అన్వేషించండి

Simhachalam Incident : ప్రభుత్వ అతి జాగ్రత్త, సమన్వయ లోపం, సింహాచలం లాంటి ఘటనలకు కారణమా?

Simhachalam Incident : కూటమి ప్రభుత్వం అతి జాగ్రత్త, సమన్వయ లోపాలే సింహాచలం లాంటి ఘటనలకు కారణం అవుతున్నాయా అని విమర్శ గట్టిగా వినిపిస్తోంది.

Simhachalam Incident : "సింహాచలంలో ఆ ఒక్క దుర్ఘటన మినహా మిగిలిన కార్యక్రమాలన్నీ సజావుగా సాగుతున్నాయి". సింహాచలం ఆలయ ఆవరణలో గోడకూలి ఏడుగురు చనిపోయిన తర్వాత ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. జరగాల్సిందంతా జరిగిపోయి ఏకంగా ఏడుగురు చనిపోయాక మిగిలిందంతా సజావుగా సాగడం ఏంటో ఆయనకే తెలియాలి. ఆయననే కాదు సింహాచలం చందనోత్సవం సూపర్ సక్సెస్ చేయాలని ఈ మధ్య మంత్రులు వైజాగ్‌కు క్యూ కట్టారు. 

కూటమి అధికారంలోకి వచ్చిన జరుగుతున్నతొలి చందనోత్సవం కావడంతో ఎలాగైనా దీన్ని సూపర్‌గా జరిపి చంద్రబాబుతో భేష్ అనిపించుకోవాలన్న తాపత్రయంతో కష్టపడ్డారు మంత్రులు. హోం మంత్రి అనిత సహా మంత్రులు డోలా వీరాంజనేయ స్వామి, అనగాని సత్య ప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్‌లు ఇక్కడి ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ ఐదుగురిలో డోలా వీరాంజనేయ స్వామి జిల్లా ఇంఛార్జ్ మంత్రి కాగా మిగిలిన నలుగురు ఏర్పాట్ల కమిటీలో ఉన్నారు. 

వరుస సమీక్షలు సమావేశాలతో మంత్రులు బిజీగా ఉన్నారు. దానితో అధికారులు వాళ్ల చుట్టూ ఉండాల్సిన పరిస్థితి. అసలు అధికారులకు ఆలయ ఏర్పాట్లపై దృష్టి పెట్టి అంత టైం దొరికిందా అన్న సందేహాలు భక్తుల నుంచి వెలువడుతున్నాయి. ఎంతసేపూ భక్తులకు మంచినీళ్లు మజ్జిగ ప్యాకెట్లు, ట్రాఫిక్ లాంటి సమస్యలపై దృష్టి పెట్టడమే తప్ప వాతావరణ పరిస్థితులపై అంచనా వేయలేకపోవడం సింహాచలం ఘటనకు ప్రధానమైన సమస్య చెప్తున్నారు. 

దేశ ప్రధాని అమరావతికి వస్తున్నవేళ రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం కచ్చితంగా ఒక మచ్చగా మారే అవకాశం ఉంది. పైకి అంతా బాగానే ఉన్నా ఎక్కడో సమన్వయ లోపం ఉన్న మాట వాస్తవమే అన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. ముఖ్యమైన ఈవెంట్‌ల్లో అయితే అతివృష్టి.. లేదా అనావృష్టి అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహార శైలి ఉంది అన్న విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఆ మధ్య జరిగిన తిరుపతి ఘటనలో అధికారులది తప్పైతే మరి ఇప్పుడు సింహాచలం ఘటనలో తప్ప ఎవరిది? ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అనే ప్రశ్నలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. 

పోనీ కూలిన గోడ ఏదైనా పురాతనమైందా అంటే అదీ కాదు. మరి ఇప్పుడు బాధ్యత ఎవరు తీసుకోవాలి. ఇటీవల 53 కోట్ల రూపాయలతో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ పనులు అందుకున్న కాంట్రాక్టర్ తప్పా.. తప్పా అనేది కూడా తేలాలి. ఒకవేళ ఎలాంటి దుర్ఘటన లేకుండా ఈ కార్యక్రమం సక్సెస్ అయి ఉంటే కచ్చితంగా క్రెడిట్ మాది అంటే మాదే పోటీపడేవారు అందరూ. ఇప్పుడు పోయిన ఈ ఏడు ప్రాణాల బాధ్యత ఎవరిది అనేది ప్రభుత్వమే తేల్చాల్సి ఉంది 

క్లౌడ్ బరస్ట్‌ అసలు కారణం?
ఈ దుర్ఘటనకు కారణం ఒక్కసారిగా మారిపోయిన వాతావరణ పరిస్థితి. దాదాపు 30 నుంచి 40 నిమిషాలపాటు ఏకధాటిగా కరిసిన భారీ వర్షం.. విపరీతమైన వేగంతో వీచిన గాలి అంటున్నారు స్థానికులు వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అది కొత్తగా కట్టిన గోడ అయినప్పుడు.. అంత భారీ గాలివాన కురుస్తున్నప్పుడు అక్కడ జనం ఎలా ఉన్నారనే ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది.

ఎక్కడో సమన్వయ లోపం ఉంది?
ఏదేమైనా కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండు ప్రధానమైన ఘటనలు జరగడంతో ఎక్కడో ప్రభుత్వానికి అధికారులకి జనాలకి మధ్య ఒక సమన్వయ లోపం నెలకొన్న పరిస్థితి కళ్ళ ముందు కనబడుతుంది అంటున్నారు విశ్లేషకులు. మరో ఏడాదిలో గోదావరి పుష్కరాలు జరుగనున్న తరుణంలో ఇలాంటి లోపాలపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget