అన్వేషించండి

ఇచ్చాపురం నియోజకవర్గాన్ని టెన్షన్ పెడుతున్న పులి- రాత్రి పశువులపై దాడితో జనం బెంబేలు

తాజాగా రాత్రి కంచిలి మండలంలోని మండపల్లి గ్రామంలో వీరవిహారం చేసింది. మాదిన హరిబాబుకు పెంచుకునే ఆవు,దూడపై పంజా విసిరింది.

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రజలను పులి టెన్షన్ పెడుతోంది. పశువులపై దాడి చేస్తూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రెండు రోజులు సైలెంట్‌గా ఉన్న పులి ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. కంచిలి, సోంపేట, కవిటి మండలాల ప్రజలను పరుగులు పెట్టిస్తోంది. ఏ క్షణంలో ఎటు నుంచి పులి దాడి చేస్తుందో అన్న భయం ప్రజల్లో కనిపిస్తోంది. 

తాజాగా రాత్రి కంచిలి మండలంలోని మండపల్లి గ్రామంలో వీరవిహారం చేసింది. మాదిన హరిబాబుకు పెంచుకునే ఆవు,దూడపై పంజా విసిరింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత గ్రామంలోని హరిబాబుకు చెందిన ఆవు, దూడలపై పెద్దపులి తీవ్రంగా దాడి చేసిహతమార్చింది. దూడను క్రూరంగా చంపిన పులి సమీపంలోని పంట పొలాల్లోకి ఈడ్చుకు వెళ్ళింది. 

పాలు కోసం ఉదయాన్నే తోటకు వచ్చిన హరిబాబు అక్కడ పరిస్థితి చూసి హతాశులయ్యారు. ఈ సీన్ చూసిన గ్రామస్థులు, తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలంతా హడలెత్తిపోతున్నారు. పెద్దపులి సంచారంతో కంటిమీద కునుకు లేకుండా పోతుందని ప్రజలు వాపోతున్నారు. ఆవుదూడపై దాడితో మరింత కలవరపడుతున్నారు. 

నిన్న మొన్నటి వరకు ఇచ్ఛాపురం మండలంలో తిరుగుతుందని అంతా భావించారు. అటు నుంచి ఒడిశా అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతోందని అంచనా వేశారు. అటవీ అధికారులు కూడా ప్రజలకు ఇదే చెప్పారు. కానీ పులి అనూహ్యంగా యూ టర్న్‌ తీసుకుంది. కంచిలి మండలంలో ప్రత్యక్షమైంది. 

కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలంలో గత వారంరోజులుగా పాదముద్రలను మాత్రమే కనిపించాయి. ఇప్పుడు ఏకంగా పశువులపై దాడి చేసింది. రక్తం రుచి మరిగిన పులి ఇప్పుడు ఎటు నుంచి మీద పడుతుందో అన్న కంగారు మాత్రం ప్రజల్లో కనిపిస్తోంది. పొలాలకు, తోటలకు వెళ్లడం కష్టమే అంటున్నారు స్థానిక ప్రజలు. 

పులి పాదముద్రలు గుర్తింపు..
శ్రీకాకుళం జిల్లాలో పులి సంచారంపై డీఆర్ఓ నిషాకుమారి మూడు రోజుల క్రితం స్పందించారు. జిల్లాలోని అమ్మవారిపుట్టుగులోని మండపల్లి పంచాయతీలో టైగర్ పాదముద్రలు గుర్తించామని తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో పులి సంచారం ఉందని వెల్లడించారు. పులి తిరుగున్నట్లు అక్టోబర్ 25న అటవీశాఖ అధికారులు గుర్తించారు. అప్పటినుంచి పులి జాడ కోసం అధికారులు చర్యలు తీసుకున్నారు. పులి సంచరిస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏవైనా అనుమానాస్పద గుర్తులు కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఏమైనా పెంపుడు జంతువులపై పులి దాడి చేసి చంపేస్తే ప్రభుత్వం చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు. పులి సంచారంపై సమీప గ్రామాల్లో సంబంధిత అధికారులను అప్రమత్తం చేశామన్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అక్టోబర్ 21 నుంచి పులి సంచారాన్ని ఒడిశా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఏఓబీ బార్డర్ లో పులి సంచరిస్తుండటంతో రెండు రాష్ట్రాల అధికారులు పులిని ట్రాప్ చేయడం కోసం చర్యలు చేపట్టారు. ముఖ్యంగా శ్రీకాకుళంలోని ఉద్దానం, మండపల్లి, అమ్మవారిపుట్టగ, బంజిరినారాయణపురం, మెళియాపుట్టి మండలంలోని గొప్పిలి, గోకర్ణపురం, చిన్నహంస, భరణికోట, కొలిగాం ప్రాంతాల్లో పులి సంచరిస్తుంది. జీడి మామిడి తోటలు ఎక్కువగా ఉన్న చోట పులి పాద ముద్రలు గుర్తించారు. ఎలుగుబంట్లు కూడా ఈ ప్రాంతాల్లో తరచుగా స్థానికులకు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. పంట పొలాల్లో పులి ఆనవాళ్లు అటవీశాఖ గుర్తించి స్థానికులకు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Andhra Pradesh Latest News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Embed widget