అన్వేషించండి

ఇచ్చాపురం నియోజకవర్గాన్ని టెన్షన్ పెడుతున్న పులి- రాత్రి పశువులపై దాడితో జనం బెంబేలు

తాజాగా రాత్రి కంచిలి మండలంలోని మండపల్లి గ్రామంలో వీరవిహారం చేసింది. మాదిన హరిబాబుకు పెంచుకునే ఆవు,దూడపై పంజా విసిరింది.

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రజలను పులి టెన్షన్ పెడుతోంది. పశువులపై దాడి చేస్తూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రెండు రోజులు సైలెంట్‌గా ఉన్న పులి ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. కంచిలి, సోంపేట, కవిటి మండలాల ప్రజలను పరుగులు పెట్టిస్తోంది. ఏ క్షణంలో ఎటు నుంచి పులి దాడి చేస్తుందో అన్న భయం ప్రజల్లో కనిపిస్తోంది. 

తాజాగా రాత్రి కంచిలి మండలంలోని మండపల్లి గ్రామంలో వీరవిహారం చేసింది. మాదిన హరిబాబుకు పెంచుకునే ఆవు,దూడపై పంజా విసిరింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత గ్రామంలోని హరిబాబుకు చెందిన ఆవు, దూడలపై పెద్దపులి తీవ్రంగా దాడి చేసిహతమార్చింది. దూడను క్రూరంగా చంపిన పులి సమీపంలోని పంట పొలాల్లోకి ఈడ్చుకు వెళ్ళింది. 

పాలు కోసం ఉదయాన్నే తోటకు వచ్చిన హరిబాబు అక్కడ పరిస్థితి చూసి హతాశులయ్యారు. ఈ సీన్ చూసిన గ్రామస్థులు, తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలంతా హడలెత్తిపోతున్నారు. పెద్దపులి సంచారంతో కంటిమీద కునుకు లేకుండా పోతుందని ప్రజలు వాపోతున్నారు. ఆవుదూడపై దాడితో మరింత కలవరపడుతున్నారు. 

నిన్న మొన్నటి వరకు ఇచ్ఛాపురం మండలంలో తిరుగుతుందని అంతా భావించారు. అటు నుంచి ఒడిశా అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతోందని అంచనా వేశారు. అటవీ అధికారులు కూడా ప్రజలకు ఇదే చెప్పారు. కానీ పులి అనూహ్యంగా యూ టర్న్‌ తీసుకుంది. కంచిలి మండలంలో ప్రత్యక్షమైంది. 

కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలంలో గత వారంరోజులుగా పాదముద్రలను మాత్రమే కనిపించాయి. ఇప్పుడు ఏకంగా పశువులపై దాడి చేసింది. రక్తం రుచి మరిగిన పులి ఇప్పుడు ఎటు నుంచి మీద పడుతుందో అన్న కంగారు మాత్రం ప్రజల్లో కనిపిస్తోంది. పొలాలకు, తోటలకు వెళ్లడం కష్టమే అంటున్నారు స్థానిక ప్రజలు. 

పులి పాదముద్రలు గుర్తింపు..
శ్రీకాకుళం జిల్లాలో పులి సంచారంపై డీఆర్ఓ నిషాకుమారి మూడు రోజుల క్రితం స్పందించారు. జిల్లాలోని అమ్మవారిపుట్టుగులోని మండపల్లి పంచాయతీలో టైగర్ పాదముద్రలు గుర్తించామని తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో పులి సంచారం ఉందని వెల్లడించారు. పులి తిరుగున్నట్లు అక్టోబర్ 25న అటవీశాఖ అధికారులు గుర్తించారు. అప్పటినుంచి పులి జాడ కోసం అధికారులు చర్యలు తీసుకున్నారు. పులి సంచరిస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏవైనా అనుమానాస్పద గుర్తులు కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఏమైనా పెంపుడు జంతువులపై పులి దాడి చేసి చంపేస్తే ప్రభుత్వం చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు. పులి సంచారంపై సమీప గ్రామాల్లో సంబంధిత అధికారులను అప్రమత్తం చేశామన్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అక్టోబర్ 21 నుంచి పులి సంచారాన్ని ఒడిశా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఏఓబీ బార్డర్ లో పులి సంచరిస్తుండటంతో రెండు రాష్ట్రాల అధికారులు పులిని ట్రాప్ చేయడం కోసం చర్యలు చేపట్టారు. ముఖ్యంగా శ్రీకాకుళంలోని ఉద్దానం, మండపల్లి, అమ్మవారిపుట్టగ, బంజిరినారాయణపురం, మెళియాపుట్టి మండలంలోని గొప్పిలి, గోకర్ణపురం, చిన్నహంస, భరణికోట, కొలిగాం ప్రాంతాల్లో పులి సంచరిస్తుంది. జీడి మామిడి తోటలు ఎక్కువగా ఉన్న చోట పులి పాద ముద్రలు గుర్తించారు. ఎలుగుబంట్లు కూడా ఈ ప్రాంతాల్లో తరచుగా స్థానికులకు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. పంట పొలాల్లో పులి ఆనవాళ్లు అటవీశాఖ గుర్తించి స్థానికులకు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget