అన్వేషించండి

Somu Veerraju : ప్రధాని మోదీ సభలో పవన్ పాల్గొంటారా? సోము వీర్రాజు ఏమన్నారంటే?

Somu Veerraju : అమరావతి రాజధానికే బీజేపీ కట్టుబడి ఉందని సోము వీర్రాజు తెలిపారు. ప్రధాని విశాఖ పర్యటన వివరాలను ఆయన తెలిపారు.

Somu Veerraju : ప్రధాని మోదీ ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనలో పార్టీ పరంగా కార్యక్రమాలకు ఏపీ బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది. విశాఖలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రధాని పర్యటనపై మాట్లాడారు. ప్రధాని మోదీ ఈనెల 11 సాయంత్రం 6:25 కు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారన్నారు. పార్టీ తరపున ఘన స్వాగతం పలికి, అనంతరం రోడ్ షో నిర్వహిస్తామన్నారు. ఇవాళ సాయంత్రానికి అధిష్ఠానం  రోడ్ షో మార్గాన్ని నిర్ణయిస్తుందన్నారు. తాము రెండు రూట్లు పంపామని, ఒకటి ఎన్ఎడి వద్ద పాత ఐటిఐ నుంచి, రెండోది బీచ్ రోడ్ అన్నారు. 12వ తేదీ ఉదయం ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్ లో పలు కేంద్ర ప్రభుత్వ పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉంటాయన్నారు. బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతారని సోము వీర్రాజు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 12.15 కు ప్రధాని మోదీ తెలంగాణకు బయలుదేరివెళతారన్నారు. 

విపక్షాలపై అణచివేత చర్యలు 

కేంద్రం ఇంతకాలం ఎన్నో పథకాలకు నిధులు ఇచ్చిందని సోము వీర్రాజు అన్నారు. ఆ పథకాలను ప్రధాని దేశానికి అంకితం చేస్తారని తెలిపారు. రాష్ట్ర పరంగా ఏ అభివృద్ధి లేదన్నది స్పష్టం అయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం విపక్షాల మీద అణచివేత చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఏపీలో అయిదువేల ఎస్సీ బస్తీల్లో సంపర్క్ అభియాన్  కార్యక్రమం నిర్వహిస్తున్నామని సోము వీర్రాజు అన్నారు. కడప జిల్లాలో ఎస్సీలు ఈ అభియాన్ కు తరలి వస్తే అధికార పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించారు. దీనిపై పోరాడుతామన్నారు.  

పవన్ ను పిలుస్తారా? 

ఏపీ రాజధాని అమరావతికే బీజేపీ కట్టుబడి ఉందని సోము వీర్రాజు తెలిపారు. రాజధానిపై మరో వివాదానికి తావు లేదని స్పష్టం చేశారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని వైసీపీపై మండిపెట్టారు.  ఈనెల 11న విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నారని, ఈ పర్యటన వివరాలను ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుతో కలిసి సోము వీర్రాజు మీడియాకు తెలిపారు. ప్రధాని పర్యటన వివరాలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ముందే ప్రకటించారని మీడియా ప్రతినిధులు ఆయనను అడిగారు. కేంద్రం చేస్తున్న అభివృద్ధిపై క్రెడిట్‌ కొట్టేసేందుకు వైసీపీ తొందరపడుతోందన్నారు. ప్రధాని సభకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను పిలుస్తారా? అని అడిగిన ప్రశ్నకు సోము వీర్రాజు సమాధానం దాటవేశారు.  

స్టీల్ ప్లాంట్ అంశం ముగిసిన విషయం 
 
విశాఖలో ఏ అభివృద్ధి చేసినా అది కేంద్ర నిధులతో జరిగినది మాత్రమే అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. మోదీ సభకు రావటానికి అన్ని రాజకీయ పక్షాలూ ఆసక్తి చూపుతున్నాయన్నారు. హోదా, స్టీల్ ప్లాంటు వంటి అంశాలు గడిచిపోయిన విషయాలు అన్నారు. ప్రస్తుతం అభివృద్ధి అజెండా నడుస్తోందన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget