అన్వేషించండి

3 Capitals Of AP: అప్పటిలోపే ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం: మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

3 Capitals Of AP: 2024 లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, అంతకుముందే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలో జరగనున్న ఏపీ కేబినెట్ భేటీలో ఈ కీలక అంశంపై చర్చిస్తామని తెలిపారు. 

AP Minister Gudivada Amarnath on 3 capitals:  వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలలో 90 హామీలు నేరవేర్చిందని ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. ఇంకా సమయం ఉన్నందున మిగిలిన హామీలను సైతం ఒక్కొక్కటిగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తామన్నారు. 2024 లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, అంతకుముందే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలో జరగనున్న ఏపీ కేబినెట్ భేటీలో ఈ కీలక అంశంపై చర్చిస్తామని తెలిపారు. 

ఏపీ ప్రాజెక్టులు వద్దని లేఖలు రాస్తారా ?
బల్క్ డ్రగ్ పార్క్ ఏపీకి వస్తుంటే అంతా సంతోషిస్తున్నారని.. కానీ టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల అది వద్దంటూ కేంద్రానికి లేఖ రాయడాన్ని మంత్రి అమర్‌నాథ్ తప్పుపట్టారు. దావోస్ సదస్సులో ఏపీలో పరిశ్రమల స్థాపనతో పాటు నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దడానికి విదేశీ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఎన్నో ఒప్పందాలు చేసుకుందన్నారు. ఫార్మా రంగానికి హబ్‌గా ఏపీ మారబోతోందని, ఏ పరిశ్రమ వచ్చినా డెవలప్‌మెంట్ కోసం తాము వారిని స్వాగతిస్తామని చెప్పారు. అమర్‌రాజా సంస్థపై వచ్చిన ఫిర్యాదులపై పీసీబీ విచారణ జరిపి నిర్ధారిస్తే టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. 

విభజన హామీలను కేంద్రానికి తాకట్టుపెట్టిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు, మాజీ మంత్రి యనమల ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి అమర్‌నాథ్ మండిపడ్డారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం సైతం ప్రజల కోసం అప్పులు తెస్తుందని, కానీ వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తుంటే మాత్రం.. ప్రతిపక్ష టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఏపీకి అప్పులు ఇవ్వొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు, ప్రముఖ బ్యాంకులకు లేఖలు రాశారని విమర్శించారు. 

ఈ 7న ఏపీ కేబినెట్ భేటీ
ఏపీ కేబినెట్ భేటీ సెప్టెంబర్ 7కు వాయిదా పడింది. మొదట సెప్టెంబర్ 1న కేబినెట్ భేటీ అనుకున్నారు. కానీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan Mohan Reddy) మూడు రోజుల కడప జిల్లా పర్యటన కారణంగా మంత్రివర్గ సమావేశాన్ని సెప్టెంబర్ 7కు వాయిదా వేశారు. సెప్టెంబర్ 1న గన్నవరం విమానాశ్రయం నుంచి కడప జిల్లాకు వెళ్లిన సీఎం జగన్.. 2వ తేదీ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రి వైఎస్సార్‌కు ఘన నివాళి అర్పించారు. ప్రేయర్ హాల్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అర్ధరాత్రి అక్కడే బస చేసిన సీఎం వైఎస్ జగన్ నేటి ఉదయం 9 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నట్లు సమాచారం.

Also Read: Face Recognition Attendance: టీచర్లకు ముఖ ఆధారిత హాజరు ఉన్నట్లా, లేనట్టా - అసలేం జరుగుతోంది ! నెగ్గేదెవరు

Also Read: Sajjala On Chandrababu : చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అడ్డదారిన సీఎం అయ్యారు- సజ్జల రామకృష్ణారెడ్డి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget