అన్వేషించండి

AP Ministers Bus Tour: శ్రీకాకుళం టు అనంతపురం- నేటి నుంచే ఏపీ మంత్రుల బస్సు యాత్ర

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేయడానికి ఏపీ మంత్రులు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇవాళ మొదలయ్యే ఈ యాత్ర నాలుగు రోజులు సాగనుంది.

వైసీపీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయభేరి పేరిట బస్సు యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. శ్రీకాకుళం జిల్లాలో యాత్ర స్టార్ట్ కానుంది. ఇందులో మొత్తం 17 మంది మంత్రులు పాల్గొంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించనున్నారు. 

నాలుగు రోజుల పాటు సాగే ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు పాల్గొంటారు. ఇవాళ మొత్తం శ్రీకాకుళం, విజయనగరంలోజిల్లాల్లో పర్యటించి బహిరంగ సభల్లో పాల్గొంటారు. రేపు విశాఖ ఇలా రోజుకో జిల్లాలో పర్యటించి ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తారు. నాలుగు రోజులు సాగే ఈ బస్సు యాత్ర విజయనగరం, రాజమండ్రి, నరసారావుపేట, అనంతపురం జిల్లాలో సాగనుంది.  


బహిరంగ సభలు ఇవే
ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం జిల్లా ఏడు రోడ్ల కూడలిలో యాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు విజయనగరం రాజీవ్ గాంధీ స్టేడియంలో బహిరంగ సభ ఉంటుంది. శుక్రవారం 9 గంటలకు విశాఖ పాత గాజువాక జంక్షన్‌ నుంచి రెండో రోజు యాత్ర స్టార్ట్ అవుతుంది. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్‌ వద్ద బహిరంగ సభ ఉంటుంది. మూడో రోజు అంటే శనివారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి గూడెంలో యాత్ర పునఃప్రారంభమవుతుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పల్నాడు బస్టాండ్‌లో బహిరంగ సభ ఉంటుంది. చివరి రోజు ఆదివారం.. నంద్యాల నుంచి బస్సు యాత్ర మొదలవుతుంది. అదే రోజు సాయంత్ర నాలుగు గంటలకు అనంతపురంలోని మున్సిపల్‌ ఆఫీస్‌ సెంటర్‌లో భారీ బహిరంగ సభ ఉంటుంది. దీంతో యాత్ర ముగుస్తుంది. 

యాత్ర సాగేదిలా

కాసేపట్లో శ్రీకాకుళం జిల్లా ఏడు రోడ్ల కూడలి నుంచి యాత్ర స్టార్ట్ కానుంది. వైఎస్‌ విగ్రహానికి పూల మాల వేసి యాత్రను ప్రారంభిస్తారు మంత్రులు. తొలి రోజు యాత్ర ఎచ్చెర్ల, రణస్థలం మీదుగా విజయనగరం చేరుకుంటుంది. రేపు విశాఖలో సాగనుందీ యాత్ర. విశాఖలో గాజువాక, లంకెలపాలెంకూడలి, అనకాపల్లి జంక్షన్‌, తాళ్లపాలెం జంక్షన్‌, యలమంచిలి వై జంక్షన్‌, నక్కపల్లి, కత్తిపూడి, జగ్గంపేట మీదుగా రాజమండ్రిలోకి ఎంటర్‌ అవుతుంది. రాత్రికి తాడేపల్లిగూడెంలో బస చేస్తారు మంత్రులు. మూడో రోజు అంటే 28న ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలను కవర్ చేస్తారు. ఆఖరి రోజు 29న కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలను కవర్ చేసి యాత్ర ముగిస్తారు.  

ఈ బస్సు యాత్రలో మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాద రావు, బొత్స సత్యనారాయణ, వేణుగోపాల్, రాజన్నదొర,  ముత్యాలనాయుడు, పినిపె విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, నారాయణ స్వామి, తానేటి వనిత, జోగి రమేష్, మేరుగ నాగార్జున, విడదల రజనీ, అంజాద్ బాషా, గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్, ఉషశ్రీ చరణ్ పాల్గొంటారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget