అన్వేషించండి

కేంద్రం బటన్‌ నొక్కితో జగన్ పని అయిపోతుంది: బీజేపీ

వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఏపీ బీజేపీ నాయకులు ఫైర్ అయ్యారు. ఇక్కడ బటన్ నొక్కడం కాదని... కేంద్రం బటన్ నొక్కితే జగన్ పని అయిపోతుందని హెచ్చరించారు.

GVL Narasimha Rao: ప్రజాపోరు యాత్రలో ప్రజావ్యతిరేక విధానాలపై బీజేపీ గట్టిగా మాట్లాడిందని ఎంపీ జీవియల్ నరసింహారావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తే టీడీపీ, వైసీపీ నేతలు ఎందుకు నోరు మెదపలేకపోయారని ప్రశ్నించారు. 2024 వరకు హైదరాబాద్‌లో హక్కు ఇస్తే ఎందుకు వదిలేశారన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎందుకు సచివాలయంలో భవనాలు ఇచ్చేశారని అడిగారు. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో రాష్ట్రంలో పోటీ చేస్తామని చెబుతున్నారని తెలిపారు. ఏపీ ప్రజలు ఇంకా రాష్ట్ర విభజన బాధలోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. 

విశాఖ అభివృద్ధిలో వైసీపీ పాత్ర ఏంటి..?

భూదందాలు, భూములను కొట్టేయడం తప్ప.. రాష్ట్రానికి వైసీపీ ఏం చేసిందని జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ ఏం చేసిందని అన్నారు. వైజాగ్ - చెన్నై పారిశ్రామిక కారిడార్ భూసేకరణ కూడా చెయ్యలేక పోయారని విమర్శించారు. ఈ కారిడార్ వస్తే విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని తెలపారు. రాజీనామాలు చేస్తాం అని చెప్పిన వారు... విశాఖ అభివృద్ధి మీద చేసిన అభివృద్ధి ఏమిటో టీడీపీ, వైసీపీలు శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ఈ రాష్ట్రంలో సొంత పార్టీని చూసుకోవడం మానేసి.. బీజేపీపై దృష్టి పెడుతూ.. రాజకీయ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. 

"బస్సు లోపల కూడా గొడుగు పట్టుకొని కూర్చోవాల్సిందే"

రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి బాగోలేదని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. చివరికి ఆర్టీసీ బస్సు లోపల కూర్చున్న ప్రయాణికులు కూడా గొడుగు పట్టుకుని కూర్చోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ఇదేనా అభివృద్ధి అంటే అని ప్రశ్నించారు. అందుకేనా 175కి 175 సీట్లు కావాలని అడుగుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. హిట్లర్ ను దృష్టిలో పెట్టుకుని జగన్ స్ఫూర్తి పొందుతునట్టు అనిపిస్తోందని విమర్శించారు. ఇక్కడ బట్టన్ నొక్కడం కాదు... కేంద్రం నుంచి బట్టన్ నొక్కితే జగన్ పని అయిపోతుందంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా నాయకులు రాజీనామా నాటకాలు ఆపాలని అన్నారు. 

చంద్రబాబు హైదరాబాద్‌లో, జగన్ తాడేపల్లిలో..

అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పిన చంద్రబాబు హైదరాబాద్‌లోనే కూర్చున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జగన్ అమరావతిలో ఉంటానని తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని మూడు రాజధానులు అంటున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఎందుకు మూడు రాజధానులు ఊసు ఎత్తలేదో చెప్పాలన్నారు. చైనా రాజధాని బీజింగ్ అయినప్పటికీ... షాంఘైని అభివృద్ధి చేస్తున్నారని... అలాగే విశాఖను అభివృద్ధి చేయచ్చు కదా అని చెప్పారు. రాయలసీమ వెనుక పడిందని... ఆ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కట్టుబడిందని సోము వీర్రాజు తెలిపారు. దసపల్లా భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టులో ఒక రివిజన్ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gaddar Film Awards: జూన్ 14న తెలంగాణలో గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సం- భట్టి విక్రమార్క, దిల్ రాజు
జూన్ 14న తెలంగాణలో గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సం- భట్టి విక్రమార్క, దిల్ రాజు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
Ram - Bhagyashri Borse: రామ్ ప్రేమలో భాగ్యశ్రీ... ఎంగేజ్మెంట్ జరిగిందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
రామ్ ప్రేమలో భాగ్యశ్రీ... ఎంగేజ్మెంట్ జరిగిందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Gujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?GT vs KKR IPL 2025 Match Review | డిఫెండింగ్ ఛాంపియన్ దమ్ము చూపించలేకపోతున్న KKRSai Sudharsan 52 vs KKR IPL 2025 | నిలకడకు మారు పేరు..సురేశ్ రైనా ను తలపించే తీరు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Film Awards: జూన్ 14న తెలంగాణలో గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సం- భట్టి విక్రమార్క, దిల్ రాజు
జూన్ 14న తెలంగాణలో గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సం- భట్టి విక్రమార్క, దిల్ రాజు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
Ram - Bhagyashri Borse: రామ్ ప్రేమలో భాగ్యశ్రీ... ఎంగేజ్మెంట్ జరిగిందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
రామ్ ప్రేమలో భాగ్యశ్రీ... ఎంగేజ్మెంట్ జరిగిందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
IPS PSR Anjaneyulu arrested: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
Viral Video: ఫోన్ తీసుకుందని లెక్చరర్‌కి చెప్పుతో కొట్టిన స్టూడెంట్ -  ఈ చదువులేం నేర్పుతున్నాయి ?
ఫోన్ తీసుకుందని లెక్చరర్‌కి చెప్పుతో కొట్టిన స్టూడెంట్ - ఈ చదువులేం నేర్పుతున్నాయి ? వీడియో
Mahesh Babu: మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!
మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!
AP Liquor Scam Case: నాతో పెట్టుకోవద్దు... బట్టలు విప్పిస్తా !: విజయసాయిరెడ్డి మాస్ వార్నింగ్
నాతో పెట్టుకోవద్దు... బట్టలు విప్పిస్తా !: విజయసాయిరెడ్డి మాస్ వార్నింగ్
Embed widget