అన్వేషించండి

Pawan Kayan: గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్, ఎన్డీఏ ప్రభుత్వం

Andhra Pradesh News | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే పార్వతీపురం మన్యం, పాడేరు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఎన్టీఏ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

Pawan Kalyan News | గిరిజన ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది NDA ప్రభుత్వం. గత నెల (డిసెంబర్)లో పార్వతీపురం మన్యం, పాడేరు ప్రాంతాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మరిన్ని గ్రామాలలో రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు జనవరి నెలలో నిధులు రానున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నిధులు రాగానే రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు అదే సమయంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. 

నిధులు విడుదల

ఈ మేరకు జనవరి 23న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వాటా రూ.163.39 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 111.68 కోట్లు మొత్తంగా రూ.275.07 కోట్లను విడుదల చేసింది. NDA ప్రభుత్వం ఇచ్చిన ఈ నిధులతో మరిన్ని గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయం కల్పించడం ద్వారా, డోలీ మోత రహిత ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. దాంతోపాటుగా పర్యాటక రంగ అభివృద్ధి చేసే  చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేయనుందని పేర్కొన్నారు.

పవన్ చొరవతో రోడ్లు

పల్లెపండుగలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇటీవల మన్యం పార్వతీపురం జిల్లా సారవకోట కిడిమి రోడ్ నుంచి సింగమవలస వరకు రూ. 65 లక్షల మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో రోడ్డు సౌకర్యం కల్పించారు. ఇన్నాళ్లకు తమ ప్రాంతానికి రోడ్డు మార్గం వేయడంతో ఏపీ ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ చొరవకు స్థానికులు  ఆనందం వ్యక్తం చేశారు. అదే విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి పనులకు ఇటీవల శంకుస్థాపన చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీ పరిధిలో హుకుంపేట మండలం, గూడా రోడ్డు నుంచి సంతబయలు వరకు మర్రిపుట్టు గ్రామం మీదుగా రూ 90.50 లక్షల అంచనాతో 2 కిలోమీటర్లు తారు రోడ్డు వేశారు. తద్వారా మర్రిపుట్టు గ్రామానికి డోలి మోతలు నివారించాం. వారిని విద్య, వైద్య, వ్యాపార పరమైన వసతులకు మరింత చేరువ చేశామన్నారు. గతంలో ప్రజలు ఆసుపత్రికి వెళ్ళాలన్నా, విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలన్నా చాలా ఇబ్బంది పడేవారు. 

Also Read: YSRCP Dual Role: జనసేన ఫ్యాన్స్‌గా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు - కూటమిలో చిచ్చు - సోషల్ మీడియాలో సక్సెస్ అవుతున్నారా ?

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget