అన్వేషించండి

నేటి నుంచి శాశ్వత భూ హక్కు పత్రాల పంపిణీ- శ్రీకాకుళంలో ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2020 డిసెంబర్‌ 21న వైఎస్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని ప్రారంభించింది. డ్రోన్లతోపాటు జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్స్‌ వంటి అత్యాధునిక సర్వే సాంకేతికతలను ఉపయోగించింది.

వంద సంవత్సరాల తరువాత దేశంలోనే తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేలో భాగంగా, 2వేల గ్రామాల రైతులకు జగనన్న భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఏపీ సర్కార్ రెడీ అయ్యింది. రాబోయే 15 రోజులలో ఈ 2వేల గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బుధవారం(23 నవంబర్ 2022)ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహా యజ్ఞాన్ని చేపట్టిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దశల వారీగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సన్నాహాలను పూర్తి చేసింది. రాష్ట్రంలోని భూముల రీసర్వే పూర్తి, రీసర్వే పూర్తైన గ్రామాల్లో అవసరమైన ప్రక్రియను పూర్తిచేసి ఆయా సచివాలయాల్లో స్ధిరాస్తుల రిజిస్ట్రేషన్లను చేయనున్నారు.

ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం...
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2020 డిసెంబర్‌ 21న వైఎస్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని ప్రారంభించింది. రెండు వేల గ్రామాల్లో రీసర్వే సమయంలో రైతులు దరఖాస్తు చేసుకోకుండా 8–9 నెలల వ్యవధిలో 4.3 లక్షల సబ్‌డివిజన్‌లు, 2 లక్షల మ్యుటేషన్‌లు భూమి, రెవెన్యూ రికార్డుల్లో జరిగాయి. మీసేవ, గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి సంవత్సరం స్వీకరించిన 35వేల సబ్‌డివిజన్‌ దరఖాస్తులతో దీనిని పోల్చవచ్చుని అధికారులు అంటున్నారు. భూ కమతం ఒక సర్వే నెంబర్‌ కింద ఉండి, కాలక్రమేణా విభజన జరిగి చేతులు మారినా కూడా సర్వే రికార్డులు అప్‌డేట్‌ కాకపోవడంతో వస్తున్న భూ వివాదాలు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్ధితులు ఉండవని వెల్లడించారు. భూ రికార్డులను ప్రక్షాళన చేసి ప్రతి భూ కమతానికి (సబ్‌ డివిజన్‌కు కూడా) విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపు చేశారు.

అత్యాధునిక సాంకేతికత...

డ్రోన్లు, కంటిన్యూయస్లీ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్లతోపాటుగా జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్స్‌ వంటి అత్యాధునిక సర్వే సాంకేతికతలను ఉపయోగించి ఈ సమగ్ర రీసర్వేని దేశంలోనే మొదటిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రారంభించింది. భూహక్కు పత్రం అందించడం ద్వారా భూ యజమానులకు హక్కు భద్రత కల్పించడం, 5 సెంమీ లేదా అంతకంటే తక్కువ కచ్చితత్వంతో జియో–రిఫరెన్స్‌ కోఆర్డినేట్‌ల ఆధారంగా భూ రక్ష సర్వే రాళ్లను నాటడం ద్వారా భూమికి భౌతిక భద్రత కల్పించడం ఈ సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాలు.

ప్రతి భూ కమతానికి విడిగా అక్షాంశ, రేఖాంశాలు, విశిష్ట గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూవివరాలు తెలిపే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన భూకమత పటం భూ యజమానులకు జారీ చేయనున్నారు. గ్రామ స్ధాయిలో భూ రికార్డులన్నీ క్రోడీకరించి, మ్యాపులు (భూ కమతాలతో కూడిన గ్రామ పటం) ఇతర భూ రికార్డులు ఇక గ్రామాల్లోనే అందుబాటులో ఉంచుతారు.

ఇక పై శాశ్వత భూ హక్కు...

సింగిల్‌ విండో పద్దతిలో ప్రతి ఆస్తికీ ప్రభుత్వ హమీతో కూడిన శాశ్వత భూ హక్కు పత్రం జారీ చేసే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. భూ లావాదేవీలు, బ్యాంకు రుణాలు ఇకపై సులభం అవుతాయని ప్రభుత్వం చెబుతుంది. ప్రతి భూకమతానికి ఉచితంగా భూరక్ష హద్దు రాళ్ళు ఇవ్వటంతోపాటుగా, డూప్లికేట్‌ రిజిస్ట్రేషన్లకు ఇక చెక్‌ పెడతామని ప్రభుత్వం ధీమాగా చెబుతుంది. దళారీ వ్యవస్ధ , లంచాలకు ఇక చోటు లేని పాలన ఉంటుందని వెల్లడించింది.

నకిలీ పత్రాలకు ఇక తావులేదు....
భూ యజమానికి తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులు వీలుపడదని, భూ లావాదేవీల ఆధారంగానే భూ రికార్డుల్లో మార్పులు, అవసరమైన చోట సబ్‌ డివిజన్‌ మార్పులు చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్లు ఉంటాయని వెల్లడించింది. సర్వే ప్రతి అడుగులో భూ యజమానుల భాగస్వామ్యం చేయటం, మండల మొబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాల ద్వారా అభ్యంతరాల పరిష్కారం
తొలిసారిగా గ్రామ కంఠాల్లోని స్తిరాస్తుల సర్వే, యాజమాన్య ధృవీకరణ పత్రాల జారీ చేయనున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
PBKS vs MI Match Highlights: ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?
ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

PBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షోPunjab Kings Last Over Thrillers | PBKS vs MI | అన్నీ ఆఖరి ఓవర్ వరకూ లాక్కొస్తున్న పంజాబ్ | IPL 2024Hardik Pandya Failures | PBKS vs MI మ్యాచ్ లో తీవ్రంగా ఇబ్బంది పడిన పాండ్యా | ABP DesamAshutosh Sharma Finishing | PBKS vs MI మ్యాచ్ లో ముంబై బౌలర్లను చితక్కొట్టిన అశుతోష్ శర్మ | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
PBKS vs MI Match Highlights: ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?
ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Embed widget