అన్వేషించండి

Minister Gudivada Amarnath : అమరావతి పెయిడ్ ఆర్టిస్టులు పాదయాత్ర విరమించాలి- మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : అమరావతి పెయిడ్ ఆర్టిస్టులు పాదయాత్ర విరమించాలని మంత్రి అమర్ నాథ్ కోరారు.

Minister Gudivada Amarnath : వికేంద్రీకరణకు మద్దతుగా ఈ నెల 15వ తేదీన నిర్వహించే విశాఖ గర్జనను విజయవంతం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. మద్దిలపాలెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంత్రి అమర్నాథ్ , మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఆదివారం సమావేశమై గర్జన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ గర్జనకు రైతుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించిందన్నారు. సోమవారం రైతులు విశాఖకు వచ్చి వారి మద్దతు తెలియజేస్తారని ఆయన చెప్పారు. అలాగే బార్ అసోసియేషన్, ట్రేడ్ యూనియన్స్, నర్సింగ్ స్టాఫ్, డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు విశాఖ గర్జనకు మద్దతు తెలియజేశారని అమర్నాథ్ వివరించారు. 

పెయిడ్ ఆర్టిస్టుల యాత్ర విరమించాలి 

మూడు రాజధానులతో మూడు ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని మంత్రి అమర్నాథ్ పునరుద్ఘాటించారు. విశాఖ గర్జనను విజయవంతం చేసి, విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలన్న ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను, రాష్ట్రం నలు దిక్కులకు తెలియజేయాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా రైతుల పాదయాత్ర పేరుతో  పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్న యాత్రను విరమించుకోవాలని, యాత్ర విరమించుకునే వరకు విజ్ఞప్తి చేస్తూనే ఉంటామన్నారు.  ఈ యాత్రకు కర్త-కర్మ-క్రియ అయినడిపిస్తున్న చంద్రబాబు నాయుడు వాస్తవ పరిస్థితులను గ్రహించి యాత్రను విరమింపచేయాలని సూచించారు. విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీ అని ప్రముఖులు ఏనాడో గుర్తించారని, అన్ని రకాల అవకాశాలున్న విశాఖ నగరాన్ని రాజధానిగా చేయడానికి చంద్రబాబు ఎందుకు అంగీకరించడంలేదో చెప్పాలని  ప్రశ్నించారు. 

బీజేపీ, టీడీపీకి ఉత్తరాంధ్ర అంటే చులకన 

వికేంద్రీకరణకు మద్దతుగా ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలపై తెలుగుదేశం, బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యల పట్ల అమర్నాథ్ స్పందిస్తూ ఉత్తరాంధ్ర ప్రజలన్నా, ప్రజాప్రతినిధులన్నా, ఈ రెండు పార్టీల  నాయకులకు చులకన అన్నారు. చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నప్పుడు మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ఆ రాష్ట్రాల్లో కొత్తగా రాజధానులు నిర్మించలేదన్నారు. ఉన్న నగరాలను అభివృద్ధి చేసి రాజధానులుగా కొనసాగిస్తున్న విషయం చంద్రబాబుకు తెలియదా? అని  ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న టీడీపీ, బీజేపీ అధినాయకులకు ఆ పార్టీలకు చెందిన ఈ ప్రాంత నాయకులు ఎలా ఊడిగం చేస్తున్నారని అమర్నాథ్ ప్రశ్నించారు.

చంద్రబాబు డైరెక్షన్ లో పాదయాత్ర 

విశాఖ రాజధానిగా ఎందుకు వద్దంటున్నారో టీడీపీ నేతలు ప్రజలకు చెప్పాలని మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రశ్నించారు. జేఏసీ కార్యాచరణకు అనుగుణంగానే విశాఖ గర్జన ర్యాలీ జరుగుతుందని తెలిపారు. రైతు సంఘాలు, విద్యార్థులు, న్యాయవాదులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారని తెలిపారు.టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లోనే అమరావతి పాదయాత్ర నడుస్తోందని ఆరోపించారు. పెయిడ్‌ ఆర్టిస్టులు తమ యాత్రను విరమించుకోవాలని మంత్రి కోరారు.  అని స్పష్టం చేశారు.

Also Read : Kanaparthi News: కనపర్తి వాసుల నిరసన, ఎమ్మెల్యే గారు మా ఊరికి రావొద్దంటూ ప్లకార్డులు!

Also Read : సీఎం  జగన్‌పై యనమల విమర్శలు - పిల్లి శాపాలు అంటున్న ఆర్థిక మంత్రి బుగ్గన

టాప్ హెడ్ లైన్స్

AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget