అన్వేషించండి

Andhra Pradesh Drinking Water: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ తాగునీరులో కీలక ముందడుగు!

Andhra Pradesh Drinking Water:ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగు నీరు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పదివేల కోట్ల రుణం తీసుకునేందుకు ముందడుగు వేసింది.

Andhra Pradesh Drinking Water:ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టబోతోంది. ఇప్పటికే పనులు ప్రారంభమై వివిధ దశల్లో వాటిని వేగవంతంగా పూర్తి చేసేందుకు ముందడుగు వేస్తోంది. దీని కోసం నేషనల్‌ బ్యాంక్‌ ఫర్ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ నుంచి పదివేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకోనుంది.  

ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, జల్ జీవన్ మిషన్ పనుల వేగాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు బ్యాంక్ అధికారులతో చర్చలు జరిపారు. NaBFID ఈ రుణాన్ని అందించడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ రుణ మొత్తం మూడు విడతలుగా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతానికి ఈ రుణ ప్రతిపాదనలు ఇంకా బ్యాంక్ సాంకేతిక అనుకూలతా కమిటీ సమీక్షలో ఉన్నాయి. కమిటీ ఆమోదం లభిస్తే, ఈ నెల చివరి నాటికి రుణం మంజూరు కావచ్చు.

గతంలో, తాగునీటి అవసరాల కోసం ప్రధానంగా బోరు బావుల నుంచి నీటిని సేకరించేవారు. అయితే, వేసవి కాలంలో భూగర్భ జలాలు తగ్గిపోయినప్పుడు, నీటి సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడేవి. ఈ సమస్యను గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం, ప్రణాళికను పూర్తిగా సవరించింది. దీని ప్రకారం, ఇకపై నదులు ,రిజర్వాయర్ల నుంచి నీటిని సేకరించి, పైప్‌లైన్ల ద్వారా సంవత్సరమంతా సురక్షితమైన తాగునీటిని అందించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ కొత్త విధానం నీటి భద్రతకు, నిరంతరాయ సరఫరాకు హామీ ఇస్తుంది.

రూ. 84,500 కోట్ల సమగ్ర నివేదిక 

నదులు, రిజర్వాయర్ల నుంచి నీటిని సేకరించి, రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేసే ఈ సమగ్ర ప్రాజెక్టు కోసం రూ. 84,500 కోట్ల విలువైన డీపీఆర్ ను తయారు చేశారు. అయితే, NaBFID నుంచి రూ.10,000 కోట్ల రుణం లభించాలంటే, ఈ తాగునీటి పైప్‌లైన్ కనెక్షన్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించాలి. కేంద్రం ఆమోదించిన తర్వాతే NaBFID ఈ రుణాన్ని విడుదల చేస్తుంది.

ఈ ప్రాజెక్టు పనుల ఆలస్యంపై అధికారులు కీలకమైన విషయాలను వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ కింద, కేంద్ర ప్రభుత్వం గతంలో రూ. 27,000 కోట్ల ప్రాజెక్టును ఆమోదించింది. కానీ, పూర్వ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేయడంలో విఫలమైందని అధికారులు ఆరోపించారు. 2019-2024 మధ్య కాలంలో పూర్వ ప్రభుత్వం కేవలం రూ.4,000 కోట్లు మాత్రమే కేటాయించిందని, పనులు అసంపూర్తిగా ఉండటం వలన తాగునీటి సరఫరా లక్ష్యం నెరవేరలేదని అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన ప్రతి ఇంటికీ తాగునీటి కనెక్షన్ అందించాలనే లక్ష్యాన్ని నెరవేర్చడమే తమ ప్రధాన లక్ష్యం అని ప్రభుత్వం ప్రకటించింది.

ఆర్థిక ప్రణాళిక, భవిష్యత్తు లక్ష్యాలు

మొదట కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రూ. 27,000 కోట్ల ప్రాజెక్టులో, పెండింగ్‌లో ఉన్న పనుల విలువ సుమారు రూ.23,000 కోట్లు. ఈ రూ. 23,000 కోట్ల విలువైన పనుల కోసం, ఇప్పుడు NaBFID నుంచి రూ. 10,000 కోట్ల రుణాన్ని పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మిగిలిన రూ. 13,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది.

ప్రభుత్వం రాబోయే రెండు నుంచి మూడు సంవత్సరాలలో పెండింగ్‌లో ఉన్న ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయత్నం ద్వారా, రాష్ట్రంలోని 25 లక్షల కంటే ఎక్కువ ఇళ్లకు కుళాయి కనెక్షన్లు అందించాలని ప్రణాళిక వేసింది.

వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి

జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి కనెక్షన్లను అందించే విషయంలో ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న జిల్లాలలో శ్రీకాకుళం, అనకాపల్లి, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, విజయనగరం, కర్నూలు, అనంతపురం ఉన్నాయి.

సాంకేతిక అనుకూలతా కమిటీ సమీక్ష పూర్తయి, కేంద్ర ప్రభుత్వం డీపీఆర్‌కు ఆమోదం తెలిపితే, NaBFID నుంచి రూ. 10,000 కోట్ల రుణం విడుదల అవుతుంది. దీంతో, రూ. 84,500 కోట్ల విలువైన ఈ తాగునీటి పైప్‌లైన్ ప్రాజెక్టు రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. కొత్త విధానంతో, తాగునీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా, రాష్ట్ర ప్రజలకు నిరంతరాయంగా సురక్షితమైన నీరు లభించనుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Rupee Falling News: వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
US warning to Pakistan:  ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
Putin Religion: లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
Embed widget