అన్వేషించండి

AP Ministers Bus Tour: శ్రీకాకుళం టు అనంతపురం- నేటి నుంచే ఏపీ మంత్రుల బస్సు యాత్ర

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేయడానికి ఏపీ మంత్రులు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇవాళ మొదలయ్యే ఈ యాత్ర నాలుగు రోజులు సాగనుంది.

వైసీపీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయభేరి పేరిట బస్సు యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. శ్రీకాకుళం జిల్లాలో యాత్ర స్టార్ట్ కానుంది. ఇందులో మొత్తం 17 మంది మంత్రులు పాల్గొంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించనున్నారు. 

నాలుగు రోజుల పాటు సాగే ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు పాల్గొంటారు. ఇవాళ మొత్తం శ్రీకాకుళం, విజయనగరంలోజిల్లాల్లో పర్యటించి బహిరంగ సభల్లో పాల్గొంటారు. రేపు విశాఖ ఇలా రోజుకో జిల్లాలో పర్యటించి ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తారు. నాలుగు రోజులు సాగే ఈ బస్సు యాత్ర విజయనగరం, రాజమండ్రి, నరసారావుపేట, అనంతపురం జిల్లాలో సాగనుంది.  


బహిరంగ సభలు ఇవే
ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం జిల్లా ఏడు రోడ్ల కూడలిలో యాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు విజయనగరం రాజీవ్ గాంధీ స్టేడియంలో బహిరంగ సభ ఉంటుంది. శుక్రవారం 9 గంటలకు విశాఖ పాత గాజువాక జంక్షన్‌ నుంచి రెండో రోజు యాత్ర స్టార్ట్ అవుతుంది. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్‌ వద్ద బహిరంగ సభ ఉంటుంది. మూడో రోజు అంటే శనివారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి గూడెంలో యాత్ర పునఃప్రారంభమవుతుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పల్నాడు బస్టాండ్‌లో బహిరంగ సభ ఉంటుంది. చివరి రోజు ఆదివారం.. నంద్యాల నుంచి బస్సు యాత్ర మొదలవుతుంది. అదే రోజు సాయంత్ర నాలుగు గంటలకు అనంతపురంలోని మున్సిపల్‌ ఆఫీస్‌ సెంటర్‌లో భారీ బహిరంగ సభ ఉంటుంది. దీంతో యాత్ర ముగుస్తుంది. 

యాత్ర సాగేదిలా

కాసేపట్లో శ్రీకాకుళం జిల్లా ఏడు రోడ్ల కూడలి నుంచి యాత్ర స్టార్ట్ కానుంది. వైఎస్‌ విగ్రహానికి పూల మాల వేసి యాత్రను ప్రారంభిస్తారు మంత్రులు. తొలి రోజు యాత్ర ఎచ్చెర్ల, రణస్థలం మీదుగా విజయనగరం చేరుకుంటుంది. రేపు విశాఖలో సాగనుందీ యాత్ర. విశాఖలో గాజువాక, లంకెలపాలెంకూడలి, అనకాపల్లి జంక్షన్‌, తాళ్లపాలెం జంక్షన్‌, యలమంచిలి వై జంక్షన్‌, నక్కపల్లి, కత్తిపూడి, జగ్గంపేట మీదుగా రాజమండ్రిలోకి ఎంటర్‌ అవుతుంది. రాత్రికి తాడేపల్లిగూడెంలో బస చేస్తారు మంత్రులు. మూడో రోజు అంటే 28న ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలను కవర్ చేస్తారు. ఆఖరి రోజు 29న కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలను కవర్ చేసి యాత్ర ముగిస్తారు.  

ఈ బస్సు యాత్రలో మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాద రావు, బొత్స సత్యనారాయణ, వేణుగోపాల్, రాజన్నదొర,  ముత్యాలనాయుడు, పినిపె విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, నారాయణ స్వామి, తానేటి వనిత, జోగి రమేష్, మేరుగ నాగార్జున, విడదల రజనీ, అంజాద్ బాషా, గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్, ఉషశ్రీ చరణ్ పాల్గొంటారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Botsa Anusha Political Entry: రాజకీయాల్లోకి బొత్స సత్యనారాయణ వారసురాలు అనూష.. ఎన్నికల్లో పోటీపై సైతం ప్రకటన
రాజకీయాల్లోకి బొత్స సత్యనారాయణ వారసురాలు అనూష.. ఎన్నికల్లో పోటీపై సైతం ప్రకటన
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Embed widget