అన్వేషించండి

YS Jagan News: సింహాచలం దుర్ఘటన బాధితులకు రూ.కోటి ఇవ్వాలి- లేకుంటే మేం ఆదుకుంటాం: జగన్

Simhachalam Incident:సింహాచలంలో జరిగిన దుర్ఘటన పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు వైఎస్ జగన్. బాధితులకు ఇచ్చే పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. లేకుంటే తాము వచ్చి ఆదుకుంటామన్నారు.

Simhachalam Incident: సింహాచలంలో గోడ కూలిన ఘటన బాధితులను వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏడాదిలోనే ఇన్ని దారుణాలు చూస్తామని అనుకోలేదన్నారు. నాడు తిరుమలల వైకుంఠ ఏకాదశి నాడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆరుగురి చావుకు కారణమయ్యారని ఇప్పుడు సింహాచలంలో కూడా అదే రిపీట్ అయ్యిందని మండిపడ్డారు.

ప్రజలు, భక్తులు అంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చందనోత్సవం జరుగుతుంది... భక్తులు భారీగా తరలివస్తారని ప్రభుత్వానికి ముందుగా తెలియదా అని ప్రశ్నించారు. లక్షల్లో భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏడుగురు భక్తుల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. ఆలయంలో కనీస సౌకర్యాలు కల్పనలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.  

రెండు రోజుల ముందు గోడ నిర్మించడం ఏంటీ?

చందనోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారో ముందుగానే తెలిసినా చివరి నిమిషంలో గోడ కట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు జగన్. రెండుల కిందట పది అడుగుల ఎత్తు, డబ్బై అడుగుల పొడవు ఉన్నగోడని ఎలా నిర్మించారని నిలదీశారు. ఈ గోడ కట్టేందుకు కనీసం టెండర్లు కూడా పిలవలేదని మండిపడ్డారు. అదైనా ముందే కట్టి ఉంటే ఇంతటి విపత్తు జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. చేసిన పనులు కూడా నాణ్యత చేయలేదని వర్షానికే గోడ కూలిపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  

చంద్రబాబు తప్పిదమే ఇదంతా : జగన్ 

ఇంతటి ఘోరం జరిగిన వెంటనే తప్పును తమపై నెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయని జగన్ అన్నారు. కాని వాళ్ల హయాంలోనే పనులు కేటాయించినట్టు తెలిసి సైలెంట్ అయిపోయారని అన్నారు. చంద్రబాబు తన రాజకీయాల కోసం దేనికైనా సిద్ధపడతారని మండిపడ్డారు. నాడు పుష్కరాల నుంచి నేటి చందనోత్సవం వరకు జరిగిన దుర్ఘటనల్లో ప్రధాన ముద్దాయి చంద్రబాబే అన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా ఇవ్వాలని కానీ ఈ ప్రభుత్వం ప్రాణాలు తీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బాధితులకు ఇచ్చే పరిహారం పెంచాలి: జగన్ 

ఇప్పుడు జరిగిన దుర్ఘటనలో కూడా తాను వస్తున్నానని చెప్పిన తర్వాత పాతిక లక్షల పరిహారం ప్రకటించారని జగన్ ఆరోపించారు. ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం కారణంగా జరిగిన దుర్ఘటన కాబట్టి పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో ఇలాంటివి జరిగితే మానతాదృక్పథంతో పరిహారం సక్రమంగా అందజేశామన్నారు జగన్. ఇప్పుడు కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సింహాచల చందనోత్స దుర్ఘటనలో బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటే రిపీట్ కాకుండా ఉంటాయని జగన్ సూచించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
Embed widget