Jogi Ramesh Bail: "చంద్రబాబు, లోకేష్ మీకూ కుటుంబం ఉంది జాగ్రత్త" నకిలీ మద్యం కేసులో బెయిల్పై విడుదలైన తర్వాత జోగి రమేష్ వార్నింగ్
Jogi Ramesh Bail: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులు బెయిల్పై విడుదలయ్యారు. నకిలీ మద్యం కేసుల వాళ్లిద్దరు 80 రోజులకుపైగా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

Jogi Ramesh Bail: ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ లీడర్లు జోగి రమేష్ ఆయన సోదరుడు రాముకు ఊరట లభించింది. ఈ వివాదంలో వీళ్లిద్దరిపై రెండు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే భవానీపురం కేసులో బెయిల్ మంజూరు అయ్యింది. అయినా కడప జల్లా ములకల చెరువు కేసులో విచారణ కొనసాగతున్నందున విడుదల కాలేదు. ఇప్పుడు ఆ కేసులో కూడా బెయిల్ రావడంతో 83 రోజలు తర్వాత విడుదలయ్యారు. విడుదలైన అనంతరం చంద్రబాబుపై విమర్శలు చేశారు.
విజయవాడ..
— YSRCP Legal Cell (@YSRCPLegalCell) January 23, 2026
నకిలీ మద్యం అక్రమ అరెస్ట్ కేసులో జోగి రమేష్ సోదరులకు ఊరట
జోగి రమేష్ , ఆయన సోదరుడు జోగి రాముకు బెయిల్ మంజూరు చేసిన తంబళ్లపల్లి కోర్టు
ఇప్పటికే భవానీపురంలో నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేసిన విజయవాడ ఎక్సైజ్ కోర్టు
రెండు కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదల… pic.twitter.com/yH8w4WALve
చంద్రబాబు కక్ష పూరితంగానే వైసీపీ నేతలను జైల్లో పెట్టారని తనను కూడా వేధించారని జోగి రమేష్ అన్నారు. తన కుటుంబంపై కూడా కేసులు పెట్టారని చెప్పారు. చంద్రబాబుకు, లోకేష్కి కూడా కుటుంబం ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తనను విచారించిన, జైల్లో హింసించిన అధికారులను కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు.
ఉమ్మడి కడప జిల్లా ములకల చెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహింపట్నంలో రెండు ప్రాంతాల్లో గత ఏప్రిల్లో భారీగా నకిలీ మద్యం పట్టుబడింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు కీలక నిందితులను అరెస్టు చేశారు. వారిలో జనార్దన్ రావు ఒకరు. అతన్ని విచారిస్తే జోగి రమేష్తో సంబంధాలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. అనంతరం జోగి రమేష్ సోదరులు ఇద్దరూ ఈ కేసుల్లో భాగమై ఉన్నారని గుర్తించిన అధికాలు వారిపై కేసులు నమోదు చేశారు. విచారణ చేసిన తర్వాత నవంబర్లో ఇద్దర్ని అరెస్టు చేసింది. అప్పటి నుంచి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. నాలుగు రోజుల క్రితం ఒక కేసులో బెయిల్ మంజూరు అయ్యింది. ఇవాళ మరో కేసులో బెయిల్ మంజూరు అయ్యింది. దీంతో జోగి రమేష్ సోదరులు బెయిల్పై విడుదలయ్యారు.
బెయిల్పై విడుదలైన జోగి రమేష్ సోదరులకు వైసీపీ నేతలు స్వాగతం పలికారు. విజయవాడకు చెందిన నేతలంతా జైలు వద్దకు వెళ్లి జోగి రమేష్ను కలుసుకున్నారు. వాళ్లందరితో వస్తూ వస్తూనే మీడియాతో మాట్లాడారు జోగి రమేష్. ప్రభుత్వంపై ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















