By: ABP Desam | Updated at : 19 Sep 2023 05:36 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
అల్లూరు జిల్లా చింతపల్లి సమీపంలోని ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. వారు ఏకంగా పోలీసులకే చుక్కలు చూపించారు. పుష్ప సినిమా తరహాలో గంజాయి తరలిస్తుండగా, పోలీసులకు దొరక్కుండా పారిపోయారు. దీంతో సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లర్లను పోలీసులు వెంటాడారు. ఆదివారం అర్ధరాత్రి ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అటుగా వస్తున్న బొలెరో వాహనం పోలీసులపై వేగంగా రావడం ప్రారంభించింది. గంజాయి స్మగ్లర్లు వాహనాన్ని ఆపకుండా గంజాయి బ్యాగులను రహదారిపై పడేశారు. మార్గ మధ్యలో బొలెరో వాహనం వదిలేసి స్మగ్లర్లు పరారీ అయ్యారు. దాదాపు 980 కేజీల గంజాయిని ఒడిశా పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. ఈ కేసును ఒడిశా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన టీడీపీ- స్పీకర్ తీర్పుపై తీవ్ర విమర్శలు
Breaking News Live Telugu Updates: కడియం శ్రీహరికి జై కొట్టిన తాటికొండ రాజయ్య
జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- సభ నుంచి టీడీపీ లీడర్ల సస్పెన్షన్
మీసాలు తిప్పి విజిల్ వేస్తూ ఆందోళన- అసెంబ్లీ సమావేశాల్లో బాలయ్య హంగామా
Top Headlines Today: అర్థరాత్రి రాజ్యసభలో మహిళా బిల్లుకు మోక్షం- అభ్యర్థులపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు దాదాపు పూర్తి
Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్ఇండియా టార్గెట్ 279
చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు
/body>