అన్వేషించండి

Paidithalli Temple: వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం - అంబరాన్నంటిన సంబరాలు

తొలేళ్ల పండుగలో భాగంగా సోమవారం (అక్టోబరు 11) రాత్రి 11 గంటలకు భాజా భజంత్రీలు, మేళతాళాలు, తప్పెట్ల మధ్య అమ్మవారి ఘటాలకు పూజలు నిర్వహించేందుకు కోటలోకి తీసుకొచ్చారు.

విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ కార్యక్రమ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అందులో భాగంగా తొలి ఘట్టం తొలేళ్ల పండుగ. ఈ సంబరం వైభవంగా సాగింది. తొలేళ్ల పండుగలో భాగంగా సోమవారం రాత్రి 11 గంటలకు భాజా భజంత్రీలు, మేళతాళాలు, తప్పెట్ల మధ్య అమ్మవారి ఘటాలకు పూజలు నిర్వహించేందుకు కోటలోకి తీసుకొచ్చారు. వీటితో పాటు, పూజారులు, తలయారులు తరలి వచ్చారు. కోటలోని రౌండ్ మహల్ లో ఘటాలకు శక్తి పూజలు నిర్వహించారు. ఘటాలను తిరిగి గుడివద్దకు తీసుకొచ్చారు. అమ్మవారి చదురుగుడి వద్ద పూజారి అమ్మ వారి చరిత్రను చెప్పారు. 

అనంతరం.. ఘటాల్లో నిల్వ చేసి పూజాది కార్యక్రమాలను నిర్వహించిన ధాన్యాపు విత్తనాలను రైతులకు పంచి పెట్టారు. వీటిని పొలాల్లో చల్లితే, అధిక దిగుబడులు వస్తాయని రైతుల విశ్వాసం. ఈ నేపథ్యంలో పూజారి చేతుల మీదుగా విత్తనాలను అందుకునేందుకు ప్రజలు విరగబడ్డారు. అనంతరం ఘటాలను భక్తుల దర్శనార్థం బడ్డీలా ఏర్పాటు చేశారు. ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి, పసుపు కుంకుమలతో మొక్కుబడులు తీర్చుకున్నారు. ఇలా తొలేళ్ల కార్యక్రమం ఘటాలు కోట వద్దకు తీసుకురావటం, శక్తి పూజలు నిర్వహించటం, తిరిగి అమ్మవారి కోవెలకు తరలిరావటం.. అందులోని ధాన్యాన్ని రైతులకు పంచిపెట్టడం.. ఘటాలకు భక్తులు పసుపు, కుంకుమ సమర్పణ కార్యక్రమాలన్ని మంగళవారం తెల్లవారుఝామున మూడు గంటల వరకు సాగాయి. 

తొలేళ్ల పండుగను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావటంతో పురవీధులన్నీ జనసందోహంగా మారాయి. ప్రధానంగా కోట, సింహాచలం మేడ, మూడు లాంతర్లు, గంటస్థభం వీధులన్ని కిక్కిరిసిపోయాయి. ఆలయం వద్ద ఇసుక వేస్తే రాలన్నంత జనం బారులు తీరారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, పోలీసు  బందోబస్తు చేపట్టారు.

దసరా వెళ్లిన మంగళవారం ఉత్సవాలు

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు 254 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ప్రతీయేటా విజయదశమి వెళ్ళిన మంగళవారం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరుగుతుంది. పైడితల్లి అమ్మవారి జాతరలో సిరిమానోత్సవానికి ప్రత్యేకత ఉంది. సిరిమాను (సిరిమానోత్సవం) అనేది భక్తి పూర్వకంగా జరుపుకునే ఒక ఉత్సవం.విజయనగరం పట్టణంలో శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం పేరిట ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం జరుగుతుంది. ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూర్చొని గుడికి ప్రదక్షిణ చెయ్యడం ఈ ఉత్సవంలోని ప్రధాన భాగం.

ఈ సిరిమాను కోసం 33 మూరలు ఉండే వృక్షాన్ని కనిపెట్టడం సామాన్యులకు సాధ్యమయ్యే అంశం కాదు. ప్రతీ ఏటా సిరిమాను సంబరానికి సరిపడే వృక్షం లభించడం కూడా ఒక అద్భుత ఘట్టమే.

సిరిమాను రథం ఊరేగింపులో 8 ప్రధానమైన అంశాలు ఉంటాయి. అన్నింటిలో కీలకమైనది విశేషమైనది సిరిమాను సంబరం, సిరిమాను ఉపరితలంపై బిగించే ఇరుసు, దానిపై ప్రధాన పూజారి ఆసనం, ఆయన చేతిలో విసన కర్ర ప్రత్యేక ఆకర్షణలు. సిరిమాను తిరుగుతున్నంత సేపూ భక్తులు అరటి పళ్లు విసరడం ఆనవాయితీగా వస్తోంది. చూడముచ్చటగా, అత్యంత శోభాయమానంగా సువర్ణ వర్ణంతో కళకళలాడే సిరిమాను ప్రధాన ఆకర్షణ. ఈ సిరిమాను ముందు సాగే బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ఆకర్షణలుగా నిలుస్తాయి.

విజయనగర సామ్రాజ్య కాలంలో సిడిమ్రాను అనే ఉత్సవం జరిగేది. ఆ ఉత్సవం కూడా దాదాపు ఇదే పద్ధతిలో జరిగేది. అయితే భక్తులు కొక్కేనికి అమర్చిన పీఠంపై కాక, స్వయంగా తామే ఆ కొక్కేలకి వేలాడేవారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
Embed widget