అన్వేషించండి

Anakapalli: వివాదంలో డీఎస్పీ, స్మగ్లర్ వాడిన కారులో షికారు! ఆ ఘటనతో అసలు విషయం బయటికి

అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన గతేడాది జులైలో జరిగింది.

అనకాపల్లిలో డీఎస్పీగా పని చేస్తున్న బి. సునీల్ కుమార్ వివాదంలో ఇరుక్కున్నారు. ఓ స్మగ్లర్ వినియోగించిన వాహనంలో తిరుగుతూ దొరికిపోయారు. కొంత కాలం క్రితం ఆ కారు ఓ గంజాయి కేసులో పట్టుబడింది. సీజ్ చేసిన ఆ వాహనంలో తన కుటుంబ సభ్యులతో కలిసి షికారుకి వెళ్లి, అదే కేసులో పట్టుబడిన మరో కారు నంబర్ ప్లేటు తీసి దీనికి అంటించారు. అలా ఆ కారులో బయటికి వెళ్లిన సందర్భంలో విశాఖపట్నం బీచ్ వద్ద ఓ వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ విషయం మొత్తం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీజ్ చేసిన కారుని డీఎస్పీ తన పనులకు సొంతానికి వాడుకుంటున్నారని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

గతేడాది ఓ గంజాయి కేసులో పట్టుబడ్డ కారు
అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన గతేడాది జులైలో జరిగింది. పోలీసులు అడ్డగించగానే వాళ్లు ఆ కారుని అక్కడే వదిలేసి పారిపోయారు. పోలీసులు ఆ కారును సీజ్‌ చేసి, పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఆ కారు ఎవరి పేరు మీద ఉందన్న విషయంపై ఆరా తీయగా జి.మాడుగులకు చెందిన సుల్తాన్‌ అజాహరుద్దీన్‌ పేరుతో రిజిస్టరు అయి ఉన్నట్లు గుర్తించారు. 

ఈ కేసు విచారణలో భాగంగా రాజస్థాన్‌కు చెందిన సింగ్‌ అనే వ్యక్తి జి.మాడుగులలోనే ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అతడు గతేడాది నవంబర్ 11న పోలీస్ స్టేషన్‌కి వచ్చిన సందర్భంలో విచారణ చేసి అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో తాను వేసుకొచ్చిన కారుని తన తల్లికి అప్పగించాలని అతడు కోరాడు. అయితే, ఆమె రాజస్థాన్ వెళ్లిపోయారని తెలియడంతో, ఆ కారుని అనకాపల్లి గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచారు. అప్పటి నుంచి పోలీసులు దాన్ని వాడుతూ ఉన్నారు. 

ఈ క్రమంలోనే ఈనెల 1వ తేదీన డీఎస్పీ బి. సునీల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ కారులో విశాఖపట్నం వెళ్లారు. బీచ్‌ రోడ్డులో ఆయన ఒక వాహనాన్ని ఢీకొట్టారు. అక్కడున్న కొంత మంది సోషల్ మీడియా ప్రియులు ఆ ఢీకొన్న దృశ్యాల్ని సెల్‌ ఫోన్‌లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ కారు బండారం అంతా బయటికి వచ్చింది. 

ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ గౌతమి స్పందించారు. ‘డీఎస్పీ సునీల్‌ గంజాయి కేసులో పట్టుబడ్డ నిందితుడి కారును వినియోగించినట్లుగా తమ దృష్టికి వచ్చిందని అన్నారు. నిందితుడి కారును సొంతానికి వాడుకోవడం ఒక నేరమైతే, నంబరు ప్లేటు మార్చడం మరో తప్పు అని ఆమె అన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారని, పూర్తి రిపోర్టును వారికి పంపుతామని తెలిపారు. అయితే, ఆ కారు నంబర్ ప్లేట్ మార్చిన విషయం తనకు తెలియదని డీఎస్పీ సునీల్ చెప్పారు. తాను ఆసుపత్రికి వెళ్లాలంటే, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆ కారుని పంపారని, తాను ఉద్దేశపూర్వకంగా కారును తీసుకువెళ్లలేదని చెప్పుకొచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget