అన్వేషించండి

AP Capital: సెప్టెంబర్ నుంచి విశాఖ వేదికగా పాలన, రాజధానికి టీడీపీ అనుకూలమా, వ్యతిరేకమా?- మంత్రి గుడివాడ అమర్నాథ్

AP Capital: సెప్టెంబర్ నుంచి విశాఖ రాజధానిగానే పరిపాలన కొనసాగుతుందని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. 

AP Capital: ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఏపీ రాజధాని అంశం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ నుంచి విశాఖ రాజధానిగానే పరిపాలన కొనసాగుతుందని చెప్పారు. వ్యవస్థలు అన్నీ విశాఖపట్నం నుంచే పని చేస్తాయని స్పష్టం చేశారు. అలాగే సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనను ఎక్కడి నుంచైనా నిర్వహించుకోవచ్చని చెప్పారు. మే 3వ తేదీన భోగాపురం విమానాశ్రయం పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని వివరించారు. అయితే విశాఖ రాజధానిగా ఉండేందుకు టీడీపీ అనుకూలమా, వ్యతిరేకమా అని ప్రశ్నించారు.

బాబు మాట ఎవరూ నమ్మరూ, అంతా జగన్ వెనుకే..!

" మీ కుటుంబాలకు నా తరఫున మంచి జరగకపోతే ఓటు వేయద్దు" అని సీఎం జగన్ ఈ మాట చెప్పారంటే... జనంలో ఆయనకు బలం ఉంది కాబట్టే అంత ధైర్యంగా ఆ మాట చెప్పారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్నిటినీ నెరవేర్చారు కాబట్టే ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికలలో వైసీపీకి 175 కి 175 సీట్లు గెలుస్తామన్న మనో నిబ్బరంతో జగన్ ఉన్నారని అన్నారు. డ్వాక్రా మహిళల రుణమాఫీ కోసం ప్రవేశపెట్టిన ఆసరా పథకం కింద కసింకోట మండలంలో 13 కోట్ల 31 లక్షల రూపాయల చెక్కును డ్వాక్రా మహిళలకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. జనానికి మేలు చేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఓటు అడుగుతున్నారని, చంద్రబాబు తన పదవీకాలంలో ప్రజలకు ఏం మేలు చేశాడని ఓటు అడగడానికి వస్తున్నాడని ప్రశ్నించారు. గత ఎన్నికలకు ముందు పసుపు, కుంకుమ కింద డబ్బులు బ్యాంకులో జమ చేస్తున్నామని చెప్పిన చంద్రబాబు ఆ మొత్తాన్ని డ్వాక్రా మహిళలు వినియోగించుకోలేని విధంగా ఆదేశాలు జారీ చేశాడంటే ఆయన ఎంత మోసగాడో అర్థం చేసుకోవచ్చని అన్నారు.  

175 స్థానాల్లో చంద్రబాబు పోటీ చేస్తారా?

పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు మోసం చేస్తే... ఉప్పు, కారంతో ఆయనకు మహిళలు బుద్ధి చెప్పారని అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా లేక వివిధ పార్టీలతో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడని, అటువంటి వ్యక్తి గురించి జనం ఆలోచించాల్సిన అవసరం లేదని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. జనానికి మేలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న విపక్షాలు చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మొద్దని గుడివాడ అమర్నాథ్ కోరారు.

పేద, బడుగు, బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రెండు లక్షల 96 వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని, స్వతంత్ర వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని పాలించిన ఏ ముఖ్యమంత్రి అయిన ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేశారా? అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 65 లక్షల మందికి ప్రతి నెల ఇళ్లకే పింఛన్ అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Budget 2025-26:మూడున్నర లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌- పూర్తి వివరాలు ఇవే
మూడున్నర లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌- పూర్తి వివరాలు ఇవే
Chandrababu new concept: పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
Sabdham Movie Review - 'శబ్దం' రివ్యూ: బొమ్మ భయపెట్టేలా ఉందా? ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ హిట్టేనా?
'శబ్దం' రివ్యూ: బొమ్మ భయపెట్టేలా ఉందా? ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ హిట్టేనా?
Viral Video: టీమిండియాకి గుడ్ న్యూస్.. వేగంగా కోలుకుంటున్న స్పీడ్ స్ట‌ర్ బుమ్రా.. తాజా వీడియో వెలుగులోకి..
టీమిండియాకి గుడ్ న్యూస్.. వేగంగా కోలుకుంటున్న స్పీడ్ స్ట‌ర్ బుమ్రా.. తాజా వీడియో వెలుగులోకి..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pastor Ajay Babu Exclusive Interview | చర్చిల విషయంలో ప్రభుత్వానికి పాస్టర్ అజయ్ సంచలన ప్రతిపాదన | ABP DesamAfg vs Eng Match Highlights | Champions Trophy 2025 | ఐసీసీ టోర్నీల్లో పనికూనల ఫేవరెట్ ఇంగ్లండ్ | ABP DesamAFG vs ENG Match Highlights | Champions Trophy 2025 లో పెను సంచలనం | ABP DesamGV Harsha Kumar on MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై హర్ష కుమార్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Budget 2025-26:మూడున్నర లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌- పూర్తి వివరాలు ఇవే
మూడున్నర లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌- పూర్తి వివరాలు ఇవే
Chandrababu new concept: పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
Sabdham Movie Review - 'శబ్దం' రివ్యూ: బొమ్మ భయపెట్టేలా ఉందా? ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ హిట్టేనా?
'శబ్దం' రివ్యూ: బొమ్మ భయపెట్టేలా ఉందా? ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ హిట్టేనా?
Viral Video: టీమిండియాకి గుడ్ న్యూస్.. వేగంగా కోలుకుంటున్న స్పీడ్ స్ట‌ర్ బుమ్రా.. తాజా వీడియో వెలుగులోకి..
టీమిండియాకి గుడ్ న్యూస్.. వేగంగా కోలుకుంటున్న స్పీడ్ స్ట‌ర్ బుమ్రా.. తాజా వీడియో వెలుగులోకి..
Hyderabad Central University: హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణంలోని భవనం - వెంట్రుకవాసిలో తప్పించుకున్న కార్మికులు
హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణంలోని భవనం - వెంట్రుకవాసిలో తప్పించుకున్న కార్మికులు
Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
Embed widget