అన్వేషించండి

Andhra Pradesh Drinking Water: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ తాగునీరులో కీలక ముందడుగు!

Andhra Pradesh Drinking Water:ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగు నీరు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పదివేల కోట్ల రుణం తీసుకునేందుకు ముందడుగు వేసింది.

Andhra Pradesh Drinking Water:ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టబోతోంది. ఇప్పటికే పనులు ప్రారంభమై వివిధ దశల్లో వాటిని వేగవంతంగా పూర్తి చేసేందుకు ముందడుగు వేస్తోంది. దీని కోసం నేషనల్‌ బ్యాంక్‌ ఫర్ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ నుంచి పదివేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకోనుంది.  

ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, జల్ జీవన్ మిషన్ పనుల వేగాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు బ్యాంక్ అధికారులతో చర్చలు జరిపారు. NaBFID ఈ రుణాన్ని అందించడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ రుణ మొత్తం మూడు విడతలుగా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతానికి ఈ రుణ ప్రతిపాదనలు ఇంకా బ్యాంక్ సాంకేతిక అనుకూలతా కమిటీ సమీక్షలో ఉన్నాయి. కమిటీ ఆమోదం లభిస్తే, ఈ నెల చివరి నాటికి రుణం మంజూరు కావచ్చు.

గతంలో, తాగునీటి అవసరాల కోసం ప్రధానంగా బోరు బావుల నుంచి నీటిని సేకరించేవారు. అయితే, వేసవి కాలంలో భూగర్భ జలాలు తగ్గిపోయినప్పుడు, నీటి సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడేవి. ఈ సమస్యను గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం, ప్రణాళికను పూర్తిగా సవరించింది. దీని ప్రకారం, ఇకపై నదులు ,రిజర్వాయర్ల నుంచి నీటిని సేకరించి, పైప్‌లైన్ల ద్వారా సంవత్సరమంతా సురక్షితమైన తాగునీటిని అందించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ కొత్త విధానం నీటి భద్రతకు, నిరంతరాయ సరఫరాకు హామీ ఇస్తుంది.

రూ. 84,500 కోట్ల సమగ్ర నివేదిక 

నదులు, రిజర్వాయర్ల నుంచి నీటిని సేకరించి, రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేసే ఈ సమగ్ర ప్రాజెక్టు కోసం రూ. 84,500 కోట్ల విలువైన డీపీఆర్ ను తయారు చేశారు. అయితే, NaBFID నుంచి రూ.10,000 కోట్ల రుణం లభించాలంటే, ఈ తాగునీటి పైప్‌లైన్ కనెక్షన్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించాలి. కేంద్రం ఆమోదించిన తర్వాతే NaBFID ఈ రుణాన్ని విడుదల చేస్తుంది.

ఈ ప్రాజెక్టు పనుల ఆలస్యంపై అధికారులు కీలకమైన విషయాలను వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ కింద, కేంద్ర ప్రభుత్వం గతంలో రూ. 27,000 కోట్ల ప్రాజెక్టును ఆమోదించింది. కానీ, పూర్వ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేయడంలో విఫలమైందని అధికారులు ఆరోపించారు. 2019-2024 మధ్య కాలంలో పూర్వ ప్రభుత్వం కేవలం రూ.4,000 కోట్లు మాత్రమే కేటాయించిందని, పనులు అసంపూర్తిగా ఉండటం వలన తాగునీటి సరఫరా లక్ష్యం నెరవేరలేదని అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన ప్రతి ఇంటికీ తాగునీటి కనెక్షన్ అందించాలనే లక్ష్యాన్ని నెరవేర్చడమే తమ ప్రధాన లక్ష్యం అని ప్రభుత్వం ప్రకటించింది.

ఆర్థిక ప్రణాళిక, భవిష్యత్తు లక్ష్యాలు

మొదట కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రూ. 27,000 కోట్ల ప్రాజెక్టులో, పెండింగ్‌లో ఉన్న పనుల విలువ సుమారు రూ.23,000 కోట్లు. ఈ రూ. 23,000 కోట్ల విలువైన పనుల కోసం, ఇప్పుడు NaBFID నుంచి రూ. 10,000 కోట్ల రుణాన్ని పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మిగిలిన రూ. 13,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది.

ప్రభుత్వం రాబోయే రెండు నుంచి మూడు సంవత్సరాలలో పెండింగ్‌లో ఉన్న ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయత్నం ద్వారా, రాష్ట్రంలోని 25 లక్షల కంటే ఎక్కువ ఇళ్లకు కుళాయి కనెక్షన్లు అందించాలని ప్రణాళిక వేసింది.

వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి

జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి కనెక్షన్లను అందించే విషయంలో ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న జిల్లాలలో శ్రీకాకుళం, అనకాపల్లి, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, విజయనగరం, కర్నూలు, అనంతపురం ఉన్నాయి.

సాంకేతిక అనుకూలతా కమిటీ సమీక్ష పూర్తయి, కేంద్ర ప్రభుత్వం డీపీఆర్‌కు ఆమోదం తెలిపితే, NaBFID నుంచి రూ. 10,000 కోట్ల రుణం విడుదల అవుతుంది. దీంతో, రూ. 84,500 కోట్ల విలువైన ఈ తాగునీటి పైప్‌లైన్ ప్రాజెక్టు రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. కొత్త విధానంతో, తాగునీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా, రాష్ట్ర ప్రజలకు నిరంతరాయంగా సురక్షితమైన నీరు లభించనుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Embed widget