అన్వేషించండి

Omicron in AP: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు, ఐర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి.. వైద్యఆరోగ్యశాఖ కీలక ప్రకటన

ఐర్లాండ్ నుంచి విజయనగరానికి వచ్చిన 34 ఏళ్ల ప్రయాణికుడికి ఒమిక్రాన్ ఉన్నట్లుగా తేలింది. విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోటకు చెందిన వ్యక్తికి ఈ వేరియంట్ సోకినట్లుగా గుర్తించారు.

ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. విజయనగరం జిల్లాలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కూడా దీన్ని ధ్రువీకరించింది. ఐర్లాండ్ నుంచి విజయనగరానికి వచ్చిన 34 ఏళ్ల ప్రయాణికుడికి ఒమిక్రాన్ ఉన్నట్లుగా తేలింది. విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోటకు చెందిన వ్యక్తికి ఈ వేరియంట్ సోకినట్లుగా గుర్తించారు.

తాజాగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టులో కరోనా నెగటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో ఒక్క ఒమిక్రాన్ యాక్టివ్ కేసు కూడా లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఐర్లాండ్ నుంచి వచ్చిన ఈ వ్యక్తి దేశంలో తొలుత ముంబయి ఎయిర్ పోర్టుకు వచ్చి అక్కడి నుంచి విశాఖపట్నం నవంబరు 27న వచ్చాడు. ముంబయిలో ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహించగా.. కొవిడ్ నెగటివ్ అని వచ్చింది. 

విజయనగరం వచ్చాక మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్టు చేయగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈయన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్ష కోసం హైదరాబాద్ సీసీఎంబీకి పంపించారు. ఆ ఫలితాల్లో అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ ఉన్నట్లుగా తేలింది. కానీ, అతనికి ఎలాంటి లక్షణాలు లేవు. మళ్లీ ఈ నెల 11న మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్టు చేయగా.. కరోనా నెగటివ్ అని తేలినట్లుగా అధికారులు ప్రకటించారు.

Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం

ఏపీలో ఒమిక్రాన్ వేరియంట్ కేసు గుర్తించడం ఇదే మొదటిది అని అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన మొత్తం 15 మంది ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని, వీరి నమూనాలు సీసీఎంబీకి పంపగా.. ఒక ఒమిక్రాన్ గుర్తించినట్లుగా వెల్లడించారు. మరో ఐదుగురి రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా నిబంధనలు పాటిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు.

Also Read: Hyderabad: సెలైన్ బాటిల్‌లో విషం ఎక్కించిన డాక్టర్.. దాన్ని తన చేతికే పెట్టుకొని..

Also Read: Chandrababu: నెల్లూరులో టీడీపీ కట్టప్పలకు చంద్రబాబు మొట్టికాయలు.. జీరో స్కోరేంటని ఆగ్రహం..!

Also Read: చంద్రబాబు చూడాల్సింది అఖండ మూవీ కాదు జస్టిస్ చంద్రు వీడియో... ప్యాకేజీకి ఓకే చెప్పినప్పుడే హోదా కనుమరుగు

Also Read: లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget