అన్వేషించండి

YS Sharmila And YS Jagan: షర్మిలతో ఆస్తుల తగాదాపై వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయం- వివాదం ముగిస్తున్నట్టు ట్వీట్

YSRCP News: షర్మిలతో జరుగుతున్న ఆస్తి తగాదాలపై కోర్టుల్లో తేల్చుకుంటామని బహిరంగంగా మాట్లాడొద్దని పార్టీ నేతలకు, శ్రేణులకు వైఎస్‌ఆర్‌సీపీ స్పష్టం చేసింది. ప్రజాసమస్యలపై ఫోకస్ చేయాలని సూచించింది.

YS Sharmila And YS Jagan Fight: నాలుగు రోజులుగా జరుగుతున్న వివాదానికి పుల్‌స్టాప్ పెట్టేందుకు వైఎస్‌ఆర్‌సీపీ నిర్ణయించింది. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయొద్దని శ్రేణులకు, పార్టీ నేతలకు పిలుపునిచ్చింది. షర్మిలతో వివాదంపై కోర్టుల్లోనే తేల్చుకుంటామని స్పష్టం చేసిందని ప్రకటించింది.  

ట్రైబ్యునల్‌లో కేసు విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈ దుమారం సాగుతోంది. ఇరు వర్గాల నుంచి మాటల తూటాలు పేలాయి. అటు నుంచి షర్మిల ఒక్కరే మాట్లాడుతుంటే... ఇటు నుంచి జగన్ ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది. సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, వైసీపీ పత్రిక ఇలా అందరూ మూకుమ్మడి దాడి చేశారు. ఇంకా వివాదం ముదురుతుండటంతో పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించి వైసీపీ ఇకపై దీనిపై మాట్లాడకూడదని నిర్ణయించింది. 

ఇదంతా పథకం ప్రకారం జరుగుతన్నట్టు ఆరోపిస్తూ ప్రజలకు గొంతుకగా నిలుద్దామని పిలుపునిచ్చింది. ప్రభుత్వం కావాలనే ప్రజాసమస్యలను డైవర్ట్ చేయడానికే ఇలాంటి కుటుంబ గొడవలను తెరపైకి తీసుకొచ్చిందని వైసీపీ ఆరోపించింది. వైఎస్‌ఆర్‌సీపీ తన ఎక్స్ అకౌంట‌్లో ఏం రాసుకొచ్చింది అంటే..." జగన్‌ ఇంతే చేశాడు.. మేం అంతకన్నా ఎక్కువ చేస్తామంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా, అంతకుముందు అమల్లో ఉన్న పథకాలg ఎత్తివేయడమే కాదు, కొత్తగా వారు చెప్పిన ఒక్క పథకమూ అమలు చేయడంలేదు. కొత్తగా ప్రజలకు చేసింది ఏమీ లేదు. అన్నిరంగాల్లో తిరోగమనమే కనిపిస్తోంది.

మరోవైపు మహిళలకు రక్షణకూడా లేని పరిస్థితులు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం, సూపర్‌ 6- సూపర్‌ 7లు మోసాలే అయిన పరిస్థితులు, విద్య, వైద్యం, వ్యవసాయం, డోర్‌డెలివరీ గవర్నెన్స్‌ ఇలా అన్నీ పడకేసిన పరిస్థితులు, వీటికితోడు ఉచిత పంటలబీమాకు మంగళం, కరెంటు ఛార్జీల బాదుడు. ఓవైపు ఇవి చేస్తూ మరోవైపు ఇసుక, లిక్కర్‌ స్కాం, వరద సహాయంలో అంతులేని అవినీతికి పాల్పడుతోంది.

దీనికితోడు ప్రజల పట్ల తన తన బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయంలో విఫలమై, ప్రజల దృష్టిని మళ్లించడానికి, తాను చేయాల్సిన బాధ్యతలనుంచి తప్పించుకోవడానికి కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోంది. ప్రజలకు సంబంధంలేని అంశాలను తెరమీదకు తెచ్చి, తన సొంత మీడియా బలంతో దానికి విపరీత ప్రచారం కల్పించి, జగన్‌ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి బురదజల్లుడు రాజకీయాలు చేస్తోంది.  

జూన్‌లో రుషికొండ భవనాలు అని, జులైలో శ్వేతపత్రాలు అని, మదనపల్లె ఫైల్స్‌ అని, ఆగస్టులో ముంబైనటి వ్యవహారం అని, సెప్టెంబరులో బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారని, శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో కల్తీ నేయి కలిసిందని తప్పుడు ప్రచారాలు చేస్తే, ఈ అక్టోబరులో వైఎస్ఆర్‌ కుటుంబంలో వ్యవహారాన్ని లక్ష్యంగా చేసుకుని వక్రీకరణలతో విషప్రచారాలు చేసింది. 

ఈ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టి, ప్రజలకు వాస్తవాలను వెల్లడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే క్రమంలో వైఎస్‌ఆర్‌ కుటుంబంలో వ్యక్తిగత అంశాలనూ కూడా రచ్చకీడ్చి, వాటిని వక్రీకరించి జగన్‌ ప్రతిష్ట దెబ్బతీయాలనే చంద్రబాబు, ఆయన మీడియా దుర్భుద్దిని ఎండగట్టక తప్పలేదు. ఈ అంశంపై అన్ని వివరాలను ఇప్పటికే ప్రజలముందు ఉంచాం, ఉన్నాయి. ఇప్పుడు ఎవరిది మంచి? ఎవరిది చెడు? అన్నది ప్రజలే నిర్ణయించుకుంటారు. అంతేకాకుండా ఈ వ్యవహారం న్యాయస్థానాల్లో ఉన్నందున, ఇక వాదనలు ఏవైనా కోర్టుల్లోనే చేసుకునే వెసులుబాటు ఎవరికైనా ఉన్నందున, దీనికి ఇక్కడితో ముగింపు పలకాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. 

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ఆర్ సీపీ జెండా, అజెండా ప్రజలే. కష్టనష్టాల్లో వారికి తోడుగా ఉంటూ నిరంతరం ప్రజల గొంతుకై నిలుస్తోంది. ప్రజాసంబంధిత అంశాలే ప్రాధాన్యతగా, కూటమి ప్రభుత్వ నయవంచనలను ప్రశ్నిస్తూ, నిలదీయడంపైనే దృష్టిపెట్టాల్సిందిగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వైఎస్ఆర్ సీపీ పిలుపునిస్తోంది." అని పార్టీ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చింది. 

Also Read: 'మీరు కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వారే' - వైఎస్ మరణానికి కాంగ్రెస్ కారణం కాదంటూ వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra MLCs: వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !
వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !
BLOs Death Issue:  SIR పని ఒత్తిడితో బీఎల్వోల బలవన్మరణాలు - ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు
SIR పని ఒత్తిడితో బీఎల్వోల బలవన్మరణాలు - ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు
Bhuta Shuddhi Vivaha: భూత శుద్ధి వివాహం అంటే ఏమిటి? సమంత - రాజ్ పెళ్లి ఏ పద్ధతిలో, ఎలా జరిగిందో తెలుసా?
భూత శుద్ధి వివాహం అంటే ఏమిటి? సమంత - రాజ్ పెళ్లి ఏ పద్ధతిలో, ఎలా జరిగిందో తెలుసా?
Congress MP Renuka Chowdhury : కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటులోకి కుక్కను తీసుకొచ్చే వీడియో వైరల్‌! 'ప్రజాస్వామ్యానికే అవమానం అంటున్న బీజేపీ!
కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటులోకి కుక్కను తీసుకొచ్చే వీడియో వైరల్‌! 'ప్రజాస్వామ్యానికే అవమానం అంటున్న బీజేపీ!
Advertisement

వీడియోలు

India vs South Africa First ODI in Ranchi | సౌతాఫ్రికా సూపర్ ఫైట్
Virat Kohli about Test Retirement | క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లి
Virat Kohli Records in Ranchi ODI | రాంచీలో కోహ్లీ రికార్డుల మోత
BCCI Summons to Gautam, Ajit Agarkar | గంభీర్‌ పై బీసీసీఐ కీలక నిర్ణయం!
ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra MLCs: వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !
వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !
BLOs Death Issue:  SIR పని ఒత్తిడితో బీఎల్వోల బలవన్మరణాలు - ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు
SIR పని ఒత్తిడితో బీఎల్వోల బలవన్మరణాలు - ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు
Bhuta Shuddhi Vivaha: భూత శుద్ధి వివాహం అంటే ఏమిటి? సమంత - రాజ్ పెళ్లి ఏ పద్ధతిలో, ఎలా జరిగిందో తెలుసా?
భూత శుద్ధి వివాహం అంటే ఏమిటి? సమంత - రాజ్ పెళ్లి ఏ పద్ధతిలో, ఎలా జరిగిందో తెలుసా?
Congress MP Renuka Chowdhury : కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటులోకి కుక్కను తీసుకొచ్చే వీడియో వైరల్‌! 'ప్రజాస్వామ్యానికే అవమానం అంటున్న బీజేపీ!
కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటులోకి కుక్కను తీసుకొచ్చే వీడియో వైరల్‌! 'ప్రజాస్వామ్యానికే అవమానం అంటున్న బీజేపీ!
Aan Paavam Pollathathu OTT : సొసైటీలో మగాడి బాధకు విలువేదీ? - భార్యా బాధితులకు పర్ఫెక్ట్ మూవీ 'ఆన్ పావమ్ పొల్లతత్తు'... తెలుగులోనూ స్ట్రీమింగ్
సొసైటీలో మగాడి బాధకు విలువేదీ? - భార్యా బాధితులకు పర్ఫెక్ట్ మూవీ 'ఆన్ పావమ్ పొల్లతత్తు'... తెలుగులోనూ స్ట్రీమింగ్
Income Tax Alert: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! డిసెంబర్‌లో ఈ 4 డెడ్‌లైన్స్ దాటితే ఫైన్, నోటీసులు
ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! డిసెంబర్‌లో ఈ 4 డెడ్‌లైన్స్ దాటితే ఫైన్, నోటీసులు
Nayanam Series OTT : ఓటీటీలోకి వరుణ్ సందేశ్ ఎంట్రీ - ఎక్స్‌క్లూజివ్ సైకో థ్రిల్లర్ సిరీస్ 'నయనం'... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వరుణ్ సందేశ్ ఎంట్రీ - ఎక్స్‌క్లూజివ్ సైకో థ్రిల్లర్ సిరీస్ 'నయనం'... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Palash Muchhal: స్మృతి మంధానాతో పెళ్లి వాయిదా తర్వాత తొలిసారి కనిపించిన పలాష్ ముచ్చల్..
స్మృతి మంధానాతో పెళ్లి వాయిదా తర్వాత తొలిసారి కనిపించిన పలాష్ ముచ్చల్..
Embed widget