అన్వేషించండి

YS Jagan News: సింహాచలం దుర్ఘటన బాధితులకు రూ.కోటి ఇవ్వాలి- లేకుంటే మేం ఆదుకుంటాం: జగన్

Simhachalam Incident:సింహాచలంలో జరిగిన దుర్ఘటన పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు వైఎస్ జగన్. బాధితులకు ఇచ్చే పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. లేకుంటే తాము వచ్చి ఆదుకుంటామన్నారు.

Simhachalam Incident: సింహాచలంలో గోడ కూలిన ఘటన బాధితులను వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏడాదిలోనే ఇన్ని దారుణాలు చూస్తామని అనుకోలేదన్నారు. నాడు తిరుమలల వైకుంఠ ఏకాదశి నాడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆరుగురి చావుకు కారణమయ్యారని ఇప్పుడు సింహాచలంలో కూడా అదే రిపీట్ అయ్యిందని మండిపడ్డారు.

ప్రజలు, భక్తులు అంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చందనోత్సవం జరుగుతుంది... భక్తులు భారీగా తరలివస్తారని ప్రభుత్వానికి ముందుగా తెలియదా అని ప్రశ్నించారు. లక్షల్లో భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏడుగురు భక్తుల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. ఆలయంలో కనీస సౌకర్యాలు కల్పనలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.  

రెండు రోజుల ముందు గోడ నిర్మించడం ఏంటీ?

చందనోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారో ముందుగానే తెలిసినా చివరి నిమిషంలో గోడ కట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు జగన్. రెండుల కిందట పది అడుగుల ఎత్తు, డబ్బై అడుగుల పొడవు ఉన్నగోడని ఎలా నిర్మించారని నిలదీశారు. ఈ గోడ కట్టేందుకు కనీసం టెండర్లు కూడా పిలవలేదని మండిపడ్డారు. అదైనా ముందే కట్టి ఉంటే ఇంతటి విపత్తు జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. చేసిన పనులు కూడా నాణ్యత చేయలేదని వర్షానికే గోడ కూలిపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  

చంద్రబాబు తప్పిదమే ఇదంతా : జగన్ 

ఇంతటి ఘోరం జరిగిన వెంటనే తప్పును తమపై నెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయని జగన్ అన్నారు. కాని వాళ్ల హయాంలోనే పనులు కేటాయించినట్టు తెలిసి సైలెంట్ అయిపోయారని అన్నారు. చంద్రబాబు తన రాజకీయాల కోసం దేనికైనా సిద్ధపడతారని మండిపడ్డారు. నాడు పుష్కరాల నుంచి నేటి చందనోత్సవం వరకు జరిగిన దుర్ఘటనల్లో ప్రధాన ముద్దాయి చంద్రబాబే అన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా ఇవ్వాలని కానీ ఈ ప్రభుత్వం ప్రాణాలు తీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బాధితులకు ఇచ్చే పరిహారం పెంచాలి: జగన్ 

ఇప్పుడు జరిగిన దుర్ఘటనలో కూడా తాను వస్తున్నానని చెప్పిన తర్వాత పాతిక లక్షల పరిహారం ప్రకటించారని జగన్ ఆరోపించారు. ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం కారణంగా జరిగిన దుర్ఘటన కాబట్టి పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో ఇలాంటివి జరిగితే మానతాదృక్పథంతో పరిహారం సక్రమంగా అందజేశామన్నారు జగన్. ఇప్పుడు కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సింహాచల చందనోత్స దుర్ఘటనలో బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటే రిపీట్ కాకుండా ఉంటాయని జగన్ సూచించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget