అన్వేషించండి

Botsa Satyanarayana: జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం ఫిక్స్ - బొత్స సత్యనారాయణ

AP Latest News: విజయనగరంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. జూన్ 4న వెల్లడికాబోయే ఫలితాల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని తాము విశ్వాసంతో ఉన్నామని అన్నారు.

Botsa Satyanarayana Comments on CM Jagan Oath Ceremony: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జూన్ 9న మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జూన్ 4న వెల్లడికాబోయే ఫలితాల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని తాము విశ్వాసంతో ఉన్నామని అన్నారు. విజయనగరంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లుగా ప్రజలతో ముఖ్యమంత్రి జగన్ ప్రజలతో మమేకమయ్యారని.. ప్రజా అవసరాలకు తగ్గట్లుగా ఆయన పాలన చేపట్టారని అన్నారు. జగన్ తీసుకున్న సామాన్య పౌరుడు ఆర్థికంగా ఎదిగేలా తీసుకున్నామని అన్నారు. 

సామాన్యులకు పూర్వం నుంచి అందుతూ వస్తున్న సేవల విషయంలో సీఎం జగన్ సంచలన మార్పులు తీసుకొచ్చారని అన్నారు. విద్య, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని అన్నారు. ఇలాంటి విధానాలు ప్రభుత్వం మారితే పోతాయని బొత్స అన్నారు. తన సొంత నియోజకవర్గం ఉన్న విజయనగరం జిల్లాలో ఉన్న 9 స్థానాల్లోనూ గడిచిన ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారని అన్నారు. అదే తరహాలో ఈ సారి పట్టం కడతారని విశ్వాసంతో ఉన్నట్లుగా బొత్స సత్యనారాయణ నమ్మకం వ్యక్తం చేశారు. ఆ జిల్లాలో తాము అనుకున్న దాని కంటే రెండు శాతం ఎక్కువగా పోలింగ్ జరిగిందని అన్నారు. 

ఇంకా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజలకు గుమ్మం ముందుకే పాలన తీసుకువచ్చామని చెప్పారు. అందుకే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామని.. దానికి చాలా మంచి పేరు వచ్చింది. ఇక్కడి  పరిస్థితులను చూసి చాలా రాష్ట్రాల వాలంటీర్ వ్యవస్థను అమలు చేయడానికి రెడీగా ఉన్నాయని అన్నారు. 

ఇక అన్ని పథకాలపై ఆరోపించడం టీడీపీకి అలవాటే అని.. విశాఖపట్నంలో కొంత మంది మీద దాడి జరిగితే దానికి రాజకీయ రంగు పులుమారని విమర్శించారు. కూటమి నేతలు ఎక్కువగా పోటీ చేసిన ఆ నాలుగు జిల్లాల్లోనే ఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేశారని గుర్తు చేశారు. దానికి కారణం వారు చేసిన ఘటనలే అని అన్నారు. తమ నాయకుడు సీఎం జగన్ విదేశాలకు వెళ్తున్నట్లుగా చెప్పి.. వెళ్లారని.. కానీ చంద్రబాబు, లోకేశ్ మాత్రం ఎవరికీ చెప్పకుండానే అమెరికా వెళ్లారని విమర్శించారు. విజయనగరంలో ఉన్న 9 నియోజకవర్గాలకు తొమ్మిది స్థానాలు గెలుస్తామని అన్నారు. అలాగే రాష్ట్రంలో 175 కి 175 స్థానాలు గెలుస్తామని బొత్స సత్యనారాయణ అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
Virat Kohli : ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు కోహ్లీ, ధోనీకి కూడా సాధ్యం కాని ఘనత మరి
ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు కోహ్లీ, ధోనీకి కూడా సాధ్యం కాని ఘనత మరి
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Embed widget