అన్వేషించండి

సైకిల్ ఎక్కిన పట్టభద్రులు - ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమల్లో టీడీపీ జోరు - అక్కడ వైసీపీ!

వైసీపీ బలపర్చిన అభ్యర్థి సీతం రాజు సుధాకర్ ను గెలిపించడం ద్వారా విశాఖ రాజధాని కావాలన్న ఆకాంక్షను బలంగా చాటాలని అధికార పార్టీ ఇచ్చిన పిలుపును గ్రాడ్యుయేట్లు పట్టించుకోలేదు.

నువ్వూ వద్దు.. నీ రాజధాని వద్దు అన్నట్లుగా ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్పునిచ్చారు. వైసీపీ బలపర్చిన అభ్యర్థి సీతం రాజు సుధాకర్ ను గెలిపించడం ద్వారా విశాఖ రాజధాని కావాలన్న ఆకాంక్షను బలంగా చాటాలని అధికార పార్టీ ఇచ్చిన పిలుపును గ్రాడ్యుయేట్లు, మరీ ముఖ్యంగా ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు తిప్పి కొట్టాయి. ఫలితంగా టీడీపీ అభ్యర్థి డాక్టర్ వేపాడ చిరంజీవిరావుకు ఏడో రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికే 26,358 ఓట్ల మెజార్టీ లభించింది. ఏ రౌండ్లోనూ అధికార పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ చిరంజీవిరావుకు పోటీ ఇవ్వలేకపోయారు.

పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభ గెలిస్తే అధికార వైసీపీకి ఓడిపోయారనే సందేశం వెళ్లదని భావించిన గ్రాడ్యుయేట్లు గంపగుత్తగా తెలుగుదేశం అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేశారు. మిగిలిన ఒక రౌండ్ లెక్కింపు ఉండగానే ఏడో రౌండ్ పూర్తి అయ్యే సరికి టీడీపీకి 80,762 ఓట్లు పడగా, వైకాపాకు 54,404 ఓట్లు వచ్చాయి.పీడీఎఫ్ అభ్యర్థికి 33,364, బీజేపీకి 8,988 ఓట్లు వచ్చాయి. ఈ ఆరు రౌండ్లలో 10,117 ఓట్లు చెల్లకుండా పోవడం విశేషం. దీంతో టీడీపీ అభ్యర్థికి 26,358 ఓట్లు ఆధిక్యత లభించినట్లయింది. 2007, 2011, 2017 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటు ఆధారంగా ఫలితం తేలింది. కానీ వేపాడ చిరంజీవికి మాత్రం ఆ అవసరం లేకుండానే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే డిక్లేర్ చేసే అవకా శాలు కనిపిస్తున్నాయి.

టీడీపీకి జై కొట్టిన ఉపాధ్యాయులు 
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారు. ఉత్తరాంధ్ర ఉమ్మడి మూడు జిల్లాల్లో ఉన్న దాదాపు 28వేల మంది ఉపాధ్యాయులు ఈసారి టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారు. ఉపాధ్యాయ యూనియన్లతో ఉన్న సంబంధ బాంధవ్యాల ప్రకారం రాయలసీమలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొటాబొటీ మెజార్టీతోనైనా అధికార పార్టీ అభ్యర్థులే గెలుస్తారని ముందుగానే తెలుసుకున్న టీచర్లు ఉత్తరాంధ్రలో మాత్రం కసితీరా తెలుగుదేశానికి ఓట్లేశారు. రాష్ట్రంలో మూడు చోట్ల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండుచోట్ల ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులే ముందంజలో ఉన్నా రు. ఉత్తరాంధ్ర టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుతో పాటు తూర్పు రాయలసీమలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ ఐదో రౌండ్ పూర్తయ్యేసరికి 17వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఇక్కడ కూడా టీడీపీ గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

ఇక పశ్చిమ రాయలసీమలో టీడీపీ, వైసీపీ మధ్య పోరు హోరాహోరీని తలపిస్తోంది. ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి 1972 ఓట్ల ఆధిక్యతతో మాత్రమే ఉన్నారు. ఇది మొదటి ప్రాధాన్యత ఓటు కావ డం గమనార్హం. రెండో ప్రాధాన్యత ఓటును పరిశీలిస్తే టీడీపీయే గెలుస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. 

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లుగా తమను పట్టిం చుకోలేదని వైసీపీ గ్రామ, మండల నాయకులతో పాటు కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో అధిష్టానానికి బుద్ధి చెప్పడానికైనా పార్టీ అభ్యర్థులను ఓడించి తీరాలన్న పట్టుదల, కసితో అధికార పార్టీకి చెందిన విద్యావంతులే జగన్కు వ్యతిరేకంగా ఓటు వేశారని ఈ ఫలితాలు చెబుతున్నాయి. ప్రతి రౌండ్లోనూ వైసీపీ అభ్యర్థులు వెనుకంజలో ఉండటం హాట్ టాపిక్ గా మారింది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. చివరకు సీఎం వైఎస్ జగన్ కు అడ్డా అయిన పశ్చిమ రాయలసీమలో సైతం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా వైసీపీ అభ్యర్థి గట్టెక్కారు. లక్షలాది విద్యావంతులు పాల్గొన్న ఎన్నిక ల్లో జగన్ కు తమ ధర్మాగ్రహాన్ని తెలియజేయడానికే మొగ్గు చూపారు.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి జగన్ మీద ఎంత కసితో ఉన్నారో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల మీద కూడా అంతకు మించిన వ్యతిరేకతతో ఓటర్లు ఉన్నారు. వేపాడ చిరంజీవిరావు గెలుపు లో ఉద్యోగవర్గాల వ్యతిరేకత, తూర్పుకాపుల ఐక్యత, వలస అభ్యర్థు లపై ఆగ్రహం, వైకాపా ఎమ్మెల్యేల నిరాసక్తత, వేపాడ శిష్యగణం శ్రమ కీలక పాత్ర పోషించాయి. ఈ ఎన్నికతో వైసీపీ కొన్ని విషయాల్లో అలర్ట్ అయింది. వాలంటీర్లు ఓటర్లను బూత్ వరకు రప్పించగలరు గానీ అధికార పార్టీకి ఓటు వేయించలేరన్నది మొదటిది. సర్పంచ్ లు, ఎంపీటీసీలు ప్రాధాన్యత కోల్పోవడం వల్లే పట్టభద్రులను ప్రభావితం చేయలేకపోయారన్నది రెండో అంశం.

అధికార పార్టీకి పట్టభద్రుల షాక్ 
పట్టుభద్రులు, ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైకాపాకు మిశ్రమ ఫలితాలు లభించాయి. రాష్ట్రంలో తొమ్మిది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలతోపాటు మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఈ నెల 13న ఎన్నికలు జరిగాయి. వీటిలో ఐదు స్థానిక సంస్థల నియోజకవర్గాలను వైకాపా ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఎన్నిక జరిగిన నాలుగు స్థానాలను కూడా ఆయా జిల్లాల్లోని స్థానిక సంస్థల్లో తనకున్న మెజారిటీతో దాదాపు ఏకపక్షం గా విజయం సాధించింది. గురువారం జరిగిన కౌంటింగ్లో ఆ నాలుగు స్థానాల్లో (శ్రీకాకుళం-1, ఏలూరు-2, కర్నూలు-1)నూ వైకాపా విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. వీటితోపాటు ప్రారంభమైన పట్టభద్రులు, ఉపాధ్యాయులకు చెందిన ఐదు నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం లేదా రాత్రికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. వీటిలో పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్లు అధికార వైకాపా కు షాక్ ఇచ్చారు. ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి మొత్తం మూడు స్థానాల్లో పశ్చిమ రాయలసీమ స్థానంలోనే వైకాపా స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమల్లో తెలుగు దేశం అభ్యర్థులు ఆధిక్యతతో దూసుకుపోతున్నారు.

రౌండ్లవారీగా ఆధిక్యతలు 
కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలతో కూడిన పశ్చిమ రాయల సీమ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి 1972 ఓట్ల స్వల్ప ఆధిక్యత లో కొనసాగుతున్నారు. ఐదు రౌండ్ల లెక్కింపు పూర్తి కాగా వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డికి 47,086 ఓట్లు, టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంభూపాల్రెడ్డికి 45,114 ఓట్లు లభించాయి. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన తూర్పు రాయలసీమ నియోజక వర్గంలో ఐదు రౌండ్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 17,139 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థికి 82,260 ఓట్లు, వైకాపా అభ్యర్థికి 65,121 ఓట్లు లభిం చాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో కూడిన ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ వేపాడ చిరంజీవి రావు 23, 278 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఇంతవరకు టీడీపీ అభ్యర్థికి 69,910 ఓట్లు, వైకాపా అభ్యర్థికి 46,632 ఓట్లు లభించాయి.

ఓటు వైసీపీకే! 
ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో మాత్రం అనూహ్య ఫలితాలు వచ్చాయి. గత ఏడాది కాలంగా వేతనాలు, పీఆర్సీ, డీఏ ఇతర బకాయిల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయవర్గాలు తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకతతో ఉన్నాయి. ఉద్యమాలు కూడా నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వా నికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని, ఆ నియోజకవర్గాల్లో వైకాపాకు పరాభవం తప్పదని అందరూ భావించారు. కానీ ఫలితాలు ఆశ్చర్య పరిచాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ వైకాపా అభ్యర్థులే విజ యం సాధించడం విశేషం. తూర్పు రాయలసీమ టీచర్స్ నియోజక వర్గంలో వైకాపా అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్ గెలుపొందగా, పశ్చిమ రాయలసీమ టీచర్స్ నియోజకవర్గంలో అదే పార్టీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి గెలుపొందారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget