అన్వేషించండి

CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం

Andhra News: రానున్న 3 నెలల్లో ప్రతీ పింఛన్‌ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఉపాధి పనులు పూర్తయ్యాక బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Chandrababu Key Orders In Collectors Conference: రాష్ట్రంలో చాలామంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయన్న మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పందించారు. రానున్న 3 నెలల్లో ప్రతీ పింఛన్‌ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని అన్నారు. సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఆయన కీలక ఆదేశాలిచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్‌కు అనుగుణంగా నిర్వహించాలని.. 100 రోజుల పనిదినాలు సరిగా నిర్వహిస్తేనే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని చెప్పారు. కానీ పని దినాలు, మెటీరియల్ కాంపోనెంట్‌ను పూర్తి చేయలేకపోతున్నారని అన్నారు. పల్లె పండుగలో 14.8 శాతమే పనులు చేశారని.. ఇంకా నెలన్నర సమయమే ఉందని గుర్తు చేశారు. అల్లూరి జిల్లాలో 54 శాతమైతే.. మరో జిల్లాలో 1.6 శాతమే పనులు కావడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు పూర్తయ్యాక బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని.. కలెక్టర్లు నిర్లిప్తంగా ఎందుకు ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వద్ద ఉపాధి హామీ డబ్బులున్నా బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని ప్రశ్నించారు.

'అవి అర్హులకే దక్కాలి'

'గత ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్‌ను దెబ్బతీసింది. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం తిరిగి ప్రారంభించాం. కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులుంటే వారికీ పింఛన్ ఇవ్వాలి. సదరం ధ్రువీకరణ పత్రాలు అర్హులకే దక్కేలా చూడాలి. రాజధాని అమరావతి వేగంగా అభివృద్ధి చెందే నగరం. విజయవాడ, గుంటూరు వంటివి అమరావతిలో కలిసిపోతాయి. పట్టణీకరణ పెరుగుతున్న దృష్ట్యా నిరంతరాయంగా ప్రణాళికలుండాలి. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి. స్వచ్ఛాంధ్రలో భాగంగా పచ్చదనాన్ని పెంచేలా చూడాలి. స్వచ్ఛత - శుభ్రత అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. గత ప్రభుత్వం 82 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వదిలి వెళ్లింది. చెత్త తొలగించే పనులు వేగంగా పూర్తి చేయాలి.' అని సీఎం పేర్కొన్నారు.

'అదే నినాదం'

'రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్' అనే నినాదంతో ముందుకెళ్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రభుత్వ పాలన 6 నెలలు గడిచిందన్నారు. నిర్బంధం, సంక్షోభం, అభద్రతలో గడిచిన ఐదేళ్ల కాలాన్ని ప్రజలు ఓ పీడకలగా భావించి తమ అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని చెప్పారు. 'బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చేందుకు నాతో పాటు మంత్రివర్గ సహచరులంతా కృషి చేస్తున్నారు. ఈ 6 నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దాం. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం. మీ ఆశీస్సులు, భాగస్వామ్యంతో 'స్వర్ణాంధ్ర - 2047' విజన్‌తో ఏపీని నెంబర్ 1గా నిలబెడతాం' అని పేర్కొన్నారు.

Also Read: Saraswati Power Land: జగన్‌కు షాక్ ఇచ్చిన ప్రభుత్వం- సరస్వతిలోని భూములు వెనక్కి

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
Women Reservation AP: ఏపీలో మహిళా నేతల విశ్వరూపం ఖాయం - లోకేష్ ప్రకటనే కాదు కార్యాచరణ కూడా - పక్కా ప్లానే ?
ఏపీలో మహిళా నేతల విశ్వరూపం ఖాయం - లోకేష్ ప్రకటనే కాదు కార్యాచరణ కూడా - పక్కా ప్లానే ?
AP Local Elections: ఏపీ స్థానిక సమరానికి జగన్ సై - ఏకగ్రీవాలుండవ్ - కానీ క్యాడర్ ధైర్యం చేస్తుందా?
ఏపీ స్థానిక సమరానికి జగన్ సై - ఏకగ్రీవాలుండవ్ - కానీ క్యాడర్ ధైర్యం చేస్తుందా?
Breaking News: తుమ్మిడిహెట్టి వివాదంపై చర్చలకు సిద్ధమని మహారాష్ట్ర సీఎంకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ
తుమ్మిడిహెట్టి వివాదంపై చర్చలకు సిద్ధమని మహారాష్ట్ర సీఎంకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi youth rebellion: మోదీ ప్రభుత్వానికి ఏడాదే టైం ఇచ్చిన రాహుల్ -ఈ లోపు జెన్ జీ తిరుగుబాటు వస్తుందని ఆశపడుతున్నారా?
మోదీ ప్రభుత్వానికి ఏడాదే టైం ఇచ్చిన రాహుల్ -ఈ లోపు జెన్ జీ తిరుగుబాటు వస్తుందని ఆశపడుతున్నారా?
US Attacks Iran:హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
Dhanush Kara OTT : ఓటీటీలోకి వచ్చేసిన ధనుష కర - ఒకే రోజు 4 సినిమాలు... ఈ మూవీస్ డోంట్ మిస్
ఓటీటీలోకి వచ్చేసిన ధనుష కర - ఒకే రోజు 4 సినిమాలు... ఈ మూవీస్ డోంట్ మిస్
HeatWave 2026: వేదాలలో నీటిని అమృతం అని ఎందుకు పిలుస్తారు? మోదీ విజ్ఞప్తికి, సనాతన సంప్రదాయానికి సంబంధం ఏంటి?
వేదాలలో నీటిని అమృతం అని ఎందుకు పిలుస్తారు? మోదీ విజ్ఞప్తికి, సనాతన సంప్రదాయానికి సంబంధం ఏంటి?
Diet for Hypothyroidism : థైరాయిడ్​తో ఇబ్బంది పడుతున్నారా? వైద్యులు సూచిస్తోన్న తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే
థైరాయిడ్​తో ఇబ్బంది పడుతున్నారా? వైద్యులు సూచిస్తోన్న తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే
Blast Zone OTT : యాక్షన్ కింగ్ అర్జున్ బ్లాస్ట్ జోన్ - ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా?
యాక్షన్ కింగ్ అర్జున్ బ్లాస్ట్ జోన్ - ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా?
NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి - కింద పడ్డ ఫ్యాన్‌‌కు హీరో చేయూత
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి - కింద పడ్డ ఫ్యాన్‌‌కు హీరో చేయూత
Embed widget