అన్వేషించండి

YS Jagan News: సింహాచలం దుర్ఘటన బాధితులకు రూ.కోటి ఇవ్వాలి- లేకుంటే మేం ఆదుకుంటాం: జగన్

Simhachalam Incident:సింహాచలంలో జరిగిన దుర్ఘటన పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు వైఎస్ జగన్. బాధితులకు ఇచ్చే పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. లేకుంటే తాము వచ్చి ఆదుకుంటామన్నారు.

Simhachalam Incident: సింహాచలంలో గోడ కూలిన ఘటన బాధితులను వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏడాదిలోనే ఇన్ని దారుణాలు చూస్తామని అనుకోలేదన్నారు. నాడు తిరుమలల వైకుంఠ ఏకాదశి నాడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆరుగురి చావుకు కారణమయ్యారని ఇప్పుడు సింహాచలంలో కూడా అదే రిపీట్ అయ్యిందని మండిపడ్డారు.

ప్రజలు, భక్తులు అంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చందనోత్సవం జరుగుతుంది... భక్తులు భారీగా తరలివస్తారని ప్రభుత్వానికి ముందుగా తెలియదా అని ప్రశ్నించారు. లక్షల్లో భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏడుగురు భక్తుల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. ఆలయంలో కనీస సౌకర్యాలు కల్పనలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.  

రెండు రోజుల ముందు గోడ నిర్మించడం ఏంటీ?

చందనోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారో ముందుగానే తెలిసినా చివరి నిమిషంలో గోడ కట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు జగన్. రెండుల కిందట పది అడుగుల ఎత్తు, డబ్బై అడుగుల పొడవు ఉన్నగోడని ఎలా నిర్మించారని నిలదీశారు. ఈ గోడ కట్టేందుకు కనీసం టెండర్లు కూడా పిలవలేదని మండిపడ్డారు. అదైనా ముందే కట్టి ఉంటే ఇంతటి విపత్తు జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. చేసిన పనులు కూడా నాణ్యత చేయలేదని వర్షానికే గోడ కూలిపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  

చంద్రబాబు తప్పిదమే ఇదంతా : జగన్ 

ఇంతటి ఘోరం జరిగిన వెంటనే తప్పును తమపై నెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయని జగన్ అన్నారు. కాని వాళ్ల హయాంలోనే పనులు కేటాయించినట్టు తెలిసి సైలెంట్ అయిపోయారని అన్నారు. చంద్రబాబు తన రాజకీయాల కోసం దేనికైనా సిద్ధపడతారని మండిపడ్డారు. నాడు పుష్కరాల నుంచి నేటి చందనోత్సవం వరకు జరిగిన దుర్ఘటనల్లో ప్రధాన ముద్దాయి చంద్రబాబే అన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా ఇవ్వాలని కానీ ఈ ప్రభుత్వం ప్రాణాలు తీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బాధితులకు ఇచ్చే పరిహారం పెంచాలి: జగన్ 

ఇప్పుడు జరిగిన దుర్ఘటనలో కూడా తాను వస్తున్నానని చెప్పిన తర్వాత పాతిక లక్షల పరిహారం ప్రకటించారని జగన్ ఆరోపించారు. ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం కారణంగా జరిగిన దుర్ఘటన కాబట్టి పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో ఇలాంటివి జరిగితే మానతాదృక్పథంతో పరిహారం సక్రమంగా అందజేశామన్నారు జగన్. ఇప్పుడు కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సింహాచల చందనోత్స దుర్ఘటనలో బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటే రిపీట్ కాకుండా ఉంటాయని జగన్ సూచించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
Instagram Love Tragedy: ఇన్‌స్టా లవ్ విషాదాంతం.. భర్తను వదిలి ప్రియుడితో పెళ్లి! కాలువలో దూకి ఇద్దరూ ఆత్మహత్య
ఇన్‌స్టా లవ్ విషాదాంతం.. భర్తను వదిలి ప్రియుడితో పెళ్లి! కాలువలో దూకి ఇద్దరూ ఆత్మహత్య

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RCB VS SRH Highlights: ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో అనికేత్ వర్మ మెరుపులు.. RCBకి SRH బిగ్ టార్గెట్
ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో అనికేత్ వర్మ మెరుపులు.. RCBకి SRH బిగ్ టార్గెట్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Embed widget