అన్వేషించండి

ఏపీలో టీడీపీకి, వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనే: ఎమ్మెల్సీ మాధవ్‌

టీడీపీకి, వైసీపీకి బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ఆలస్యానికి టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలే కారణం అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, వైసీపీపై బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలకు బీజేపీనే ప్రత్యామ్నాయమని, రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది తామేనని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీతోపాటు ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కూడా బీజేపీతో మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు. విశాఖపట్నంలోని బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై, టీడీపీపై విమర్శలు గుప్పించారు. విశాఖలో ఐఐపీఎం కల ఏడేళ్ల తర్వాత సాకారం అయిందని పేర్కొన్నారు. ఏడు కేంద్ర విద్యా సంస్థలు నెలకొల్పినట్టు వెల్లడించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకూ ఎయిమ్స్ కు  నీళ్ల సరఫరా పైప్ లైన్ ఇవ్వలేదని పీవీఎన్ మాధవ్ విమర్శలు చేశారు. 

'రైల్వే జోన్ కు శంకుస్థాపన చేస్తాం'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి  రైల్వే జోన్ శంకుస్థాపన త్వరలోనే జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తెలిపారు. జోన్ ఇవ్వని వారమైతే కేంద్ర బడ్జెట్ లో నిధులు ఎందుకు ఇస్తామని ప్రశ్నించారు. జోన్ పై కొంత దుష్ప్రచారం జరిగిందని.. నిరాధార లీక్ లు ఆధారంగా ఆవాస్తవ కథనాలు వచ్చాయని మాధవ్ పేర్కొన్నారు. ఈ విష్టయాన్ని రైల్వే మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లామని తెలిపారు. వెంటనే రైల్వే మంత్రి స్పందించినట్లు బీజేపీ ఎమ్మెల్సీ వెల్లడించారు. విశాఖలో 25 ఏకరాలు స్థలాన్ని దక్షిణ కోస్తా రైల్వే స్థాపన సంబంధించి ఇవ్వాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ఇవ్వలేదని ఆరోపించారు. 2020-21 బడ్జెట్ లో రూ. 175 కోట్లు ప్రత్యేక రైల్వే జోన్ కోసం ఇచ్చామి మాధవ్ వివరించారు. త్వరలోనే అనేక రైళ్లు విశాఖపట్నం నుంచి మొదలు అవుతాయని తెలిపారు. ర్యాక్ సమస్య వల్ల చాలా రైలు మొదలు కావడం ఆలస్యమైందని తెలిపారు. 

'ప్రభుత్వాల తప్పిదాల వల్లే పోలవరం ఆలస్యం'

గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ సర్కారు తప్పిదాల వల్లే పోలవరం ఆలస్యం అవుతోందని విమర్శించారు. సీఎం జగన్ ముంపు ప్రాంతాలకు వెళ్లి మాట్లాడిన తీరు దురదృష్టకరమని ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ ఆక్షేపించారు. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైన అప్పు తీసుకువచ్చి పనులు చేపడితే ఆ మేరకు కేంద్ర సర్కారు రియంబర్స్ చేస్తుందని వివరించారు. పోలవరం ప్రాజెక్టులో కమిషన్ లను పుచ్చుకున్నారని ఆరోపణలు చేశారు. ఈ రోజుకి మాన్యువల్ గానే బిల్లు సిద్ధం చేస్తున్నారని ఆక్షేపించారు. ఎందుకు ఆన్ లైన్ చెయ్యలేదని నిలదీశారు. పోలవరం ప్రాజెక్ట్  పునరావాస పరిహారం కూడా ఈ ప్రభుత్వం సరిగ్గా ఇవ్వడం లేదని అన్నారు. ఇచ్చే అవకాశం ఉంటే మొదట మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పీవీఎన్ మాధవ్ తెలిపారు. కొన్ని పరిశ్రమలలో కేంద్ర వాటా పెట్టుబడులు ఉపసంహరణకు వెళ్లామని, విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండటంతో పెట్టుబడి ఉపసంహరణ కు వెళ్లినట్లు వెల్లడించారు. ప్లాంట్ ఉద్యోగుల సంక్షేమం, కార్మికుల శ్రేయస్సు కోసం ఈ రోజుకి స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తున్నట్లు వివరించారు. 

'మేమే ప్రత్యామ్నాయం'

వైసీపీ, టీడీపీ లు ఈ రాష్ట్రంలో బీజేపీ ఎదగకుండా అడ్డుపడుతున్నాయని ఆక్షేపించారు. ఏపీ ఈ రెండు పార్టీ లకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని మాధవ్ ధీమా వ్యక్తం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Dhee Show Pandu: పండు మాస్టర్‌కు యాక్సిడెంట్... విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళకూ?
పండు మాస్టర్‌కు యాక్సిడెంట్... విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళకూ?
Pawan Kalyan Press Meet:
"నా గుండెల్లో తెలంగాణ ఉంది! మీ అయ్య జాగీరా అడ్డుకుంటామని బెదిరించడానికి?" పవన్ సంచలన కామెంట్స్
Pawan Kalyan Press Meet: పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 
పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Foods for Healthy Joints : కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
Early Symptoms of Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
Embed widget