాధితులకు ఇచ్చే పరిహారం పెంచాలి: జగన్ 

ఇప్పుడు జరిగిన దుర్ఘటనలో కూడా తాను వస్తున్నానని చెప్పిన తర్వాత పాతిక లక్షల పరిహారం ప్రకటించారని జగన్ ఆరోపించారు. ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం కారణంగా జరిగిన దుర్ఘటన కాబట్టి పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో ఇలాంటివి జరిగితే మానతాదృక్పథంతో పరిహారం సక్రమంగా అందజేశామన్నారు జగన్. ఇప్పుడు కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సింహాచల చందనోత్స దుర్ఘటనలో బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటే రిపీట్ కాకుండా ఉంటాయని జగన్ సూచించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget